యువ వైద్యుడి మృత్యువాత
మృత్యు శకటంలా దూసుకువచ్చిన టిప్పర్ ఓ యువ వైద్యుడిని బలి తీసుకుంది. ఈ ఘటన శనివారం రాత్రి హైదరాబాద్ నగరం హుమాయునగర్ ఠాణా పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ నారాయణరెడ్డి కథనం ప్రకారం.. విజయవాడకు చెందిన రాంగోపాల్ కుటుంబం
విశ్వకల్యాణ్ (పాత చిత్రం)
హైదరాబాద్(మెహిదీపట్నం), న్యూస్టుడే: మృత్యు శకటంలా దూసుకువచ్చిన టిప్పర్ ఓ యువ వైద్యుడిని బలి తీసుకుంది. ఈ ఘటన శనివారం రాత్రి హైదరాబాద్ నగరం హుమాయునగర్ ఠాణా పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ నారాయణరెడ్డి కథనం ప్రకారం.. విజయవాడకు చెందిన రాంగోపాల్ కుటుంబం దశాబ్దం కిత్రం నగరానికి వచ్చి, కార్వాన్లో విశ్వేశ్వర్నగర్లో స్థిరపడింది. ఆయన కుమారుడు విశ్వకల్యాణ్(25) ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. పీజీ ప్రవేశ పరీక్షకు సన్నద్ధం అవుతున్నాడు. శనివారం బైక్పై అమీర్పేటలోని కోచింగ్ సెంటర్కు వెళ్లి, రాత్రి 11.30 గంటల సమయంలో ఇంటికి తిరిగి వస్తున్నాడు. హుమాయున్నగర్ సంగీత మొబైల్స్ వద్ద, వెనుక నుంచి వేగంగా వచ్చిన టిప్పర్ కల్యాణ్ బైక్ను ఢీకొట్టింది. తీవ్రగాయాల పాలైన యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. రోడ్డుపై వెళ్తున్న వారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనాస్థలికి వెళ్లి ఐడీ కార్డు ఆధారంగా కుటుంబీకులకు ఫోన్ చేసి చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
దీదీకి ఆ ధైర్యం లేదు: అమిత్ షా
-
ఆడిషన్ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్ హీరోయిన్
-
గుంపులో స్మార్ట్ఫోన్లు కొట్టేస్తే.. చిన్న ట్రిక్తో పట్టేశాడు..!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
రివ్యూ: ఆర్టికల్ 370.. యామి గౌతమ్, ప్రియమణి నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
-
మద్యం మత్తులో విమాన సిబ్బందిపై ప్రయాణికుడి దాడి