Pulivendula: పులివెందుల వరకూ అవినీతి ఊడలు!
నకిలీ సంతకాలు, పత్రాల పోకడలు వైయస్ఆర్ జిల్లా అంతటా చుట్టుకుని చివరకు ముఖ్యమంత్రి జగన్ ఇలాకా పులివెందుల వరకు చేరాయి.
రెవెన్యూలో అంతులేని అక్రమాలు
కలెక్టర్ సంతకమే ఫోర్జరీ చేసేసి...
అంత ధైర్యం ఎక్కడిదంటూ చర్చ
పులివెందులలో అక్రమ రిజిస్ట్రేషన్ జరిగిన భూమి ఇదే
నకిలీ సంతకాలు, పత్రాల పోకడలు వైయస్ఆర్ జిల్లా అంతటా చుట్టుకుని చివరకు ముఖ్యమంత్రి జగన్ ఇలాకా పులివెందుల వరకు చేరాయి. ఇప్పటివరకు వీఆర్వోలు, తహసీల్దార్ల సంతకాలు ఫోర్జరీ చేయగా, పులివెందుల వరకు అక్రమం చేరే సరికి ఏకంగా కలెక్టర్ సంతకమే ఫోర్జరీ చేయడంతో నిరభ్యంతర పత్రాలు (ఎన్వోసీˆ) అచ్చం అధికారికంగా రూపొందించినట్లు జారీ అయిపోయాయి. గతంలో చోటుచేసుకున్న ఘటనలు రాజకీయం చుట్టూ తిరగడం, వీటిపై అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో చివరకు వ్యవహారం పులివెందుల వరకు చేరి పెద్ద వ్యవహారమై కూర్చుంది. ఈ విషయం తెలిసి కలెక్టర్ విజయరామరాజు ఒక్కసారిగా అవాక్కయ్యారు. కఠిన చర్యలకు ఉపక్రమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. వ్యవహారం పోలీసుల చేతికెళ్లడంతో ఎంత వరకు తేల్చుతారన్నది సర్వత్రా ఆసక్తిగా మారింది.
ఈనాడు, కడప: లింగాల మండలం దొండ్లవాగు గ్రామానికి చెందిన వైకాపా కీలక నేత ఊటుకూరు విద్యానందరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై శ్రీపతి శ్రీనివాసులుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలు తయారు చేసి చుక్కల భూముల రిజిస్ట్రేషన్కు అందించారనే అభియోగాలు మోపారు. సీఎం సమీప బంధువులు సైతం కొనుగోలు చేసిన భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్లు రద్దయ్యాయి. సమగ్ర ఆధారాలతో సహా ఆర్డీవో వెంకటేశ్వర్లు శనివారం ఇచ్చిన నివేదికతోపాటు విద్యానందరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో కలిపి కేసు నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా వ్యవహారంపై పులివెందుల ఆర్డీవో వెంకటేశులు, తహసీˆల్దార్ మాధవ కృష్ణారెడ్డిని కలెక్టర్ కడపకు పిలిపించి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. విచారణ పురోగతిపై సమీక్షించారు.
కలెక్టర్ కార్యాలయం నుంచే వెలుగులోకి... : ఈ ఏడాది ఫిబ్రవరిలో నకిలీ ఎన్వోసీ ద్వారా చుక్కల భూముల రిజిస్ట్రేషన్లు జరిగాయి. ఇలాంటి పత్రాలు తాను జారీ చేయలేదని తెలుసుకున్న కలెక్టర్ విజయరామరాజు అంతర్గతంగా సమగ్ర విచారణ జరిపించగా 12 ఎన్వోసీలు బయటపడ్డాయి. వీటితోనే కె.వెలమవారిపల్లెలో సర్వే నంబరు 99/3లో 2.98 ఎకరాలు, 99/1లో 4.26 ఎకరాలు, 98/1లో 1.07 ఎకరాలు, అహోబిలపురంలో 2/2ఎలో 4.55 ఎకరాలు, 45/2లో 4.8 ఎకరాలు, యర్రగుడిపల్లెలో 135/2లో మూడెకరాలు, 135/2లో 3.87 ఎకరాలు, బాకరాపురంలో 58/2లో 4.91 ఎకరాలు, బ్రాహ్మణపల్లెలో 48/3లో 1.41 ఎకరాలు, చిన్నరంగాపురంలో 220/2లో 3.51 ఎకరాల చొప్పున 34.36 ఎకరాలకు అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగినట్లు తేలింది. వీటి వెనుక శ్రీపతి శ్రీనివాసులు హస్తం ఉన్నట్లు గుర్తించారు. ఈయనకు సాయం చేసిన రెవెన్యూ అధికారులు ఎవరన్నది విచారణలో తేలాల్సి ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి 7న నకిలీ ఎన్వోసీలు జారీ అయ్యాయి. అనంతరం రిజిస్ట్రేషన్లు జరిగాయి. పులివెందుల చుట్టూ కొత్తగా నిర్మించిన బాహ్య వలయ రహదారి సమీపంలో కె.వెలమవారిపల్లె, అహోబిలపురం, యర్రగుడిపల్లె, బాకరాపురం, బ్రాహ్మణపల్లె, చిన్నరంగాపురం తదితర గ్రామాల్లో చుక్కల భూములున్నాయి. వీటికి రిజిస్ట్రేషన్ జరగడంతో పట్టా భూములుగా మారిపోవడంతో ధరలు అమాంతం పెరిగిపోయాయి. వైకాపా నేత విద్యానందరెడ్డి రెండెకరాలు కొనుగోలు చేశారు. నకిలీ వ్యవహారం బయటపడడంతో మోసపోయానంటూ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. రిజిస్ట్రేషన్లు జరిగిన భూముల్లో వెంచర్లు వేయడంతోపాటు ఎలాంటి అనుమతుల్లేకుండా చాలా వరకు భవన నిర్మాణాలు జరిగిపోయాయి. పులివెందులలో నకిలీ పత్రాల ఆధారంగా భూముల అక్రమ రిజిస్ట్రేషన్లు జరిగిన నేపథ్యంలో పులివెందుల సబ్రిజిస్ట్రార్ కార్యాలయం ప్రమేయంపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క ఇంత పెద్దఎత్తున దందా సామాన్యులు చేయగలరా..? పెద్దల హస్తం లేనిదే.. ఇంత వ్యవహారం నడుస్తుందా..? అందులోనూ సీఎం ఇలాకాలో వేలుపెట్టడం అంత సులభమా...? తదితర ప్రశ్నలకు మాత్రం ఇప్పటివరకు సమాధానాలు దొరకలేదు. ఇంత పెద్ద వ్యవహారం విషయంలో పోలీసు విచారణ మందగమనంగా జరుగుతుండడంతో శ్రీపతి శ్రీనివాసుల వరకే కేసును పరిమితం చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పోలీసుల అదుపులో ఆ నలుగురు
ఫోర్జరీ సంతకాలు, నకిలీ ఎన్వోసీల తయారీలో పాత్ర ఉన్నట్లు అనుమానిస్తూ నలుగురిని పులివెందుల పోలీసులు విచారిస్తున్నారు. ఈ వ్యవహారంలో దళారీగా ఉన్న శ్రీపతి శ్రీనివాస్, వీఆర్వో కళానంద్రెడ్డి, సర్వేయర్లు సందీప్రెడ్డి, వాసుదేవరెడ్డిలు పోలీసుల అదుపులో ఉన్నారు. వీరిని అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరిలో ఇద్దరు రూ.కోట్లు వెచ్చించి భూములు కొనుగోలు చేయడం, పులివెందులలో హోటల్ నెలకొల్పడం వంటి లావాదేవీలను గుర్తించినట్లు సమాచారం. రెవెన్యూ విభాగానికి చెందిన ముగ్గురు దీర్ఘకాలంగా పులివెందులలో పనిచేస్తూ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కలసపాడులో తెదేపా నేత రితీశ్రెడ్డి పాదయాత్ర
[ 08-12-2023]
మండలంలో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఆధ్వర్యంలో తెదేపా గెలుపే ధ్యేయంగా ఆమె తనయుడు నియోజకవర్గ యువనాయకుడు రితీశ్రెడ్డి చేపట్టిన పాదయాత్ర శుక్రవారంతో రెండో రోజుకు చేరింది. -
ఎంపీడీవో కార్యాలయానికి తాళం వేసిన సర్పంచులు
[ 08-12-2023]
ఒంటిమిట్ట మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో తమను అగౌరవ పరిచారని సర్పంచులు ఎంపీడీవో కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. -
ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్ల సస్పెన్షన్
[ 08-12-2023]
కొండాపురం హెడ్ కానిస్టేబుల్ సుధాప్రసాద్, తాళ్లప్రొద్దుటూరు హెడ్ కానిస్టేబుల్ వరప్రసాద్లను సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. -
రాక్షస పాలన అంతానికి రోజులు దగ్గర పడ్డాయి
[ 08-12-2023]
వైకాపా రాక్షస పాలన అంతానికి రోజులు దగ్గర పడ్డాయని జనసేన నేత యల్లటూరి శ్రీనివాసరాజు ధ్వజమెత్తారు. -
ప్రొద్దుటూరు సబ్రిజిస్ట్రార్-2పై చర్యలకు డిమాండు
[ 08-12-2023]
అవినీతికి పాల్పడుతూ ఎవరైన ప్రశ్నిస్తే తన వెనకాల రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా ఉన్నాడని ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్-2 మహమ్మద్ రఫీ చెబుతున్నాడని ఆరోపిస్తూ ఆయనను సస్పెండ్ చేయాలని ఎమ్మెల్యే శివప్రసాదురెడ్డి డిమాండు చేశారు. -
చంద్రబాబును కలిసిన బీటెక్ రవి
[ 08-12-2023]
తెదేపా పులివెందుల నియోజకవర్గ బాధ్యుడు, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి గురువారం హైదరాబాద్లో తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలిశారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో చోటుచేసుకున్న వివిధ పరిణామాల అంశాలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. -
‘వైకాపా పాలనంతా భూ ఆక్రమణలు, అక్రమ కేసులే’
[ 08-12-2023]
మండలంలోని గంగాయపల్లె, రెడ్డిపల్లె వద్ద నుంచి గురువారం మాజీ ఎమ్మెల్యే విజయమ్మ ఆధ్వర్యంలో తెదేపా గెలుపే ధ్యేయంగా ఆమె తనయుడు నియోజకవర్గ యువ నాయకుడు రితేష్రెడ్డి చేపట్టిన పాతయాత్ర హోరెత్తింది. -
పనులు సాగక... శుద్ధిజలం అందక
[ 08-12-2023]
సీఎం జగన్ సొంత ఇలాకా పులివెందులలోని ఏడు మండలాల పరిధిలో 3.85 లక్షల మందికి వాటర్ గ్రిడ్ పథకం ద్వారా శుద్ధినీరు అందిస్తారని ఎదురు చూస్తున్న వారికి నిరాశే మిగులుతోంది. -
నీటి వృథా ఆపేందుకెళ్లి మృత్యు ఒడికి...
[ 08-12-2023]
ఖాజీపేట మండలం రావులపల్లె చెరువు తూములో ఇరుక్కుపోయి అదే గ్రామానికి చెందిన నీరుకట్టు బండి ప్రభాకర్ (50) గురువారం మృతి చెందారు. -
ఆశాల ఆందోళన
[ 08-12-2023]
ఆశా కార్యకర్తలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని ఏఐటీయూసీ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి వెంకటసుబ్బయ్య డిమాండు చేశారు. -
అడవి జంతువును చంపిన వైకాపా నాయకులు
[ 08-12-2023]
మాంసం కోసం వైకాపా నేతలు అడవి జంతువును వేటాడారు. పులివెందుల నియోజకవర్గం చక్రాయపేటకు చెందిన వైకాపా నేతలు విద్యుత్తు తీగ అమర్చి అడవి జంతువును చంపారు. -
పక్షం రోజుల్లో పూర్తయ్యేనా?
[ 08-12-2023]
కడప నగరంలో మూడు కీలక రహదారుల విస్తరణ పనులను ఈ ఏడాది డిసెంబరు మూడో వారం ముగిసేలోపు పూర్తి చేయాలని నగరపాలక సంస్థ అధికార యంత్రాంగం తీవ్ర కసరత్తు చేస్తోంది. -
సగమే తారు... ఎలా వెళతారు?
[ 08-12-2023]
ఉపముఖ్యమంత్రి అంజాద్బాషా ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గ కేంద్రమైన కడప నగరం నుంచి టక్కోలి మీదుగా ఆయన స్వగ్రామమైన సిద్ధవటం వెళ్లే రహదారి అధ్వానంగా తయారైంది. -
మార్చేదెప్పుడు... చేర్చేదెప్పుడు?
[ 08-12-2023]
ముసాయిదా ఓటర్ల జాబితా పరిశీలనపై వస్తున్న విమర్శలకు సరైన సమాధానం లభించడంలేదు. -
మిగ్జాంతో కౌలుకోలేని దెబ్బ!
[ 08-12-2023]
కౌలు రైతులకు కలిసి రావడంలేదు. పంటల సాగులో కష్టనష్టాలు వెంటాడుతున్నాయి. -
కుయ్ కుయ్... నయ్ నయ్!
[ 08-12-2023]
108 వాహనాల్లో ఆధునిక వసతులు కల్పిస్తూ, సకాలంలో బాధితులకు సేవలందిస్తున్నామన్న వైకాపా నాయకుల మాటలు నీటి మూటలుగా మిగిలిపోతున్నాయి. -
జిల్లాతో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి అనుబంధం
[ 08-12-2023]
తెలంగాణ ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణస్వీకారం చేసిన రేవంత్రెడ్డికి రాయచోటితో అనుబంధం ఉంది. -
అకాల వర్షం... రైతులకు నష్టం
[ 08-12-2023]
మదనపల్లె డివిజన్లో బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు కురిసిన అకాల వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu: రైతుల కష్టాలు జగన్కు ఏం తెలుసు?: చంద్రబాబు
-
Vadhuvu: రివ్యూ: వధువు.. అవికా గోర్ నటించిన వెబ్సిరీస్ ఎలా ఉందంటే?
-
TS Assembly: శనివారం ఉదయం కొలువుదీరనున్న తెలంగాణ శాసనసభ
-
Mamata Banerjee: ‘ఈ యుద్ధాన్ని మహువా గెలుస్తుంది’: బహిష్కరణను ఖండించిన దీదీ
-
Meenakshi Chaudhary: ‘గుంటూరు కారం’.. ఆరోజు ఎంతో కంగారుపడ్డా: మీనాక్షి చౌదరి
-
Team India: యువ టాలెంట్కు కొదవేం లేదు.. జట్టు కూర్పే భారత్కు సవాల్: మాజీ క్రికెటర్