Suicide: ఆరో అంతస్తు పైనుంచి పడి సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్య
హాస్టల్ భవనంపై నుంచి కింద పడి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గచ్చిబౌలి టెలికంనగర్లో జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ఏపీ ఒంగోలు
రాయదుర్గం, న్యూస్టుడే: హాస్టల్ భవనంపై నుంచి కింద పడి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గచ్చిబౌలి టెలికంనగర్లో జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. ఏపీ ఒంగోలు పట్టణానికి చెందిన పిడుగు సురేంద్రరెడ్డి(30) నెల క్రితం నగరానికివచ్చి టెలికాంనగర్లోని స్టోన్ రూఫ్ పీజీ హాస్టల్లో ఉంటున్నారు. నానక్రాంగూడలోని క్యాప్ జెమినీ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా ఉద్యోగంలో చేరారు. బుధవారం అర్ధరాత్రి దాటాక తానుంటున్న హాస్టల్ భవనం 6వఅంతస్తుపై నుంచి దూకాడు. తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. కొన్నాళ్లు ఉద్యోగాన్వేషణలో ఉన్న ఆయనకు ఇటీవలే ఆ సంస్థలో ఉద్యోగం లభించింది. అయితే ఇతను మద్యం తాగినట్లు.. ఆ మత్తులో ‘నేను ఆత్మహత్య చేసుకుంటా’ అని పలువురితో అన్నట్లు సమాచారం. ఆందోళన చెందిన స్థానికులు డయల్ 100కు ఫోన్ చేశారు. వారువచ్చాక అతను మౌనంగా ఉండటంతో వెనక్కి వెళ్లారు. శవపరీక్షల అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రాయదుర్గం ఇన్స్పెక్టర్ తిరుపతి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఉత్తుత్తి బుకింగ్లు.. జలమండలికి టోకరా
[ 20-04-2024]
ఫేక్ బుకింగ్లతో కొందరు జలమండలికి టోకరా వేస్తున్నారు. ట్యాంకర్లకు కృత్రిమ కొరత ఏర్పడి..పెండింగ్ జాబితా అమాంతం పెరిగిపోతోంది. -
నగరానికి సాగర్ జలాల పంపింగ్
[ 20-04-2024]
హైదరాబాద్ జంట నగరాలు, నల్గొండ జిల్లా సాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయంలో జలమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న అత్యవసర మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన కొనసాగుతోంది. -
నగరం గరం
[ 20-04-2024]
-
కుమారుడిపై కేసు భయం.. తల్లి ఆత్మహత్య
[ 20-04-2024]
ఓ బాలుడు చేసిన తప్పు తల్లి ప్రాణాలకు ముప్పుతెచ్చింది. ఈ ఘటన ఫిల్మ్నగర్లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లికి చెందిన వెంకటరమణ, సూర్యకుమారి దంపతులు నగరానికి కొన్నేళ్ల క్రితం వచ్చారు. -
క్యాబ్లలో వస్తువులు మరిచిపోతున్నారు..!
[ 20-04-2024]
క్యాబ్లలో ప్రయాణికులు వస్తువులు మర్చిపోయే నగరాల జాబితాలో హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది. ‘లాస్ట్ అండ్ ఫౌండ్ - 2024’ నివేదికను ఉబర్ సంస్థ శుక్రవారం విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో షారూఖ్ ఖాన్ ?... భాజపా అభ్యంతరం