పోలింగ్ కేంద్రాలపైనా కన్ను!
పోలింగ్ కేంద్రాలపైనా వైకాపా నేతల కన్ను పడింది. తమ అడ్డాలోకి మార్చుకుని పోలింగ్ రోజు తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు.
తమ అడ్డాలోకి మార్చుకునేందుకు వైకాపా కుటిలయత్నాలు
నేతల ప్రతిపాదనలకు తలూపుతున్న రిటర్నింగ్ అధికారులు
అన్నమయ్య జిల్లా సంబేపల్లె మండలం గుదియవాండ్లపల్లె పోలింగ్ కేంద్ర భవనం
- అన్నమయ్య జిల్లా సంబేపల్లె మండలం గుదియవాండ్లపల్లె పోలింగ్ కేంద్రంలో 500 మంది వరకు ఓటర్లు ఉండగా, దీనిని 170 మంది ఓటర్లున్న అంకిరెడ్డిగారిపల్లెకు మార్చడానికి ప్రతిపాదించారు. ఈ పోలింగ్ కేంద్రం పరిధిలో ఆరు గ్రామాలుండగా 1,036 ఓట్లు ఉన్నాయి. ప్రస్తుతమున్న కేంద్రం జాతీయ రహదారి పక్కన అన్ని గ్రామాలకు సౌకర్యవంతంగా ఉంది. దుద్యాల పోలింగ్ కేంద్రాన్ని మహమ్మద్నగర్కు మార్చేందుకు ప్రతిపాదించారు. నరసారెడ్డిపల్లె నుంచి దిగువ హరిజనవాడకు పోలింగ్ కేంద్రం మార్పునకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వైకాపాకు పట్టులేని గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలున్నందున మార్పు చేసేందుకు ఎత్తులు వేస్తున్నారు. కలికిరి, కలకడ, గుర్రంకొండ మండలాల్లో అవసరం లేకున్నా అదనపు పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదించి తమ ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నాలు సాగిస్తున్నారు.
- వైయస్ఆర్ జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో 21 పోలింగ్ కేంద్రాల మార్పునకు ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. వీటిలో అయిదు వరకు మార్పునకు హేతుబద్ధంగా ఉండగా మిగిలినవి నిబంధనలు అతిక్రమించి ప్రతిపాదించారు. వీటిపై తెదేపా ఆధారాలతో సహా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఖాజీపేట బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో రెండు పోలింగ్ కేంద్రాలున్నాయి. ఇవి అన్ని రకాలుగా సౌకర్యవంతంగా ఉండగా, వైకాపా నేత గోదాం వద్దకు మార్చేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. సాధారణంగా రెండు కిలోమీటర్లకుపైగా దూరం ఉన్న పక్షంలోనే ప్రతిపాదన స్వీకరించాలనే నిబంధన ఉంది. బాలికల ఉన్నత పాఠశాలకు ప్రతిపాదిత ప్రాంతానికి ఒకటిన్నర కిలోమీటరు దూరం మాత్రమే ఉంది.
ఈనాడు, కడప
పోలింగ్ కేంద్రాలపైనా వైకాపా నేతల కన్ను పడింది. తమ అడ్డాలోకి మార్చుకుని పోలింగ్ రోజు తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ఎత్తుగడలు వేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణకు ఎన్నికల సంఘం ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగపరిచే ప్రక్రియ నడుస్తోంది. అన్నమయ్య, వైయస్ఆర్ జిల్లాల్లో ఇష్టారాజ్యంగా ప్రతిపాదనలు ఇవ్వడం, అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు కొంతమంది రిటర్నింగ్ అధికారులు ఆమోదముద్ర వేయడం జరుగుతోంది. అభ్యంతరాలను ఏమాత్రం పట్టించుకోకపోవడం గమనార్హం. ఓటర్ల జాబితా పరిశీలనతోపాటు పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణకు ఎన్నికల సంఘం అనుమతిచ్చింది. సాధారణంగా అయితే వాగులు, వంకలు పరిగణనలోకి తీసుకోవడం.. పోలింగ్ కేంద్రం భవనాలు అనుకూలంగా లేని పక్షంలో మాత్రమే మార్పునకు పరిశీలన చేయాలి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకోకుండా ప్రతిపాదించడం, ఆపై ఆమోదించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలో ముసాయిదా ఓటర్ల జాబితాతోపాటు కొత్త పోలింగ్ కేంద్రాలకు నోటిఫికేషన్ ఇవ్వనున్నారు. వైకాపాకు అనుకూలంగా పోలింగ్ కేంద్రాల మార్పు, అదనపు కేంద్రాల ఏర్పాటు ప్రయత్నాలు రెండు జిల్లాల్లో జరుగుతున్నాయి. పోలింగ్ కేంద్రాల ప్రతిపాదనలపై చర్చించడానికి వైయస్ఆర్ జిల్లాకు సంబంధించి కడపలో గురువారం కలెక్టర్ విజయరామరాజు నేతృత్వంలో సమావేశం జరగనుండగా, అన్నమయ్య జిల్లాలో బుధవారం జరిగింది. అన్నమయ్య జిల్లాలో ప్రస్తుతం 1,577 పోలింగ్ కేంద్రాలుండగా, వీటి పరిధిలో 13,53,759 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటికే కొత్తగా ఓటర్ల నమోదు, ప్రత్యర్థుల ఓట్ల తొలగింపులు తదితర అక్రమాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతుండగా, పోలింగ్ కేంద్రాల మార్పుల్లోనూ నిబంధనలకు వ్యతిరేకంగా అడుగులు పడుతున్నాయి. వీటిపై అందించిన ఫిర్యాదులపై స్థానికంగా న్యాయం జరగని పక్షంలో ఉన్నతస్థాయికి తీసుకెళ్లి అక్రమాలను ఎండగడతామని ప్రజల నుంచి హెచ్చరికలు వస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Btech Ravi: తెదేపా నేత బీటెక్ రవికి బెయిల్ మంజూరు
[ 29-11-2023]
వైయస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జి, మాజీ ఎమ్మెల్సీ మారెడ్డి రవీంద్రనాథ్రెడ్డి (బీటెక్ రవి)(Btech Ravi)కి కడప జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. -
ఉపాధి మొక్కలు.. నిధులకు దిక్కులు!
[ 29-11-2023]
రాళ్ల నేలలో రతనాల పంటలు పండించాలి. మెట్ట భూముల్లో ఉద్యాన తోటల సాగుకు ఊతమివ్వాలి. సంప్రదాయ పైర్లతో నష్టపోయినా కర్షకులను పండ్ల తోటల వైపు నడిపించాలి. -
క్రీడల్లో మెరికలు... విజయ కిశోరాలు
[ 29-11-2023]
సాంకేతిక విద్యనభ్యసిస్తూ గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు జేఎన్టీయూ అనంతపురం తరపున సౌత్జోన్ స్థాయి పోటీలకు ఎంపికై క్రీడల్లో రాణిస్తున్నారు. -
పాలకుల పాపం... రైతులకు శాపం!
[ 29-11-2023]
గాలేరు-నగరి సుజల స్రవంతి పథకంలో అంతర్భాగంగా నిర్మించిన నర్రెడ్డి శివరామిరెడ్డి సర్వరాయసాగర్ జలాశయం నిర్వహణను పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. -
పాఠాలు అర్థం కావడం లేదమ్మా...!
[ 29-11-2023]
అమ్మా.. పాఠాలు సరిగా అర్థం కావడం లేదు.. అందరి ముందు చాలా అవమానంగా ఉందని ఆ యువతి బాధపడుతుండేది. -
రక్తదాత... సేవా ప్రదాత
[ 29-11-2023]
ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తదానం చేస్తూ, తన స్నేహితులతో చేయిస్తూ కమలాపురానికి చెందిన జూటూరు విజయ్కుమార్ ఆదర్శంగా నిలుస్తున్నారు. -
పెద్దదర్గాకు రేపు సీఎం జగన్ రాక
[ 29-11-2023]
కడప నగరంలో నిర్వహిస్తున్న పెద్దదర్గా ఉరుసు ఉత్సవాల్లో గురువారం ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పాల్గొననున్నారు. -
‘ఎమ్మెల్యేతో ప్రాణహాని ఉంది’
[ 29-11-2023]
వైకాపా కార్యకర్త బెనర్జీపై హత్యాయత్నం కేసులో భరత్కుమార్రెడ్డి, రామ్మోహన్రెడ్డిలను అక్రమంగా అరెస్టు చేశారని వారి కుటుంబసభ్యులు ఆరోపించారు. -
అరాచక పాలన అంతానికి ఐక్య పోరాటం
[ 29-11-2023]
రాష్ట్రంలో వైకాపా అరాచక పాలనను అంతం చేయడానికి ఎన్నికల యుద్ధంలో తెదేపా-జనసేన పార్టీలు ఐక్య పోరాటానికి సన్నద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైందని.. -
దారంతా మురుగు మడుగు... వారంతా ముందుకే అడుగు
[ 29-11-2023]
మురుగు మడుగులా తయారైన రహదారి పక్కనుంచే నడుచుకుంటూ వెళుతున్న వీరు రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, ప్రజాప్రతినిధులు, అధికారులు. -
డంపింగ్యార్డు కాదిది... సర్కారు బడి తీరిది!
[ 29-11-2023]
చిత్రంలో కనిపిస్తోంది డంపింగ్ యార్డు అనుకుంటే చెత్తలో కాలేసినట్లే. ప్రభుత్వ పాఠశాలలను మనబడి..నాడు-నేడు కింద రూ.కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్న పాలకుల మాటలకు ఇక్కడ పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయనడానికి ఈ చిత్రమే నిదర్శనం. -
నలుగురు ఎర్రచందనం దొంగల అరెస్టు
[ 29-11-2023]
ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న నలుగురిని అరెస్టు చేసినట్లు ఒంటిమిట్ట సీఐ పురుషోత్తమరాజు తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్లో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. -
ఎన్నికలకు సమాయత్తం!
[ 29-11-2023]
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సాధారణ ఎన్నికలకు జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ప్రత్యేకంగా దృష్టి సారించి సన్నాహాలు చేస్తోంది. -
ఆగండి... వెళ్లిపోవద్దు
[ 29-11-2023]
కడప నగరానికి అత్యంత సమీపంలోని నియోజకవర్గంలోని అధికార. వైకాపాకు చెందిన ఓ కౌన్సిలర్ తెదేపాలోకి చేరడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. కౌన్సిలర్ స్థాయి వ్యక్తి పార్టీ మారితే నష్టంగా ఉంటుందని భావించిన కీలక నేత వెంటనే అప్రమత్తమయ్యారు. -
భార్యను వేధించిన భర్త హతం
[ 29-11-2023]
మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని వేధించిన భర్తను కొడవలితో నరికి చంపిన సంఘటన సోమవారం రాత్రి కడప నగర శివారు సీకేదిన్నె మండలం సోమయాజులపల్లెలో చోటు చేసుకుంది. -
పోలీసుల అదుపులో దాడి ఘటన నిందితులు?
[ 29-11-2023]


తాజా వార్తలు (Latest News)
-
Nani: అందుకే వైజాగ్ నాకు ప్రత్యేకం: ‘హాయ్ నాన్న’ ఈవెంట్లో నాని
-
హైదరాబాద్ ఓటర్ల కోసం ‘పోల్ క్యూ రూట్’ పోర్టల్
-
Minerals Auction: ₹45 వేల కోట్ల విలువైన ఖనిజ బ్లాకులకు ఈ-వేలం షురూ
-
Ts election: దేవుడి తోడు ఆ గుర్తుకే ఓటేస్తా.. రూ.వెయ్యి తీసుకుని ఓటర్ల ప్రమాణం
-
Bumrah: బుమ్రా పోస్టు వెనుక బాధకు కారణమదేనేమో: క్రిష్ శ్రీకాంత్
-
Sandeep Vanga: ‘స్పిరిట్’.. ‘యానిమల్’లా కాదు.. మహేశ్తో సినిమా ఉంటుంది: సందీప్