logo

దర్శకుడు త్రివిక్రమ్‌ సతీమణి సౌజన్య నృత్యరూపకం.. అతిథిగా పవన్

ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సతీమణి సౌజన్య ప్రదర్శించిన మీనాక్షి కల్యాణం నృత్యరూపకం నయనానందకరంగా సాగింది. నాట్యగురువు పసుమర్తి రామలింగశాస్త్రి

Updated : 18 Dec 2021 15:03 IST

‘మీనాక్షి’ పాత్రలో దర్శకుడు త్రివిక్రమ్‌ సతీమణి సౌజన్య

మాదాపూర్‌, న్యూస్‌టుడే: ప్రముఖ సినీ దర్శకుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ సతీమణి సౌజన్య ప్రదర్శించిన మీనాక్షి కల్యాణం నృత్యరూపకం నయనానందకరంగా సాగింది. నాట్యగురువు పసుమర్తి రామలింగశాస్త్రి దర్శకత్వంలో సౌజన్య కళాకారుల బృందం చక్కటి హావభావాలతో నృత్యం చేసి కళాప్రియులను మంత్రముగ్ధుల్ని చేశారు. మీనాక్షి పాత్రలో ఆమె అద్భుతమైన అభినయం చూపారు. మాదాపూర్‌లోని శిల్పకళా వేదికలో శుక్రవారం సాయంత్రం ఈ నృత్యప్రదర్శన ఏర్పాటైంది. కార్యక్రమానికి ప్రముఖ సినీనటుడు, జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌, దర్శకుడు త్రివ్రికమ్‌ శ్రీనివాస్‌, సంగీత దర్శకులు తమన్‌, నటుడు తనికెళ్ల భరణి తదితరులు హాజరై కళాకారులను అభినందించారు. పవన్‌ మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలను, కళలను గౌరవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కూచిపూడి లాంటి సంప్రదాయ కళలను పరిరక్షించుకొని భావితరాలకు అందించాలన్నారు. మీనాక్షి పాత్రలో సౌజన్య చూస్తుంటే నిజంగా అమ్మవారిని చూసినట్లు అనిపించిందన్నారు.
నృత్యప్రదర్శనను తిలకిస్తున్న పవన్‌కల్యాణ్‌, త్రివిక్రమ్‌, తమన్‌ తదితరులు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని