ఆ నలుగురిదే హస్తం
పులివెందులలో సంచలనం రేపిన భూ కుంభకోణం వ్యవహారాన్ని ఎట్టకేలకు పోలీసులు తేల్చారు. కలెక్టర్ సంతకం ఫోర్జరీ, నకిలీ నిరభ్యంతర పత్రాల తయారీలో పాత్ర ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు.
పులివెందుల భూకుంభకోణంలో ఇద్దరు సర్వేయర్లు, వీఆర్వో, స్థిరాస్తి వ్యాపారి అరెస్టు
ఎన్వోసీ పత్రాల తయారీకి ఉపయోగించిన సామగ్రి స్వాధీనం
వివరాలు వెల్లడిస్తున్న పులివెందుల అర్బన్ సీఐ రాజు, పక్కన అధికారులు
పులివెందుల, న్యూస్టుడే: పులివెందులలో సంచలనం రేపిన భూ కుంభకోణం వ్యవహారాన్ని ఎట్టకేలకు పోలీసులు తేల్చారు. కలెక్టర్ సంతకం ఫోర్జరీ, నకిలీ నిరభ్యంతర పత్రాల తయారీలో పాత్ర ఉన్న నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో తేలిన విషయాలను పులివెందుల అర్బన్ సీఐ రాజు మంగళవారం విలేకరులకు వెల్లడించారు. డీకేటీ, చుక్కల భూముల క్రయవిక్రయాలకు వీలుగా ఎన్వోసీ పత్రాలు తెప్పిస్తామని నమ్మించి నకిలీ పత్రాలను అందజేసి మోసం చేశారంటూ లింగాల మండలం దొండ్లవాగు గ్రామానికి చెందిన ఊటుకూరు విద్యానంద్రెడ్డి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ నెల 24న కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయని వెల్లడించారు. సర్వే నంబరు 99/3, 99/1, 2/2ఎ, 45/2, 135/2, 58/2, 48/3, 220/2, మరో రెండు సర్వే నంబర్లలోని 35 ఎకరాలకు సంబంధించి ఎన్వోసీలు తయారు చేసి ఇస్తామని ఆ భూముల యజమానులతో నిందితులు వీఆర్వో గూడూరు కళానందరెడ్డి, సర్వేయర్లు అంకిరెడ్డిపల్లె సందీప్రెడ్డి, చీపాటి వాసుదేవరెడ్డి, స్థిరాస్తి వ్యాపారి శ్రీపతి శ్రీనివాసులు ఒప్పందం చేసుకున్నట్లు వివరించారు. వీరు భూయజమానుల నుంచి రూ.లక్షలు వసూలు చేశారని, చివరకు నకిలీ ఎన్వోసీ పత్రాలు సృష్టించి కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేసి అందజేశారన్నారు. ఈ నేపథ్యంలో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి నుంచి నకిలీ ఎన్వోసీ పత్రాలు తయారు చేసేందుకు ఉపయోగించిన కంప్యూటరు మానిటర్, సీపీయూ, ప్రింటర్, ఇతరత్రా పరికరాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సమావేశంలో ఎస్.ఐ.సత్యనారాయణ, ఎ.ఎస్.ఐ.చంద్రశేఖర్ పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అధికార దర్పం!
[ 30-11-2023]
పీలేరు గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం వైకాపా కార్యకర్తల సమావేశం నిర్వహించడం విమర్శలకు దారితీసింది. తొలుత పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలోని ఖాళీ స్థలంలో సమావేశానికి ఏర్పాట్లు చేశామని, వర్షం కురవడంతో కార్యాలయంలో సమావేశం నిర్వహించాల్సి వచ్చిందని సర్పంచి జీనత్ షఫీ తెలిపారు -
దొంగ ఓట్ల లెక్క తేల్చండి
[ 30-11-2023]
ముసాయిదా ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్న అక్రమాలపై విచారించి దొంగ ఓట్లను తొలగించాలని కలెక్టర్ గిరీషకు బుధవారం తెదేపా జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్రాజు నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు. -
ఎమ్మెల్యేx పురాధ్యక్షురాలు
[ 30-11-2023]
మదనపల్లె పురపాలక సంఘంలో అధికార వైకాపా నేతల మధ్య కొనసాగుతున్న రాజకీయ వైరం తారస్థాయికి చేరింది. ఎమ్మెల్యే నవాజ్బాషా, పురాధ్యక్షురాలు మనూజ మధ్య నెలకొన్న వివాదం తాజాగా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి వద్దకు చేరింది. -
తవ్వుతున్నదెవరో... తరలిస్తున్నదెవరో?
