logo

AP News: కత్తితో ఇద్దరు యువకులు వీరంగం..అడ్డుకున్నవిద్యార్థినీ పొడిచేశారు!

సోమవారం సాయంత్రం కళాశాల విడిచిపెట్టిన తర్వాత బస్సు కోసం విద్యార్థినులు నిరీక్షిస్తుండగా ఇద్దరు యువకులు మద్యం తాగి ద్విచక్ర వాహనంపై వచ్చారు.అక్కడే హల్‌చల్‌ చేయడంతో ప్రిన్సిపల్‌ అప్పలరాజు వారిని ప్రశ్నించారు. ఆయనపై తిరగబడటంతో అడ్డుకునేందుకు వెళ్లిన శ్రీకాకుళం జిల్లా భామిని

Updated : 21 Dec 2021 08:10 IST

సోమవారం సాయంత్రం కళాశాల విడిచిపెట్టిన తర్వాత బస్సు కోసం విద్యార్థినులు నిరీక్షిస్తుండగా ఇద్దరు యువకులు మద్యం తాగి ద్విచక్ర వాహనంపై వచ్చారు.అక్కడే హల్‌చల్‌ చేయడంతో ప్రిన్సిపల్‌ అప్పలరాజు వారిని ప్రశ్నించారు. ఆయనపై తిరగబడటంతో అడ్డుకునేందుకు వెళ్లిన శ్రీకాకుళం జిల్లా భామిని మండలానికి చెందిన ఫార్మసీ నాలుగో సంవత్సర ం విద్యార్థి బోగి రవణయ్య పొట్ట, తొడలపై పొడిచారు. భయబ్రాంతులకు గురైన మిగిలిన విద్యార్థులు పరుగులు పెట్టారు. అనంతరం క్షతగాత్రుడ్ని బొబ్బిలి సీహెచ్‌సీకి తరలించారు. అప్పటి వరకు విద్యార్థి పొట్టలోనే కత్తి ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఘటనను కొందరు వీడియోల్లో చిత్రీకరించారు. సీఐ నాగేశ్వరరావు అక్కడకు చేరుకొని వీడియోలు పరిశీలించి నిందితులు ముత్తాయవలసకు చెందిన వారిగా గుర్తించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి నుంచి ఎస్‌ఐలు సత్యనారాయణ, జ్ఞానప్రసాద్, సూర్యనారాయణ వివరాలు సేకరించారు. పధకం ప్రకారమే నిందితులు కత్తి తెచ్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. -  న్యూస్‌టుడే, బొబ్బిలి  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు