logo

ఏడాదిన్నర చిన్నారితో కలిసి కుటుంబం ఆత్మహత్య

ఆర్థిక సమస్యలు ఓ కుటుంబం ఉసురు తీశాయి. ఏడాదిన్నర శిశువుతో సహా దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకోడేరు మండలం

Published : 12 Jan 2021 18:26 IST

పాలకోడేరు: ఆర్థిక సమస్యలు ఓ కుటుంబం ఉసురు తీశాయి. ఏడాదిన్నర శిశువుతో సహా దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకోడేరు మండలం కుమదవళ్లిలో విషాదం నింపింది. వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవించే ఓ వ్యక్తి, భార్య బిడ్డలకు పరుగుల మందు తాగించి తానూ సేవించాడు. జామాయిల్‌ తోటలో ముగ్గురి మృతదేహాలు చూసిన గ్రామస్థులు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. తెలిసినవారితో గల ఆర్థికలావాదేవీల్లో మోసపోవడమే ఘటనకు గల కారణమని స్థానికులు చెబుతున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

ఇదీ చదవండి
ఏపీ ఈసీ కార్యదర్శి వాణీమోహన్‌ తొలగింపు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని