Hyd: ఉగ్రవాదులుంటున్నా ఉలుకూ పలుకూలేదు
బిహార్లోని దర్భంగా రైల్వేస్టేషన్లో పేలుడు సంభవించింది. ఈ పేలుడు వెనుక ఇద్దరు ఉగ్రవాదులు నాసిర్ మాలిక్, ఇమ్రాన్ మాలిక్లున్నారని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్.ఐ.ఎ) అధికారులు గుర్తించారు. వీరు మల్లేపల్లిలోని ఒక ప్రార్థన మందిరం వద్ద వస్త్రదుకాణాన్ని నిర్వహిస్తున్నారని తెలుసుకున్నారు.
వారి కార్యకలాపాలపై పోలీసుల దృష్టి అంతంతే
ఈనాడు, హైదరాబాద్: బిహార్లోని దర్భంగా రైల్వేస్టేషన్లో పేలుడు సంభవించింది. ఈ పేలుడు వెనుక ఇద్దరు ఉగ్రవాదులు నాసిర్ మాలిక్, ఇమ్రాన్ మాలిక్లున్నారని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్.ఐ.ఎ) అధికారులు గుర్తించారు. వీరు మల్లేపల్లిలోని ఒక ప్రార్థన మందిరం వద్ద వస్త్రదుకాణాన్ని నిర్వహిస్తున్నారని తెలుసుకున్నారు. వారిని మూడు రోజుల క్రితం అదుపులోకి తీసుకుని దిల్లీకి తరలించారు.
‘‘బెంగళూరు.. హైదరాబాద్ నగరాల్లోని ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ప్రముఖులను చంపేందుకు హుజీ ఉగ్రవాద సంస్థ కార్యచరణ రూపొందించిందని బెంగళూరు క్రైమ్బ్రాంచ్ పోలీసులు తొమ్మిదేళ్ల క్రితం తెలుసుకున్నారు. హైదరాబాద్లో హుజి సంస్థ తరఫున పనిచేస్తున్న పాతబస్తీ యువకుడు ఉబేద్-ఉర్-రహిమాన్ను బెంగళూరు నుంచి వచ్చి అరెస్ట్ చేశారు.
- రాజధాని నగరంలో ఉగ్రవాదులు, ఉగ్రసంస్థల కార్యకలాపాలకు సజీవ సాక్ష్యాలు ఈ సంఘటనలు. ఈ రెండు ఘటనల్లో ఉగ్రవాదులను హైదరాబాద్ పోలీసులు పట్టుకోలేదు. బయట నుంచి వచ్చిన పోలీసు అధికారులు అరెస్ట్ చేశారు. ఉగ్రవాదులను అరెస్ట్ చేసేంత వరకు మన పోలీసులకు విషయం తెలీదు.
సమాచారమా? తెలీదు.. దక్షిణాది రాష్ట్రాల్లోని బెంగళూరు, హైదరాబాద్, కోయంబత్తూరు, కోచి పరిసర ప్రాంతాల్లో ఉగ్రసంస్థలు రెండు దశాబ్దాలుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. బెంగళూరు క్రైమ్బ్రాంచ్ పోలీసులు, కేరళ ఏటీఎస్ (ఉగ్రవాద వ్యతిరేక దళం) పోలీసులు ఎప్పటికప్పుడు ఉగ్రకలాపాలపై సమాచారం సేకరిస్తున్నారు. కేంద్ర నిఘా సంస్థలతో సమాచారాన్ని పంచుకుంటున్నారు. ఇందుకు భిన్నంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధుల్లో చాపకింది నీరులా ఇండియన్ ముజాహిదీన్, లష్కర్-ఎ-తోయిబా, హుజీ వంటి ఉగ్ర సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నా ఆయా సంస్థల సభ్యులు రహస్యంగా ఇక్కడ ఉంటున్నా పోలీసులకు తెలీదు. ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్, జాతీయ దర్యాప్తు సంస్థ పోలీస్ అధికారులు ఇక్కడి వచ్చి ఉగ్రవాదులు, వారి సానుభూతి పరులను అరెస్ట్ చేసినప్పుడు మాత్రమే పోలీసులకు తెలుస్తోంది..
అడ్డాగా పాతబస్తీ, మల్లేపల్లి, టోలీచౌకీ.. ఉగ్రసంస్థలు తమ కార్యకలాపాలను నిర్వహించేందుకు పాతబస్తీ, మల్లేపల్లి, టోలీచౌకీలను కేంద్రాలుగా ఎంచుకున్నాయని నిఘా సంస్థల దర్యాప్తులో తేలింది. పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట, ఫలక్నుమా, సంతోష్నగర్ ప్రాంతాలు, పశ్చిమ మండలంలోని మల్లేపల్లి, టోలీచౌకీల్లో ఎక్కువగా ఉగ్రవాద సంస్థల సభ్యులు నివాసముంటున్నారు. వీరిలో చాలామంది వస్త్రవ్యాపారులు, ఫర్నిచర్ దుకాణాల యజమానులుగా వ్యవహరిస్తున్నారు. మరికొందరు ఐటీ సంస్థల్లో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తున్నారు. మల్లేపల్లి ప్రాంతంలో ఎనిమిదేళ్లలో ఆరుగురు ఉగ్రవాదులను కేంద్ర నిఘా వర్గాలు అరెస్ట్ చేశాయి. తాజాగా ఎన్.ఐ.ఎ.కు పట్టుబడిన నాసిర్మాలిక్ ఇరవై ఏళ్ల క్రితం నుంచి మల్లేపల్లిలోనే ఉంటున్నాడు. మధ్యలో రెండుసార్లు పాకిస్థాన్ వెళ్లొచ్చాడని విచారణలో తేలింది. పదేళ్లుగా వస్త్ర వ్యాపారం నిర్వహిస్తున్న మాలిక్ సోదరులపై మన పోలీసులకు ఎలాంటి అనుమానం రాలేదు.
భద్రతలో నిర్లక్ష్యం.. ‘రైల్వే’నే నిదర్శనం
సికింద్రాబాద్ పార్సిల్ బుకింగ్ కార్యాలయం నుంచి వెళ్లిన ఓ పార్సిల్.. బిహార్లోని దర్భంగా రైల్వేస్టేషన్లో పేలింది. ఈ ఘటన వెనుక ఉగ్ర కుట్ర కోణాలున్నాయని ఎన్ఐఏ విచారణలో వెల్లడవుతోంది. ఇప్పటికే సదరు పార్సిల్ను బుకింగ్ చేసిన వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇంత జరుగుతున్నా.. రైల్వేపరంగా ఎలాంటి అప్రమత్తత లేదు. పార్సిల్ బుకింగ్ ఎప్పటిలాగే నిర్లక్ష్యంగా కొనసాగుతోంది. పేలుడు తదితర పదార్థాలను గుర్తించే మెటల్ డిటెక్టర్లు, స్కానర్లు ఇప్పటికీ ఏర్పాటు చేయలేదు. పార్సిల్ బుకింగ్ కేంద్రం, రైల్వేస్టేషన్లో పటిష్ట బందోబస్తుకే పరిమితమయ్యారు.
అడుగడుగునా భద్రతా లోపాలు.. సికింద్రాబాద్ స్టేషన్లో భద్రత గాలిలో దీపంలా మారింది. స్టేషన్ ప్రవేశ మార్గాల్లోనే సరకులు, బ్యాగులు స్కాన్ అయిపోవాలి. లేని పక్షంలో స్కానర్ యంత్రంలో వాటిని వేసిన తర్వాతే స్టేషన్లోకి అనుమతించాలి. మెట్రోలో మాదిరి ప్రయాణికుల చేతి సంచులూ స్కాన్ చేయాల్సిందే. లక్షలాది ప్రయాణికులను, వారి సామగ్రిని తనిఖీ చేయడం కత్తిమీద సాములాంటిదే. కానీ భద్రత దృష్ట్యా తప్పదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
హోరెత్తించి.. దాఖలు చేసి
[ 25-04-2024]
రాజధాని పరిధిలోని నాలుగు పార్లమెంటు స్థానాలకు బుధవారం 84 మంది నామినేషన్లు దాఖలు చేశారు. -
కంటోన్మెంట్ కాంగ్రెస్కు సర్వే గండి
[ 25-04-2024]
ఒకవైపు కాంగ్రెస్ పార్టీ భారాస, భాజపా నేతలను పార్టీలోకి చేర్చుకొనే ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఆ పార్టీ సీనియర్ నేతలు కొందరు అధిష్ఠానంపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. -
రంగారెడ్డి మెరిసింది.. మేడ్చల్ మురిసింది
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో గ్రేటర్ హైదరాబాద్ రాష్ట్రంలోనే ముందు నిలిచింది. రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం విడుదల చేసిన ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు సత్తా చాటాయి. -
సెలవుల ఆనందం.. అంతలోనే విషాదం
[ 25-04-2024]
ఆ బాలిక తొమ్మిదో తరగతి పరీక్షలు రాసింది. పదో తరగతికి సంబంధించి తరగతులు మొదలుకానున్నాయి.. కొద్ది రోజులు బంధువుల ఇంటికి వెళ్లి ఆనందంగా గడుపుదామనుకుంది. -
తపాలా ఓటుకు చకచకా ఏర్పాట్లు
[ 25-04-2024]
ఎన్నికల విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బందికి తపాలా ఓటు సౌకర్యాన్ని కల్పించే ప్రక్రియను జీహెచ్ఎంసీ విస్తృతంగా నిర్వహించింది. -
గ్రేటర్ నాడి పట్టేదెలా?
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికలకు సరిగ్గా 20 రోజులే ఉంది. గ్రేటర్లో ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
కంటోన్మెంట్లో 14 నామపత్రాల దాఖలు
[ 25-04-2024]
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికకు సంబంధించి బుధవారం పదిమంది 14సెట్ల నామపత్రాలను దాఖలు చేశారు. -
సత్తా చాటిన పేదింటి బిడ్డలు
[ 25-04-2024]
జీవనోపాధి కోసం నగరానికి వలస వచ్చిన సామాన్య కుటుంబంలో ఆనందోత్సాహం వెల్లివిరిసింది. -
ప్రథమంలో మెరుగు..ద్వితీయంలో దిగువకు
[ 25-04-2024]
ఇంటర్ ఫలితాల్లో జిల్లా బాలికలు సత్తా చాటారు. రెండు సంవత్సరాల నుంచి జిల్లాలో బాలికలే పై చేయిగా రాణిస్తుండగా ఈసారి కూడా హవా కొనసాగించారు. -
రిటైల్ వ్యాపారానికి నగరం అత్యంత అనుకూలం
[ 25-04-2024]
అనేక వసతులు, సహేతుక ధరలు, నాణ్యతతో ఉత్పత్తులను వినియోగదారులకు అందించే రిటైల్ రంగంతో అలరారుతున్న హైదరాబాద్.. దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన నగరంగా నిలుస్తోందని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్ అన్నారు. -
గ్రామాల్లో ప్రచార హోరు!
[ 25-04-2024]
పార్లమెంటు ఎన్నికల పోలింగ్ తేదీ సమీపిస్తుండటంతో జిల్లాలో జాతీయ పార్టీలు ప్రచారంలో జోరు పెంచాయి. -
అన్ని వర్గాల చూపు భాజపా వైపే: కొండా
[ 25-04-2024]
చేవెళ్ల గడ్డపై భాజపా జెండా ఎగరవేయడం ఖాయమని పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్రెడ్డి అన్నారు. -
ఓటు నమోదులో.. యువోత్సాహం
[ 25-04-2024]
జిల్లాలో అర్హులైన యువ ఓటర్లు పేరు నమోదుచేసుకుని ఓటుహక్కు పొందేందుకు ఉత్సాహం చూపుతున్నారు. -
దోమకాటుతో దేశ ఉత్పాదకతపై ప్రభావం
[ 25-04-2024]
గోద్రెజ్ కన్జూమర్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ బ్రాండ్ గుడ్నైట్ సర్వే ప్రకారం ప్రజలు దోమకాటుబారిన పడుతుండటంతో 58శాతం దేశ ఉత్పాదకతపై ప్రభావం పడుతోంది. -
ఎన్నికల వ్యయ, పోలీసు పరిశీలకుల నియామకం
[ 25-04-2024]
మల్కాజిగిరి లోక్సభ ఎన్నికల నిర్వహణలో భాగంగా జిల్లాకు వ్యయ, పోలీసు పరిశీలకులను ఎన్నికల కమిషన్ నియమించిందని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి గౌతమ్ తెలిపారు. -
నేడు ఐపీఎల్ మ్యాచ్.. ట్రాఫిక్ మళ్లింపు
[ 25-04-2024]
ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో గురువారం సన్రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ సందర్భంగా ట్రాఫిక్ను దారి మళ్లిస్తున్నట్లు రాచకొండ సీపీ తరుణ్జోషి పేర్కొన్నారు. -
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
[ 25-04-2024]
మంగళ్హాట్ ఠాణా డీఐ(డిటెక్టివ్ ఇన్స్పెక్టర్) మహేందర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడినట్లు సమాచారం. -
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం
[ 25-04-2024]
జూ పార్కులో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహించనున్నట్లు డిప్యూటీ క్యూరేటర్ నాగమణి బుధవారం తెలిపారు. -
చిట్టీల వ్యాపారం.. రూ.4 కోట్ల మోసం
[ 25-04-2024]
దశాబ్దకాలంగా అందరితో సఖ్యతగా ఉంటూ ఇరుగుపొరుగు నమ్మకం పొందిన దంపతులు 34 మందిని నిలువునా ముంచేశారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!