మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్టు
కడప ఎన్జీవో కాలనీలో శుక్రవారం రాత్రి జరిగిన మహిళ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని చిన్నచౌకు సీఐ నరసింహారెడ్డి తెలిపారు. ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఘటన వివరాలను మంగళవారం చిన్నచౌకు ఠాణాలో జరిగిన సమావేశంలో సీఐ వెల్లడించారు.
వివరాలు వెల్లడిస్తున్న చిన్నచౌకు సీఐ నరసింహారెడ్డి, పక్కన ఎస్.ఐ.లు రవికుమార్ తులసీనాగప్రసాద్, సిబ్బంది
చిన్నచౌకు(కడప), న్యూస్టుడే: కడప ఎన్జీవో కాలనీలో శుక్రవారం రాత్రి జరిగిన మహిళ హత్యకు వివాహేతర సంబంధమే కారణమని చిన్నచౌకు సీఐ నరసింహారెడ్డి తెలిపారు. ఈ కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఘటన వివరాలను మంగళవారం చిన్నచౌకు ఠాణాలో జరిగిన సమావేశంలో సీఐ వెల్లడించారు. కడప ఎన్జీవో కాలనీకి చెందిన తాటిచెర్ల లక్ష్మి(48)కి రెండేళ్ల కిందట భర్త చనిపోయాడు. ఆమెకు ఇద్దరు ఆడపిల్లలు కాగా, వారికి వివాహాలయ్యాయి. లక్ష్మికి జమ్మలమడుగుకు చెందిన రామాంజినేయులుతో పరిచయం ఏర్పడింది. వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. రామాంజినేయులకు ఇది వరకే పెళ్లై భార్యా, ఇద్దరు పిల్లలున్నారు. సహజీవనం విషయం అతని భార్యకు తెలియడంతో వారిద్దరూ గొడవ పడ్డారు. దీంతో రామాంజినేయులు ఇటీవల లక్ష్మి వద్దకు వెళ్లడం లేదు. దీంతో ఆమె ఫోన్ చేసి తన వద్దకు రాకపోతే అతని కుటుంబాన్ని బయటికి ఈడ్చుతానని, పోలీసుస్టేషన్లో కేసు పెడతానని బెదిరించింది. దీంతో ఎలాగైనా లక్ష్మిని అడ్డు తొలగించుకోవాలని పథకం వేశాడు. ఈ నెల 22వ తేదీ రాత్రి అతడు జమ్మలమడుగు నుంచి కడపకు వచ్చాడు. లక్ష్మితో కలసి భోజనం చేశాడు. ఆమె పడుకున్న తరువాత అర్ధరాత్రి రోకలిబండ తీసుకుని తలపై బలంగా కొట్టాడు. తీవ్రగాయాలతో లక్ష్మి అక్కడిక్కడే మృతి చెందింది. మృతురాలి కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుని గాలింపు కోసం పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. దర్యాప్తులో భాగంగా రామాంజినేయులు ఆర్టీసీ బస్టాండు వద్ద సంబంధిత ఆర్ఐ వద్ద లొంగిపోయినట్లు సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్సైలు రవికుమార్, నాగతులసీ ప్రసాద్, సిబ్బంది ఉన్నారు.
ఎర్రచందనం స్మగ్లర్లు...
నిందితులను చూపుతున్న ఎఫ్ఆర్వో రమణారెడ్డి, పక్కన ట్రైనీ ఐఎఫ్ఎస్ సుభం, అటవీశాఖ సిబ్బంది
బద్వేలు, న్యూస్టుడే: ఎర్రచందనం దుంగలను అక్రమంగా తరలిస్తున్న అయిదుగురు స్మగ్లర్లను మంగళవారం బద్వేలు అటవీశాఖ అధికారులు అరెస్టు చేశారు. వీరి నుంచి 12 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. అటవీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రచందనం దుంగలు అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో మంగళవారం లంకమల అభయారణ్యంలోని రాణిబావి సమీపంలో తనిఖీలు నిర్వహించారు. బ్రహ్మంగారిమఠం మండలం జెడ్ కొత్తపల్లెకు చెందిన శేఖర్, రాజన్న, బాలస్వామి, సుందర్రావు, బాలరాజు ఎర్రచందనం దుంగలను అక్రమ రవాణాకు సిద్ధం చేస్తుండగా అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇందులో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విజమూరుకు చెందిన రామనాథ్రెడ్డి ప్రధాన సూత్రదారిగా ఉన్నారని వారు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉపాధి మొక్కలు.. నిధులకు దిక్కులు!
[ 29-11-2023]
రాళ్ల నేలలో రతనాల పంటలు పండించాలి. మెట్ట భూముల్లో ఉద్యాన తోటల సాగుకు ఊతమివ్వాలి. సంప్రదాయ పైర్లతో నష్టపోయినా కర్షకులను పండ్ల తోటల వైపు నడిపించాలి. -
క్రీడల్లో మెరికలు... విజయ కిశోరాలు
[ 29-11-2023]
సాంకేతిక విద్యనభ్యసిస్తూ గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు జేఎన్టీయూ అనంతపురం తరపున సౌత్జోన్ స్థాయి పోటీలకు ఎంపికై క్రీడల్లో రాణిస్తున్నారు. -
పాలకుల పాపం... రైతులకు శాపం!
[ 29-11-2023]
గాలేరు-నగరి సుజల స్రవంతి పథకంలో అంతర్భాగంగా నిర్మించిన నర్రెడ్డి శివరామిరెడ్డి సర్వరాయసాగర్ జలాశయం నిర్వహణను పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. -
పాఠాలు అర్థం కావడం లేదమ్మా...!
[ 29-11-2023]
అమ్మా.. పాఠాలు సరిగా అర్థం కావడం లేదు.. అందరి ముందు చాలా అవమానంగా ఉందని ఆ యువతి బాధపడుతుండేది. -
రక్తదాత... సేవా ప్రదాత
[ 29-11-2023]
ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి రక్తదానం చేస్తూ, తన స్నేహితులతో చేయిస్తూ కమలాపురానికి చెందిన జూటూరు విజయ్కుమార్ ఆదర్శంగా నిలుస్తున్నారు. -
పెద్దదర్గాకు రేపు సీఎం జగన్ రాక
[ 29-11-2023]
కడప నగరంలో నిర్వహిస్తున్న పెద్దదర్గా ఉరుసు ఉత్సవాల్లో గురువారం ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి పాల్గొననున్నారు. -
‘ఎమ్మెల్యేతో ప్రాణహాని ఉంది’
[ 29-11-2023]
వైకాపా కార్యకర్త బెనర్జీపై హత్యాయత్నం కేసులో భరత్కుమార్రెడ్డి, రామ్మోహన్రెడ్డిలను అక్రమంగా అరెస్టు చేశారని వారి కుటుంబసభ్యులు ఆరోపించారు. -
అరాచక పాలన అంతానికి ఐక్య పోరాటం
[ 29-11-2023]
రాష్ట్రంలో వైకాపా అరాచక పాలనను అంతం చేయడానికి ఎన్నికల యుద్ధంలో తెదేపా-జనసేన పార్టీలు ఐక్య పోరాటానికి సన్నద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైందని.. -
దారంతా మురుగు మడుగు... వారంతా ముందుకే అడుగు
[ 29-11-2023]
మురుగు మడుగులా తయారైన రహదారి పక్కనుంచే నడుచుకుంటూ వెళుతున్న వీరు రైల్వేకోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, ప్రజాప్రతినిధులు, అధికారులు. -
డంపింగ్యార్డు కాదిది... సర్కారు బడి తీరిది!
[ 29-11-2023]
చిత్రంలో కనిపిస్తోంది డంపింగ్ యార్డు అనుకుంటే చెత్తలో కాలేసినట్లే. ప్రభుత్వ పాఠశాలలను మనబడి..నాడు-నేడు కింద రూ.కోట్లతో అభివృద్ధి చేస్తున్నామన్న పాలకుల మాటలకు ఇక్కడ పరిస్థితులు పూర్తి భిన్నంగా ఉన్నాయనడానికి ఈ చిత్రమే నిదర్శనం. -
నలుగురు ఎర్రచందనం దొంగల అరెస్టు
[ 29-11-2023]
ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్న నలుగురిని అరెస్టు చేసినట్లు ఒంటిమిట్ట సీఐ పురుషోత్తమరాజు తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్లో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. -
ఎన్నికలకు సమాయత్తం!
[ 29-11-2023]
కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సాధారణ ఎన్నికలకు జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ప్రత్యేకంగా దృష్టి సారించి సన్నాహాలు చేస్తోంది. -
ఆగండి... వెళ్లిపోవద్దు
[ 29-11-2023]
కడప నగరానికి అత్యంత సమీపంలోని నియోజకవర్గంలోని అధికార. వైకాపాకు చెందిన ఓ కౌన్సిలర్ తెదేపాలోకి చేరడానికి ఏర్పాట్లు చేసుకున్నారు. కౌన్సిలర్ స్థాయి వ్యక్తి పార్టీ మారితే నష్టంగా ఉంటుందని భావించిన కీలక నేత వెంటనే అప్రమత్తమయ్యారు. -
భార్యను వేధించిన భర్త హతం
[ 29-11-2023]
మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని వేధించిన భర్తను కొడవలితో నరికి చంపిన సంఘటన సోమవారం రాత్రి కడప నగర శివారు సీకేదిన్నె మండలం సోమయాజులపల్లెలో చోటు చేసుకుంది. -
పోలీసుల అదుపులో దాడి ఘటన నిందితులు?
[ 29-11-2023]


తాజా వార్తలు (Latest News)
-
Airtel vs Jio: నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్తో ఎయిర్టెల్, జియో ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే..
-
Uttarakhand Tunnel: ముందే చెప్పా.. ఆ 41 మంది బయటకు వస్తారని..!: ఆర్నాల్డ్ డిక్స్
-
Anand Mahindra: సమష్టి కృషితో ఏదైనా సాధ్యమే.. కార్మికుల రాకపై ఆనంద్ మహీంద్రా ట్వీట్
-
Vishal: సీబీఐ ఆఫీస్కు వెళ్తానని జీవితంలో అనుకోలేదు: హీరో విశాల్
-
BCCI-Dravid: రాహుల్.. అప్పటి వరకు కోచ్గా కొనసాగు.. బీసీసీఐ మరో ప్రతిపాదన
-
Uttarakhand Tunnel: తొలుత భయపడ్డాం.. కానీ, నమ్మకాన్ని వీడలేదు: మోదీతో కార్మికుల సంభాషణ