చెడ్డీ గ్యాంగ్ను విచారించిన తాడేపల్లి పోలీసులు
తాడేపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో గతేడాది డిసెంబరు నాలుగో తేదీ తాడేపల్లి, కుంచనపల్లిలో నేరాలకు పాల్పడిన చెడ్డీ గ్యాంగ్ను పోలీసులు మూడు రోజుల పాటు విచారణ జరిపారు.
తాడేపల్లి, న్యూస్టుడే: తాడేపల్లి పోలీసుస్టేషన్ పరిధిలో గతేడాది డిసెంబరు నాలుగో తేదీ తాడేపల్లి, కుంచనపల్లిలో నేరాలకు పాల్పడిన చెడ్డీ గ్యాంగ్ను పోలీసులు మూడు రోజుల పాటు విచారణ జరిపారు. ముగ్గురు సభ్యులను పీటీ వారెంట్ ద్వారా కస్టడీకి తీసుకుని విచారించారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగి వీవీఐపీలు నివాసం ఉండే రెయిన్బో విల్లాస్లోకి ప్రవేశించిన తీరుతో పాటు కుంచనపల్లిలోని ఓ బహుళ అంతస్తులో చోరీ చేసిన ఘటనపై అప్పట్లో చెడ్డీ గ్యాంగ్పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కుంచనపల్లిలోని ఓ బహుళ అంతస్తులో వెండి వస్తువులను అపహరించినట్లు గ్యాంగ్ విచారణలో అంగీకరించినట్లు విశ్వనీయ సమాచారం.ఈ మేరకు వాటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. పది మంది సభ్యుల్లో ముగ్గురిని మాత్రమే విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. మిగిలిన ఏడుగురి కోసం మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లో రెండు ప్రత్యేక బృందాలు నేటికీ గాలిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
పరిశ్రమలు తేవడం తెదేపా బ్రాండ్.. తరిమికొట్టడం జగన్ బ్రాండ్: చంద్రబాబు
-
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
-
తొలిసారి చేతులు కలిపిన దిగ్గజాలు.. అదానీ కంపెనీలో రిలయన్స్కు వాటా
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..