logo

Ap News: మున్నేరు పరిసర ప్రాంతాల్లో ఐదుగురు పిల్లలు గల్లంతు.. ముమ్మరంగా గాలింపు

కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం ఏలూరు గ్రామం వద్ద మున్నేరు పరిసర ప్రాంతాల్లో ఐదుగురు పిల్లలు అదృశ్యమయ్యారు. గ్రామానికి చెందిన 8 నుంచి 13 ఏళ్ల మధ్య వయసు

Updated : 11 Jan 2022 12:57 IST

చందర్లపాడు‌: కృష్ణాజిల్లా చందర్లపాడు మండలం ఏలూరు గ్రామం వద్ద మున్నేరు పరిసర ప్రాంతాల్లో ఐదుగురు పిల్లలు గల్లంతయ్యారు. గ్రామానికి చెందిన 8 నుంచి 13 ఏళ్ల మధ్య వయసు కలిగిన ఐదుగురు పిల్లలు మధ్యాహ్నం సమయంలో ఇంటి నుంచి మున్నేరు వైపు వెళ్లారు. రాత్రి అవుతున్నా పిల్లలు ఇంటికి రాకపోవడంతో ఆందోళనలతో ఉన్న  తల్లిదండ్రులు.. వారి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. పిల్లల బట్టలు, వారి సైకిళ్లు మున్నేరు ఒడ్డున ఉండటంతో ఆ పరిసర ప్రాంతాల్లో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. గ్రామస్థులు సైతం మున్నేరు పరిసర ప్రాంతాల్లో పిల్లల కోసం గాలిస్తున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికీ పిల్లల ఆచూకీ తెలియకపోవడంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. గల్లంతైన వారు చరణ్, బాల యేసు, అజయ్, రాకేష్, సనిగా పోలీసులు గుర్తించారు. స్థానిక ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు సంఘటనా ప్రాంతానికి చేరుకొని గాలింపు చర్యలను పర్యవేక్షిస్తున్నారు. మున్నేరులోకి నాటు పడవలను పంపించి పరిసర ప్రాంతాల్లో గాలిస్తున్నారు. రాత్రి కావడంతో చీకట్లో వెతుకులాటకు ఇబ్బంది అవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని