logo

TS News: మద్యం తాగి డోరు తీయలేక.. కారులోనే మృతి

కారులో మద్యం తాగి తీవ్ర అస్వస్థతకు గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన గాంధీనగర్‌ ఠాణా పరిధిలో జరిగింది. సీఐ ఎన్‌.మోహన్‌రావు తెలిపిన వివరాల ప్రకారం..

Updated : 30 Dec 2021 09:06 IST

బన్సీలాల్‌పేట్‌, న్యూస్‌టుడే: కారులో మద్యం తాగి తీవ్ర అస్వస్థతకు గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన గాంధీనగర్‌ ఠాణా పరిధిలో జరిగింది. సీఐ ఎన్‌.మోహన్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. బోయిగూడ ప్రాంతానికి చెందిన ప్రశాంత్‌(38) ప్రైవేటు ఉద్యోగి. కొంతకాలంగా మద్యానికి అలవాటు పడ్డాడు. ఈనెల 28న ఇంటికి సమీపంలో కారులోనే మద్యం తాగాడు. కారు డోరు తెరవకపోవడంతో అతని భార్య ఆందోళనకు గురై ప్రశాంత్‌ సోదరుడి సహాయంతో మరో తాళంతో కారు డోరు తెరిచారు. తీవ్ర అస్వస్థతకు గురైనట్లు గుర్తించి స్థానికంగా ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని