logo

సాగు కలిసి రాలేదనేమనస్తాపంతో రైతు మృతి

మండలంలోని బయ్యవరం గ్రామానికి చెందిన దొడ్డా సత్యనారాయణ (60) శనివారం గుండెపోటుతో కన్నుమూశారు. గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు ఆయనకు ఉన్న పొలం రెండెకరాల్లో మిర్చి, మరో రెండెకరాల్లో పత్తి సాగు

Published : 23 Jan 2022 04:01 IST

సత్యనారాయణ (పాతచిత్రం)

క్రోసూరు, న్యూస్‌టుడే: మండలంలోని బయ్యవరం గ్రామానికి చెందిన దొడ్డా సత్యనారాయణ (60) శనివారం గుండెపోటుతో కన్నుమూశారు. గ్రామస్థులు తెలిపిన వివరాల మేరకు ఆయనకు ఉన్న పొలం రెండెకరాల్లో మిర్చి, మరో రెండెకరాల్లో పత్తి సాగు చేశారు. ప్రకృతి వైపరీత్యాలతో పంటలు అనకూలంగా లేవని మనస్తాపానికి గురై ఆవేదన చెందుతున్నారు. శుక్రవారం రాత్రి అందరితో కలివిడిగా ఉన్న సత్యనారాయణ శనివారం తెల్లవారుజాముకు తీవ్రమైన గుండె నొప్పితో మృతి చెందారు. ఈయనకు భార్య కోటేశ్వరమ్మ ఉన్నారు. విషయం తెలుసుకున్న వీఆర్వో కృష్ణారావు వివరాలు నమోదు చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని