logo

నంద్యాలలో యూట్యూబ్‌ ఛానల్‌విలేకరి దారుణ హత్య

నంద్యాల పట్టణంలో ఓ యూట్యూబ్‌ ఛానల్‌ విలేకరిగా పనిచేస్తున్న కేశవ (32) ఆదివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం.. పట్టణంలోని ఎన్జీవో కాలనీలో నివాసముంటున్న కేశవ, అతని సహ ఉద్యోగి ప్రతాప్‌తో

Updated : 29 Jan 2022 14:42 IST

కేశవ (పాతచిత్రం)

నంద్యాల నేరవిభాగం, న్యూస్‌టుడే: నంద్యాల పట్టణంలో ఓ యూట్యూబ్‌ ఛానల్‌ విలేకరిగా పనిచేస్తున్న కేశవ (32) ఆదివారం రాత్రి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం.. పట్టణంలోని ఎన్జీవో కాలనీలో నివాసముంటున్న కేశవ, అతని సహ ఉద్యోగి ప్రతాప్‌తో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నారు. రెండో పట్టణ పోలీసుస్టేషన్‌లో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్‌, అతడి సోదరుడు తమను ఆపారని విలేకరి మిత్రుడు ప్రతాప్‌ తెలిపారు. మాట్లాడాలని పిలవడంతో బైక్‌పై ఉన్న కేశవ పక్కకు వెళ్లారన్నారు. ఇంతలో ఒక్కసారిగా కానిస్టేబుల్‌ తమ్ముడు స్క్రూ డ్రైవర్‌తో కేశవ శరీరంపై ఎనిమిది సార్లు పొడిచారు. తీవ్ర గాయాలైన కేశవను అతని మిత్రుడు ప్రతాప్‌ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నంద్యాల డీఎస్పీ చిదానందరెడ్డి మృతదేహాన్ని పరిశీలించి స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మట్కా వ్యవహారంలో సామాజిక మాధ్యమాల్లో ఇటీవల ఓ వీడియో వైరల్‌ కావడంతో సస్పెన్షన్‌కు గురైన కానిస్టేబుల్‌ ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులు ఎవరైనా కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. భార్య వాణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని