అనాథలపై ఇదేనా వాత్సల్యం?
అనాథ పిల్లలకు చేదోడువాదోడుగా ఉండే ‘మిషన్ వాత్సల్య’ పథకం అటకెక్కింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో అమలు చేస్తున్న ఈ పథకానికి నిధులు విడుదల చేయడం లేదు.
ఆరు నెలలుగా అందని సాయం
లబ్ధిదారుల ఎంపికపై విచారిస్తున్న అధికారులు (పాత చిత్రం)
అనాథ పిల్లలకు చేదోడువాదోడుగా ఉండే ‘మిషన్ వాత్సల్య’ పథకం అటకెక్కింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో అమలు చేస్తున్న ఈ పథకానికి నిధులు విడుదల చేయడం లేదు. దీంతో లబ్దిదారులకు గత ఆరు నెలలుగా సాయం అందడం లేదు. మరోవైపు కొత్తగా దరఖాస్తు చేసుకున్నవారిలో అర్హులు ఎంతమంది ఉన్నారనేదానిపై ఇంతవరకు స్పష్టత రాలేదు. అసలు పథకం కొనసాగుతుందా? లేదా? అనే అయోమయం లబ్దిదారుల్లో నెలకొంది.
న్యూస్టుడే, జిల్లా సచివాలయం
మూడేళ్ల కిందట కరోనా బారిన పడి పలువురు మృతిచెందారు. దీంతో పలువురు చిన్నారులు అనాథలుగా మిగిలారు. ఈ నేపథ్యంలో తల్లి లేదా తండ్రి లేదా ఇద్దరూ మృతిచెందిన పిల్లలకు ఆర్థికసాయం అందించేందుకు కేంద్రప్రభుత్వం ‘మిషన్ వాత్సల్య’ పథకాన్ని 2022లో ప్రారంభించింది. ఇందులో భాగంగా ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 501 మంది ‘కొవిడ్-19’ బాధిత పిల్లలతో పాటు హెచ్ఐవీ బాధిత చిన్నారులు 123 మందికి ఆర్థిక సాయం కింద నెలకు రూ.4 వేలు అందిస్తోంది. ఈ ఏడాది మార్చి వరకు వారికి లబ్ధి చేకూరింది. ఏప్రిల్ నుంచి నిధులు విడుదల కాలేదు. దీంతో పథకం అమలుపై నీలినీడలు కమ్ముకున్నాయి.
పెద్దఎత్తున దరఖాస్తులు
‘మిషన్ వాత్సల్య’ పథకంలో అనాథలకే కాకుండా తల్లి లేక తండ్రిని కోల్పోయిన వారికీ సాయం అందిస్తున్నారు. ఇందులో కేంద్ర ప్రభుత్వం 60 శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు భరించాలి. స్త్రీ, శిశు సంక్షేమశాఖ పరిధిలోని బాలల సంరక్షణ సమితి ఈ ఏడాది పథకం కింద ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా 15,258 దరఖాస్తులు స్వీకరించింది. వీటన్నింటినీ వడపోసి నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. అప్పటి నుంచి ఇంతవరకు వీటికి సంబంధించి ఊసేలేదు. ఎప్పుడు వస్తాయో, ఎవరెవరికి మంజూరయ్యాయో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఒక ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే ఇద్దరికీ ఇవ్వాలా లేక ఒకరికే అనేది రాష్ట్రప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ మరింత వడపోసి కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే వారు తమ వాటాగా 60 శాతం నిధులను రాష్ట్రానికి మంజూరు చేస్తారు. మిగిలిన 40 శాతం మంజూరు చేసి లబ్ధిదారులకు అందించాల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉద్యోగులకే సరిగా వేతనాలు అందని పరిస్థితి నెలకొంది. పలు పథకాలకు నిధుల కొరత వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో ఈ ‘మిషన్ వాత్సల్య’ పథకానికి నిధులు కేటాయించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
నిధులు కేటాయిస్తే అందజేస్తాం
నిధులు వచ్చినంత వరకు లబ్ధిదారులకు పంపిణీ చేశాం. మళ్లీ విడుదల కాగానే వారికి అందిస్తాం. కొత్తగా తీసుకున్న దరఖాస్తులకు సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరానికి నిధులు కేటాయించాల్సి ఉంది.
శ్రీలక్ష్మి, పీడీ, స్త్రీ, శిశుసంక్షేమశాఖ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అధికార దర్పం!
[ 30-11-2023]
పీలేరు గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం వైకాపా కార్యకర్తల సమావేశం నిర్వహించడం విమర్శలకు దారితీసింది. తొలుత పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలోని ఖాళీ స్థలంలో సమావేశానికి ఏర్పాట్లు చేశామని, వర్షం కురవడంతో కార్యాలయంలో సమావేశం నిర్వహించాల్సి వచ్చిందని సర్పంచి జీనత్ షఫీ తెలిపారు -
దొంగ ఓట్ల లెక్క తేల్చండి
[ 30-11-2023]
ముసాయిదా ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్న అక్రమాలపై విచారించి దొంగ ఓట్లను తొలగించాలని కలెక్టర్ గిరీషకు బుధవారం తెదేపా జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్రాజు నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు. -
ఎమ్మెల్యేx పురాధ్యక్షురాలు
[ 30-11-2023]
మదనపల్లె పురపాలక సంఘంలో అధికార వైకాపా నేతల మధ్య కొనసాగుతున్న రాజకీయ వైరం తారస్థాయికి చేరింది. ఎమ్మెల్యే నవాజ్బాషా, పురాధ్యక్షురాలు మనూజ మధ్య నెలకొన్న వివాదం తాజాగా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి వద్దకు చేరింది. -
తవ్వుతున్నదెవరో... తరలిస్తున్నదెవరో?
[ 30-11-2023]
నదుల్లో ఇసుక తవ్వకాలు, రవాణా యథేచ్ఛగా సాగుతోంది. తవ్వుతున్నదెవరు, తరలిస్తున్నదెవరని ఎక్కడ ఎవరిని అడిగినా మాకు తెలియదనే సమాధానమే వస్తోంది. ఊరూపేరూ లేకుండానే అక్రమ రవాణా సాగుతుండడం గమనార్హం. -
బీటెక్ రవిపై ఎందుకంత కోపం?
[ 30-11-2023]
పులివెందుల.. ఇటీవల మరోసారి వార్తల్లోకి ఎక్కింది. మాజీ ఎమ్మెల్సీ, తెదేపా నియోజకవర్గ బాధ్యుడు బీటెక్ రవి అరెస్టుతో జిల్లాలో చర్చకు దారితీసింది. ప్రముఖుల పర్యటన సమయంలో విమానాశ్రయం ముఖద్వారం వద్ద ప్రవేశాల విషయంలో వివాదాలు చోటుచేసుకోవడం సర్వసాధారణం. -
ముస్లింలను మోసం చేసిన సీఎం జగన్ : తెదేపా
[ 30-11-2023]
ముస్లిం మైనార్టీలను ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మోసం చేస్తూనే ఉన్నారని, వారిని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తూ సంక్షేమాన్ని విస్మరించారని తెదేపా నేతలు ఆరోపించారు. -
‘దాచుకోవడం, దోచుకోవడమే వైకాపా ధ్యేయం’
[ 30-11-2023]
అధికార వైకాపా నేతలు తమ ప్రయోజనాల కోసమే సర్వరాయసాగర్ నీటిని ఉపయోగించుకుంటున్నారే తప్ప ఒక్క ఎకరాకు కూడా సాగునీరందించడం లేదని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ధ్వజమెత్తారు -
కరవు కాటుతో కందిపోతున్న కర్షకులు
[ 30-11-2023]
కరవు కాటుతో జిల్లాలో సాగవుతున్న ఖరీఫ్ కంది పంట వాడుముఖం పట్టింది. పంటను కాపాడుకోవడానికి రైతులు నానా తంటాలు పడుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్లో జిల్లాలో కంది సాధారణ విస్తీర్ణం 3,453 హెక్టార్లు కాగా, విపణిలో మంచి ధరలు ఉండడంతో అధికంగా 5,117 హెక్టార్లలో సాగు చేశారు -
వైకాపా పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం
[ 30-11-2023]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిందని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబరు రాష్ట్ర ఉపాధ్యక్షులు కొత్తపు మునిరెడ్డి, సింగంశెట్టి సుబ్బరామయ్య దుయ్యబట్టారు -
ఆహ్లాద తీరం... అభివృద్ధికి దూరం
[ 30-11-2023]
అక్కడ ఎటుచూసినా చూడముచ్చటేసే ఆహ్లాదకర వాతావరణం. కనుచూపుమేర జల సోయగం. ఎత్తయిన గిరులు.. పచ్చని చెట్లు రా రమ్మంటూ స్వాగతం పలుకుతాయి. అరుదైన పక్షిజాతులు, వన్యప్రాణులు సందడి చేస్తాయి -
జాతీయ స్థాయి పురస్కారానికి మొర్రాయిపల్లె పాఠశాల ఎంపిక
[ 30-11-2023]
విద్యా అమృత్ మహోత్సవ్ 2022-23లో భాగంగా వినూత్న బోధనలు చేపట్టిన ప్రాజెక్టుల్లో చాపాడు మండలం మొర్రాయిపల్లె ప్రాథమిక పాఠశాల ప్రథమ స్థానంలో నిలిచింది.