logo

TS News: ఇంటర్‌ బోర్డు కార్యాలయం ముట్టడికి ఏబీవీపీ యత్నం.. తీవ్ర ఉద్రిక్తత

తెలంగాణ ఇంటర్‌ బోర్డు కార్యాలయం ముట్టడికి అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏబీవీపీ) యత్నించింది.

Updated : 18 Dec 2021 15:17 IST

హైదరాబాద్‌: తెలంగాణ ఇంటర్‌ బోర్డు కార్యాలయం ముట్టడికి అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏబీవీపీ) యత్నించింది. బషీర్‌బాగ్‌లోని కార్యాలయానికి ర్యాలీగా వచ్చిన సమాఖ్య నాయకులు రోడ్డుపై బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యాలయం ముందు పోలీసులు బారీకేడ్లు ఏర్పాటు చేసినా.. ఏబీవీపీ నాయకులు లోపలికి వెళ్లేందుకు యత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇటీవల విడుదలైన ఇంటర్‌ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో విద్యార్థులకు అన్యాయం జరిగిందని సమాఖ్య నాయకులు మండిపడ్డారు. విద్యార్థుల ఆత్మహత్యలకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు.. వెంటనే పరీక్షలు రాసే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం సమాఖ్య నాయకులను పోలీసులు పీఎస్‌కు తరలించారు. 
 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని