logo

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి

అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన ఘటన కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. మల్లెల విజయదుర్గ(37)కు తెనాలికి చెందిన వెంకట రామకృష్ణకు 19 ఏళ్ల కిందట

Published : 19 Jan 2022 03:31 IST

కృష్ణలంక, న్యూస్‌టుడే: అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి చెందిన ఘటన కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. మల్లెల విజయదుర్గ(37)కు తెనాలికి చెందిన వెంకట రామకృష్ణకు 19 ఏళ్ల కిందట వివాహమైంది. వారికి ఇద్దరు సంతానం. ఏడాది కిందట భర్త మరణించడంతో ఆమె కుమార్తెతో కలిసి విజయవాడ కృష్ణలంకలో ఉంటున్న తల్లి వద్దకు వచ్చేసింది. కుమారుడు మాత్రం తెనాలిలోని నానమ్మ ఇంటి వద్దే ఉంటున్నాడు. కాటూరి వారి వీధిలోని ఇంటి కింది భాగంలో ఆమె తల్లి అబ్బూరి పద్మ, తమ్ముడు సురేష్‌ కుటుంబం, మూడో అంతస్తులో విజయదుర్గ ఉంటున్నారు. కుమారుడు తన వద్దకు రావడం లేదని ఆమె తరచూ బాధపడుతోంది. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్నం సుమారు 3గంటల సమయంలో కుమార్తె లలితా వైష్ణవి కళాశాల నుంచి ఇంటికి రాగా, ఎంతసేపటికీ తల్లి తలుపు తీయకపోవడంతో విషయాన్ని అమ్మమ్మ, మావయ్యలకు చెప్పింది. వాళ్లు పైకి వచ్చి తలుపును తెరిచి చూడగా ఫ్యాన్‌ కొక్కేనికి చీరతో విజయదుర్గ ఉరివేసుకుని, కనిపించింది. ఆమెను కిందకు దింపి 108లో చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని