logo

Road Accident: తోబుట్టువులు.. తోడుగా మృత్యువు చెంతకు

వారిద్దరూ తోబుట్టువులు. వారి వివాహాలు ఒకే ముహుర్తానికి చేయాలనుకున్నారు కుటుంబ సభ్యులు. మృత్యువు మాత్రం వారి ఆశలను చిదిమేస్తూ ఒకేసారి వారిని కబళించింది. వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి వద్ద ఆదివారం

Updated : 27 Dec 2021 09:34 IST

రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి మృతి

రాకేష్‌, లక్ష్మీప్రసన్న

నర్సంపేట రూరల్‌, న్యూస్‌టుడే: వారిద్దరూ తోబుట్టువులు. వారి వివాహాలు ఒకే ముహుర్తానికి చేయాలనుకున్నారు కుటుంబ సభ్యులు. మృత్యువు మాత్రం వారి ఆశలను చిదిమేస్తూ ఒకేసారి వారిని కబళించింది. వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలం లక్నేపల్లి వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి ఇద్దరూ అక్కడిక్కడే మృతిచెందారు. ఖానాపురం మండలం దబ్బీర్‌పేట గ్రామానికి చెందిన మొగుళ్ల రాకేష్‌(28), లక్ష్మీప్రసన్న(21) అన్నాచెల్లెలు. వీరి తండ్రి రమేష్‌ 2003లో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోగా 2019లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి విజయ మృతిచెందింది. నాన్నమ్మ సాంబలక్ష్మి దగ్గరే వారు ఉంటున్నారు. రాకేష్‌ ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పనిచేస్తుండగా లక్ష్మీప్రసన్న ఈ ఏడాది డ్రిగీ పూర్తయి ఇంటి వద్దే ఉంటుంది. అన్నాచెల్లెళ్ల వివాహాలు ఫిబ్రవరి 3న జరిపించేందుకు బంధువులు నిర్ణయించారు. ఆదివారం సాయంత్రం దబ్బీర్‌పేట నుంచి ద్విచక్ర వాహనంపై రాకేష్‌, లక్ష్మీప్రసన్న వరంగల్‌కు వెళ్తున్నారు. ఒక టిప్పర్‌ లారీ వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి పోస్టుమార్టానికి వెళ్లి మృతుల బంధువులను పరామర్శించి రూ.25వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు