కాంగ్రెస్కు సానుకూల పవనాలు
దేశంలో కాంగ్రెస్కు సానుకూల పవనాలు వీస్తున్నాయని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జంగా గౌతమ్ పేర్కొన్నారు.
మాట్లాడుతున్న పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జంగా గౌతమ్, పక్కన తులసిరెడ్డి, తదితరులు
కడప గ్రామీణ, న్యూస్టుడే: దేశంలో కాంగ్రెస్కు సానుకూల పవనాలు వీస్తున్నాయని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జంగా గౌతమ్ పేర్కొన్నారు. జిల్లాకు వచ్చిన ఆయన మంగళవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పార్టీ కన్వీనర్ల సమావేశంలో మాట్లాడుతూ కేంద్రంలో భాజపా, రాష్ట్రంలో వైకాపాను ఓడించడమే తమ పార్టీ ప్రధాన ధ్యేయమన్నారు. ఏపీలోనూ తమ పార్టీ వైపు ప్రజలు మొగ్గుచూపుతున్నారని చెప్పారు. ఇసుక, మైనింగ్, లిక్కర్, దాడులు, దౌర్జన్యాలతో రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోందని ఆరోపించారు. క్షేత్రస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కాంగ్రెస్ బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అందులో భాగంగానే జిల్లాల వారీగా అసెంబ్లీ నియోజకవర్గాల కన్వీనర్లతో సమీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. సమావేశంలో పీసీసీ మీడియా ఛైర్మన్ తులసిరెడ్డి, నగర అధ్యక్షుడు విష్ణుప్రీతంరెడ్డి, నాయకులు జకరయ్య, నజీర్అహ్మద్, శ్రీనివాసరెడ్డి, పార్థసారథిరెడ్డి, నియోవజకర్గ కన్వీనర్లు, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అధికార దర్పం!
[ 30-11-2023]
పీలేరు గ్రామపంచాయతీ కార్యాలయంలో బుధవారం వైకాపా కార్యకర్తల సమావేశం నిర్వహించడం విమర్శలకు దారితీసింది. తొలుత పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలోని ఖాళీ స్థలంలో సమావేశానికి ఏర్పాట్లు చేశామని, వర్షం కురవడంతో కార్యాలయంలో సమావేశం నిర్వహించాల్సి వచ్చిందని సర్పంచి జీనత్ షఫీ తెలిపారు -
దొంగ ఓట్ల లెక్క తేల్చండి
[ 30-11-2023]
ముసాయిదా ఓటర్ల జాబితాలో చోటు చేసుకున్న అక్రమాలపై విచారించి దొంగ ఓట్లను తొలగించాలని కలెక్టర్ గిరీషకు బుధవారం తెదేపా జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్రాజు నాయకులతో కలిసి వినతిపత్రం అందజేశారు. -
ఎమ్మెల్యేx పురాధ్యక్షురాలు
[ 30-11-2023]
మదనపల్లె పురపాలక సంఘంలో అధికార వైకాపా నేతల మధ్య కొనసాగుతున్న రాజకీయ వైరం తారస్థాయికి చేరింది. ఎమ్మెల్యే నవాజ్బాషా, పురాధ్యక్షురాలు మనూజ మధ్య నెలకొన్న వివాదం తాజాగా రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి వద్దకు చేరింది. -
తవ్వుతున్నదెవరో... తరలిస్తున్నదెవరో?
[ 30-11-2023]
నదుల్లో ఇసుక తవ్వకాలు, రవాణా యథేచ్ఛగా సాగుతోంది. తవ్వుతున్నదెవరు, తరలిస్తున్నదెవరని ఎక్కడ ఎవరిని అడిగినా మాకు తెలియదనే సమాధానమే వస్తోంది. ఊరూపేరూ లేకుండానే అక్రమ రవాణా సాగుతుండడం గమనార్హం. -
బీటెక్ రవిపై ఎందుకంత కోపం?
[ 30-11-2023]
పులివెందుల.. ఇటీవల మరోసారి వార్తల్లోకి ఎక్కింది. మాజీ ఎమ్మెల్సీ, తెదేపా నియోజకవర్గ బాధ్యుడు బీటెక్ రవి అరెస్టుతో జిల్లాలో చర్చకు దారితీసింది. ప్రముఖుల పర్యటన సమయంలో విమానాశ్రయం ముఖద్వారం వద్ద ప్రవేశాల విషయంలో వివాదాలు చోటుచేసుకోవడం సర్వసాధారణం. -
ముస్లింలను మోసం చేసిన సీఎం జగన్ : తెదేపా
[ 30-11-2023]
ముస్లిం మైనార్టీలను ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి మోసం చేస్తూనే ఉన్నారని, వారిని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తూ సంక్షేమాన్ని విస్మరించారని తెదేపా నేతలు ఆరోపించారు. -
‘దాచుకోవడం, దోచుకోవడమే వైకాపా ధ్యేయం’
[ 30-11-2023]
అధికార వైకాపా నేతలు తమ ప్రయోజనాల కోసమే సర్వరాయసాగర్ నీటిని ఉపయోగించుకుంటున్నారే తప్ప ఒక్క ఎకరాకు కూడా సాగునీరందించడం లేదని భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ధ్వజమెత్తారు -
కరవు కాటుతో కందిపోతున్న కర్షకులు
[ 30-11-2023]
కరవు కాటుతో జిల్లాలో సాగవుతున్న ఖరీఫ్ కంది పంట వాడుముఖం పట్టింది. పంటను కాపాడుకోవడానికి రైతులు నానా తంటాలు పడుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్లో జిల్లాలో కంది సాధారణ విస్తీర్ణం 3,453 హెక్టార్లు కాగా, విపణిలో మంచి ధరలు ఉండడంతో అధికంగా 5,117 హెక్టార్లలో సాగు చేశారు -
వైకాపా పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యం
[ 30-11-2023]
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిందని ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబరు రాష్ట్ర ఉపాధ్యక్షులు కొత్తపు మునిరెడ్డి, సింగంశెట్టి సుబ్బరామయ్య దుయ్యబట్టారు -
ఆహ్లాద తీరం... అభివృద్ధికి దూరం
[ 30-11-2023]
అక్కడ ఎటుచూసినా చూడముచ్చటేసే ఆహ్లాదకర వాతావరణం. కనుచూపుమేర జల సోయగం. ఎత్తయిన గిరులు.. పచ్చని చెట్లు రా రమ్మంటూ స్వాగతం పలుకుతాయి. అరుదైన పక్షిజాతులు, వన్యప్రాణులు సందడి చేస్తాయి -
జాతీయ స్థాయి పురస్కారానికి మొర్రాయిపల్లె పాఠశాల ఎంపిక
[ 30-11-2023]
విద్యా అమృత్ మహోత్సవ్ 2022-23లో భాగంగా వినూత్న బోధనలు చేపట్టిన ప్రాజెక్టుల్లో చాపాడు మండలం మొర్రాయిపల్లె ప్రాథమిక పాఠశాల ప్రథమ స్థానంలో నిలిచింది.


తాజా వార్తలు (Latest News)
-
Andhrapradesh news: సీఎం నిర్ణయాలా కాకమ్మ కబుర్లా?
-
ఒప్పంద సమయంలో తప్పించుకున్నారా!
-
Jogi ramesh: ఒక రాష్ట్రంలోనే ఓటు ఉండేలా చర్యలు తీసుకోవాలి
-
టీసీ కొలువంటే నమ్మేశారట.. కోటు ఇస్తే రైలెక్కేశారట!
-
అమెరికాలో ముగ్గురు బంధువులను కాల్చి చంపిన భారతీయ విద్యార్థి
-
యువకుణ్ని చంపి 400 ముక్కలు చేసిన తండ్రీకుమారులు