[ 30-11-2023]
నదుల్లో ఇసుక తవ్వకాలు, రవాణా యథేచ్ఛగా సాగుతోంది. తవ్వుతున్నదెవరు, తరలిస్తున్నదెవరని ఎక్కడ ఎవరిని అడిగినా మాకు తెలియదనే సమాధానమే వస్తోంది. ఊరూపేరూ లేకుండానే అక్రమ రవాణా సాగుతుండడం గమనార్హం. -
బీటెక్ రవిపై ఎందుకంత కోపం?
[ 30-11-2023]
పులివెందుల.. ఇటీవల మరోసారి వార్తల్లోకి ఎక్కింది. మాజీ ఎమ్మెల్సీ, తెదేపా నియోజకవర్గ బాధ్యుడు బీటెక్ రవి అరెస్టుతో జిల్లాలో చర్చకు దారితీసింది. ప్రముఖుల పర్యటన సమయంలో విమానాశ్రయం ముఖద్వారం వద్ద ప్రవేశాల విషయంలో వివాదాలు చోటుచేసుకోవడం సర్వసాధారణం. -
ముస్లింలను మోసం చేసిన సీఎం జగన్ : తెదేపా
[ 30-11-2023]
ముస్లిం మైనార్టీలను ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మోసం చేస్తూనే ఉన్నారని, వారిని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తూ సంక్షేమాన్ని విస్మరించారని తెదేపా నేతలు ఆరోపించారు. -
‘దాచుకోవడం, దోచుకోవడమే వైకాపా ధ్యేయం’
[ 30-11-2023]
అధికార వైకాపా నేతలు తమ ప్రయోజనాల కోసమే సర్వరాయసాగర్ నీటిని ఉపయోగించుకుంటున్నారే తప్ప ఒక్క ఎకరాకు కూడా సాగునీరందించడం లేదని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ధ్వజమెత్తారు -
కరవు కాటుతో కందిపోతున్న కర్షకులు
[ 30-11-2023]
కరవు కాటుతో జిల్లాలో సాగవుతున్న ఖరీఫ్ కంది పంట వాడుముఖం పట్టింది. పంటను కాపాడుకోవడానికి రైతులు నానా తంటాలు పడుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్లో జిల్లాలో కంది సాధారణ విస్తీర్ణం 3,453 హెక్టార్లు కాగా, విపణిలో మంచి ధరలు ఉండడంతో అధికంగా 5,117 హెక్టార్లలో సాగు చేశారు -
వైకాపా పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం
[ 30-11-2023]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిందని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబరు రాష్ట్ర ఉపాధ్యక్షులు కొత్తపు మునిరెడ్డి, సింగంశెట్టి సుబ్బరామయ్య దుయ్యబట్టారు -
ఆహ్లాద తీరం... అభివృద్ధికి దూరం
[ 30-11-2023]
అక్కడ ఎటుచూసినా చూడముచ్చటేసే ఆహ్లాదకర వాతావరణం. కనుచూపుమేర జల సోయగం. ఎత్తయిన గిరులు.. పచ్చని చెట్లు రా రమ్మంటూ స్వాగతం పలుకుతాయి. అరుదైన పక్షిజాతులు, వన్యప్రాణులు సందడి చేస్తాయి -
జాతీయ స్థాయి పురస్కారానికి మొర్రాయిపల్లె పాఠశాల ఎంపిక
[ 30-11-2023]
విద్యా అమృత్ మహోత్సవ్ 2022-23లో భాగంగా వినూత్న బోధనలు చేపట్టిన ప్రాజెక్టుల్లో చాపాడు మండలం మొర్రాయిపల్లె ప్రాథమిక పాఠశాల ప్రథమ స్థానంలో నిలిచింది.


తాజా వార్తలు (Latest News)
-
Stock market: స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు
-
Ranbir Kapoor: ఒకప్పుడు ఫ్లోర్ తుడిచి.. ఇప్పుడు స్టార్గా నిలిచి.. రణ్బీర్ ప్రయాణమిదీ
-
Narayana Murthy: ఆ రంగంలో మూడు షిఫ్టులు ఉండాలి: ఇన్ఫీ నారాయణమూర్తి
-
Srinagar NIT: శ్రీనగర్ ఎన్ఐటీలో ఆందోళన.. ఇబ్బందుల్లో తెలుగు విద్యార్థులు
-
Kiraak RP: సైలెంట్గా.. కిరాక్ ఆర్పీ వివాహం
-
Ashish Nehra: టీ20లకు భారత్ కోచ్ పదవి.. ఆశిశ్ నెహ్రా వద్దనడానికి కారణాలు ఇవేనా?