AP News: విస్తరిస్తున్న విశాఖ
శరవేగంగా విస్తరిస్తున్న విశాఖపట్నం అన్నివర్గాలను ఆకట్టుకుంటోంది. నగరం నలువైపులా అభివృద్ధి జరగడంతో నిర్మాణం రంగం ఊపందుకుంది. నగరంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని ప్రతిఒక్కరూ కలలుకంటారు.
సొంతింటి కల సాకారానికి అనువైన ప్రాంతం
- ఈనాడు, విశాఖపట్నం
శరవేగంగా విస్తరిస్తున్న విశాఖపట్నం అన్నివర్గాలను ఆకట్టుకుంటోంది. నగరం నలువైపులా అభివృద్ధి జరగడంతో నిర్మాణం రంగం ఊపందుకుంది. నగరంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవాలని ప్రతిఒక్కరూ కలలుకంటారు. ముఖ్యంగా ఆకట్టుకునే సహజ వనరులు, ఎత్తయిన కొండలు, సువిశాల సముద్ర తీరం, మరెన్నో పర్యాటక ప్రాంతాలు ఉండడంతో ఈ ప్రాంతానికి ప్రాధాన్యం పెరుగుతోంది. అన్నిచోట్ల గృహ నిర్మాణ ప్రాజెక్టులు వస్తున్నాయి.
నగరం నలువైపులా..
విశాఖ మెట్రోను విస్తరించడం, ఐటీ, పారిశ్రామిక నడవా, జాతీయ విద్యాలయాలు, పరిశోధన సంస్థల ఏర్పాటుతో నగర పరిధి పెరిగింది. ఇటు తగరపువలస నుంచి అటు అనకాపల్లి, భీమునిపట్నం, పెందుర్తి, కొత్తవలస, సుజాతనగర్, ఆనందపురం, మధురవాడ, ఎండాడ, గాజువాక, పరవాడ, సబ్బవరం, భోగాపురం, ఇతర ప్రాంతాలు త్వరితంగా పట్టణీకరణకు నోచుకుంటున్నాయి. దీంతో అక్కడ భారీ ప్రాజెక్టులు సైతం వస్తున్నాయి. ధరలు కొండెక్కుతున్న ప్రస్తుత తరుణంలో సొంతింటి కల నెరవేర్చుకోవాలనుకునే వారికి ఇదే సరైన సమయం. మెటీరియళ్ల ధరలు, పన్నులు ఇతరాలు పెరిగేలోపే సమకూర్చుకుంటే మంచిది. సుమారు 75 స్టాళ్లతో 250 ప్రాజెక్టుల వరకు ఈ ఎక్స్పోలో ప్రదర్శనకు రానున్నాయి. ఇందులో వినియోగదారుల డిమాండ్ ఆధారంగా అన్నివర్గాలకు అందుబాటు ధరల్లో కొనుగోలు స్థాయికి వీలుగా ప్రాజెక్టులు అందుబాటులో ఉన్నాయి. నచ్చినవి ఒకే వేదిక వద్ద ఎంపిక చేసుకోవచ్చు.
- వి.శ్రీనివాస్, ఎక్స్పో కన్వీనర్
సమయం ఆదా..
విశాఖకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉండడంతో సొంతింటి కలను సాకారం చేసుకోవాలని చాలామంది చూస్తారు. పెట్టుబడి కోసమైనా ఎక్కువమంది ప్రయత్నిస్తారు. అటువంటి వారి సమయం వృథా అవ్వకుండా వారి అభిరుచులకు తగిన ఇంటిని ఒకే వేదిక మీద ఎంచుకునే అవకాశం కల్పిస్తున్నాం. ముఖ్యంగా క్రెడాయ్ అంటే నాణ్యతా, సమయానికి ప్రాజెక్టు అప్పగిస్తామనే నమ్మకంతోనే వినియోగదారులు ఆదరిస్తున్నారు. ఇక్కడి వారే కాకుండా తెలంగాణ, ఒడిశా ప్రాంతాలకు చెందిన వారు ఇక్కడ ఇళ్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ నెల 24, 25, 26 తేదీల్లో గతానికి భిన్నంగా కొనుగోలుదారులకు లాభదాయకం కలిగేలా గాదిరాజు ప్యాలెస్లో క్రెడాయ్ స్థిరాస్తి ప్రదర్శన నిర్వహిస్తున్నాం. దీనికి ‘ఈనాడు-ఈటీవీ మీడియా పార్టనర్గా వ్యవహరిస్తున్నాయి.
- బి.శ్రీనివాసరావు, క్రెడాయ్ ఛైర్మన్
డిమాండు నెలకొనడంతో..
విశాఖలో అంతర్జాతీయ ప్రమాణాలు, నూతన సాంకేతిక విధానాలతో పలు కొత్త గృహ నిర్మాణ ప్రాజెక్టులు వస్తున్నాయి. వీటిని ఒకే వేదిక మీద చూసేందుకు నగర ప్రజలకు అవకాశం కలిగింది. ఎంతో ప్రత్యేకత కలిగిన నమ్మకమైన స్థిరాస్తులు ఇక్కడ చూడొచ్ఛు ప్రదర్శన మూడు రోజులూ కొవిడ్ నిబంధనలు పాటిస్తూ సందర్శకులకు అసౌకర్యం కలగకుండా సువిశాల ప్రాంగణాల్లో వీటిని ఏర్పాటు చేశాం.
- కేఎస్ఆర్కే రాజు, క్రెడాయ్ ప్రెసిడెంట్
ప్రత్యేక రాయితీలు
స్థిరాస్తి ప్రదర్శనలో కొనుగోలు చేసే వారికి ప్రత్యేక రాయితీలు ఉండనున్నాయి. ఆయా బ్యాంకులు గృహ నిర్మాణాలపై వడ్డీ రాయితీ ఇవ్వనున్నాయి. ఫ్లాట్లు కొనుగోలు చేసే వారికి బిల్డర్లు వారి సామర్థ్యం ఆధారంగా చదరపు అడుగుకి రూ.100 నుంచి రూ.500 వరకు ప్రత్యేకంగా తగ్గించనున్నారు. ఇవేకాకుండా సందర్శకులకు ఆకర్షణీయ బహుమతులున్నాయి. రోజూ పది బంగారు నాణాలు, చివరి రోజు లక్కీ డ్రా విజేతకు ఒక విద్యుత్తు స్కూటర్ అందజేస్తాం. వీటితో పాటు విజ్ఞానదాయకంగా ఉండేలా స్మార్ట్ సిటీ, మాస్టర్ప్లాన్ వంటి అంశాలపై సంబంధిత నిపుణులతో చర్చాగోష్ఠి నిర్వహిస్తాం.
- ఇ.అశోక్, సెక్రటరీ, క్రెడాయ్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మమ్మల్నే అడ్డుకుంటారా..!
[ 25-04-2024]
‘మమ్మల్నే అడ్డుకుంటారా..? యోగ్యత లేని పోలీసు అధికారులను తీసుకొచ్చి గాజువాకలో పెట్టాం. నేను చాలా నామినేషన్లకు వెళ్లా. ఎక్కడా ఇలాంటి పోలీసులను చూడలేదు..’ అంటూ మంత్రి అమర్నాథ్ పోలీసు అధికారులపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం చర్చనీయాంశంగా మారింది. -
తెదేపా అభ్యర్థి గంటాకు అడుగడుగునా నీరాజనం
[ 25-04-2024]
భీమిలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు పద్మనాభం మండలంలోని చిన్నాపురం, విజయానందపురం, కొయ్యపేట, నేరెళ్ళవలస, తునివలస, నరసాపురం, పాండ్రంగి, కృష్ణాపురం, పద్మనాభం గ్రామాల్లో బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
విశాఖ లోక్సభ స్థానానికి 8మంది నామపత్రాలు
[ 25-04-2024]
విశాఖ లోక్సభ స్థానానికి బుధవారం 8 మంది అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేశారు. ఉత్తరాంధ్ర ప్రజా పార్టీ నుంచి మెట్ట రామారావు, ఆర్పీఐ నుంచి కొంగరపు గణపతి, భారత చైతన్య యువజన పార్టీ నుంచి ముపాల అచ్యుత కిరణ్ బాలాజీ, రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి వాండ్రాసి నాగ సత్యనారాయణ, బ్లూ ఇండియా పార్టీ తరఫున మురాల అరుణశ్రీ, జైమహాభారత్ పార్టీ నుంచి గణపతి జగదీశ్వరరావు, స్వతంత్ర అభ్యర్థులు కర్రి వేణుమాధవ్, గాదం అప్పలనర్సింహ ఆనంద్ కలెక్టరేట్లో రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎ.మల్లికార్జునకు నామపత్రాలు సమర్పించారు. -
స్వామి ఉంగరం దొంగిలించింది మీరేనా..!
[ 25-04-2024]
అప్పన్న స్వామి వార్షిక తిరు కల్యాణ మహోత్సవాల్లో భాగంగా చివరి రోజు బుధవారం వినోదోత్సవం ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా స్వామి వజ్రాల ఉంగరం చోరీకి గురైందంటూ కొందరు భక్తులను తాళ్లతో బంధించి కాజేసిన దొంగలు మీరేనా అని ప్రశ్నించడంతో వారంతా హతాశులయ్యారు. -
ఇసుక బాధలు ఇంతింతకాదయా!
[ 25-04-2024]
ఇసుక అక్రమ తవ్వకాలు.. అయిదేళ్ల వైకాపా పాలనలో నిత్యం వినిపించిన మాట. జగన్ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నిర్మాణ రంగం కుదేలైంది. అధికార పార్టీ నాయకులు కృత్రిమంగా ఇసుక కొరతను సృష్టించి ఇష్టానుసారంగా అమ్మకాలు చేసుకున్నారు. -
జనం చెవిలో.. జగన్ పూలు!
[ 25-04-2024]
ఉద్యోగాల విప్లవం తీసుకువస్తామని ప్రతిపక్షనేతగా ఇచ్చిన హామీని అధికారంలోకి వచ్చాక జగన్ తుంగలోకి తొక్కేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2,30,000 ఉద్యోగాలను భర్తీ చేస్తానని నిరుద్యోగుల్లో ఎన్నో ఆశలు రేకెత్తించారు. -
జగన్మాయతో జలగండం!
[ 25-04-2024]
ప్రాజెక్టులున్నాయి, జలాశయాలున్నాయి, వాటికింద పంట కాలువలున్నాయి. పొలాలకు నీరందిస్తే బంగారం పండించేందుకు రైతులున్నారు. లేనిదల్లా పాలకుల్లో చిత్తశుద్ధే. రైతులపై ఎంతో ప్రేమ ఉన్నట్లు ఆర్భాటపు ప్రకటనలతో అయిదేళ్లు కాలాన్ని కరిగించేసిన జగన్ సాగునీటి వనరులను అంపశయ్య ఎక్కించేశారు. -
కూటమి కదనోత్సాహం
[ 25-04-2024]
ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పట్టణంలో బుధవారం విజయీభవ పేరుతో నిర్వహించిన ప్రదర్శన హోరెత్తింది. పార్లమెంటు పరిధిలోని అన్ని ప్రాంతాల నుంచి భాజపా, తెదేపా, జనసేన కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి జనం రావడం ప్రారంభించారు. -
అనకాపల్లిలో రాజారెడ్డి రాజ్యాంగం సాగదు
[ 25-04-2024]
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం అన్యాయాలు, అక్రమాలకు పాల్పడిందని, పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారని ఎన్డీఏ ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ దుయ్యబట్టారు. అనకాపల్లిలో పోలీసులు రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. -
ఒక్క మెట్టూ దాటని మెట్రో
[ 25-04-2024]
‘విజన్ విశాఖ’ అంటూ నగరాన్ని అభివృద్ధి పథాన నడిపించినట్లు గొప్పలు చెప్పిన జగన్ విశాఖ మెట్రో కారిడార్ను చిదిమేశారు. వైకాపా ప్రభుత్వ హయాంలో ఈ రైలు ప్రాజెక్టు తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది.
తాజా వార్తలు (Latest News)
-
జూదరులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు.. మంగళ్హాట్ డీఐ సస్పెన్షన్ ?
-
ఒకే ద్విచక్రవాహనంపై ప్రయాణం.. బస్సు ఢీకొని నలుగురు ఇంటర్ విద్యార్థుల మృతి
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)