Ts News: అటవీ సిబ్బంది దాడి చేశారని ఆదివాసీ మహిళల ఆందోళన
భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అటవీ సిబ్బంది దాడి చేశారని ఆదివాసీ మహిళలు ఆరోపణలు చేయడం కలకలం రేపుతోంది. కట్టెల కోసం అడవిలోకి వెళ్తే దాడి చేశారని నలుగురు మహిళలు
భద్రాద్రి: భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా అటవీ సిబ్బంది దాడి చేశారని ఆదివాసీ మహిళలు ఆరోపణలు చేయడం కలకలం రేపుతోంది. కట్టెల కోసం అడవిలోకి వెళ్తే దాడి చేశారని నలుగురు మహిళలు ఆరోపిస్తున్నారు. ముల్కలపల్లి మండలం సాకివాగు గుత్తికోయ గ్రామంలో నిన్న మధ్యాహ్నం చోటుచేసుకున్నట్లు భావిస్తున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ‘‘నిన్న మధ్యాహ్నం గుత్తికోయ గ్రామానికి చెందిన నలుగురు మహిళలు కట్టెల కోసం అడవిలోకి వెళ్లారు. ఆ సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మహేశ్.. అడవిలోకి ఎందుకు వచ్చారంటూ వారిని అక్కడనుంచి తరిమేశారు. వారిలో అసభ్యంగా ప్రవర్తిస్తూ.. దుర్భాషలాడారు. మహిళలు పారిపోయే క్రమంలో నలుగురు మహిళల్లో ఒకరు అక్కడే ఉన్న గోతిలో పడిపోవడంతో ఆమె వస్త్రాలను కూడా లాగాడంటూ’’ మహిళలు ఆరోపణలు చేస్తున్నారు. ఈ ఘటనపై మహిళలు ఎవరికీ చెప్పుకోలేదు. శుక్రవారం గ్రామానికి వెళ్లిన ముల్కలపల్లి మండలానికి చెందిన నాయకులతో మహిళలు చెప్పడంతో జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అటవీ అధికారి తీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.
ఆదివాసీ మహిళలపై జరిగిన దాడిని సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి పోటు రంగారావు ఖండించారు.ఆదివాసీ మహిళలపై అమానుషంగా ప్రవర్తించడం దారుణమన్నారు. ఆదివాసీ, గిరిజనులపై అటవీ అధికారుల దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయని మండిపడ్డారు. ఆదివాసీ మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇదే ఘటనపై ముల్కలపల్లి అటవీశాఖ అధికారి రవికిరణ్ను సంప్రదించగా.. సాకివాగు అటవీ ప్రాంతంలో ఎటువంటి సంఘటన జరగలేదన్నారు. బుధవారం అటవీ ప్రాంతానికి వచ్చిన కొంతమందిని కట్టెలు కొట్టవద్దని మహేశ్ హెచ్చరించిన మాట వాస్తవమేనన్నారు. మహిళలపై ఎలాంటి దాడికి పాల్పడలేదని.. వారి ఆరోపణల్లో నిజం లేదన్నారు. ఈ సంఘటనపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
లారీ ఢీకొని భవన నిర్మాణ కార్మికుడి మృతి
[ 20-04-2024]
ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీకొని భవన నిర్మాణ కార్మికుడు మృతి చెందిన ఘటన ఖమ్మం ఎన్టీఆర్ కూడలిలో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం... -
కాంగ్రెస్ కంచుకోట.. మానుకోట!
[ 20-04-2024]
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర సభ విజయవంతమైంది. కాంగ్రెస్ అభ్యర్థిగా పోరిక బలరాంనాయక్ నామపత్రం దాఖలు చేసిన సందర్భంగా ఎన్టీఆర్ -
ఇక లెక్కలే.. మిగిలాయి..!
[ 20-04-2024]
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో నిర్వహించిన కల్యాణ బ్రహ్మోత్సవాలు 23 వరకు కొనసాగనున్నప్పటికీ ప్రధాన వేడుక పూర్తి కావడంతో ఆదాయ వ్యయాల పరిశీలనపై అధికారులు దృష్టి సారించారు. -
సీతారాములకు ఘనంగా మహదాశీర్వచనం
[ 20-04-2024]
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి వారి ఆలయంలో కల్యాణం అనంతరం పట్టాభిషేకాన్ని తిలకించిన భక్తులకు శుక్రవారం సదస్యం పేరిట మరో ఉత్సవం వీక్షించే భాగ్యం దక్కింది.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం