వృద్ధురాలిపై యువకుడి అత్యాచారం
గుంటూరు గ్రామీణ మండలం వెంగళాయపాలెంలో దారుణం చోటుచేసుకుంది. నల్లపాడు పోలీసులు తెలిపిన వివరాల మేరకు వెంగళాయపాళెంకు చెందిన వృద్ధురాలిపై అదే గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువకుడు శుక్రవారం రాత్రి అత్యాచారానికి పాల్పడ్డాడు.
లాడ్జిసెంటర్, న్యూస్టుడే: గుంటూరు గ్రామీణ మండలం వెంగళాయపాలెంలో దారుణం చోటుచేసుకుంది. నల్లపాడు పోలీసులు తెలిపిన వివరాల మేరకు వెంగళాయపాళెంకు చెందిన వృద్ధురాలిపై అదే గ్రామానికి చెందిన 22 ఏళ్ల యువకుడు శుక్రవారం రాత్రి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వారు రాగా అతను పారిపోయాడు. మళ్లీ కొద్దిసేపటి తరువాత వచ్చిన యువకుడు ఆమె నోటిలో గుడ్డలు కుక్కి అఘాయిత్యానికి పాల్పడుతుండగా కుక్కలు చేరి మొరగడం మొదలుపెట్టాయి. సమీపంలోని వారు వచ్చి నిందితుడికి దేహశుద్ధి చేశారు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
‘పొరుగు వారితో ఘర్షణ వద్దు’: వేదాలు వల్లించిన నవాజ్ షరీఫ్ కుమార్తె
-
ముంబయి ‘డీఆర్ఎస్ సిగ్నల్’పై ట్రోలింగ్.. టామ్ మూడీ ట్వీట్ వైరల్!
-
రాష్ట్రాన్ని జగన్ అప్పుల కుప్పగా మార్చారు: చంద్రబాబు
-
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
-
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
-
బెంగాల్లో సీపీఐ(ఎం), కాంగ్రెస్ భాజపా కోసం పని చేస్తున్నాయి: మమతా బెనర్జీ