logo

AP News: పండగ తర్వాత గ్రామాలు ఖాళీ చేయాల్సిందే!

అంతర్జాతీయ విమానాశ్రయ భూసేకరణకు సంబంధించి భోగాపురం మండలం బొల్లింకలపాలెం, రెల్లిపేట గ్రామాలు పండగ తర్వాత ఖాళీ చేయాలని ఆర్డీవో భవానీ శంకర్‌ నిర్వాసితులను ఆదేశించారు. మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ..

Updated : 04 Jan 2022 08:45 IST

నిర్వాసితులతో మాట్లాడుతున్న ఆర్డీవో

డెంకాడ, భోగాపురం, న్యూస్‌టుడే: అంతర్జాతీయ విమానాశ్రయ భూసేకరణకు సంబంధించి భోగాపురం మండలం బొల్లింకలపాలెం, రెల్లిపేట గ్రామాలు పండగ తర్వాత ఖాళీ చేయాలని ఆర్డీవో భవానీ శంకర్‌ నిర్వాసితులను ఆదేశించారు. మండల పరిషత్‌ కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఆయా గ్రామాల వారికి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ పూర్తిగా చెల్లిస్తామని, 3 నెలల అద్దె కూడా ఇస్తామని చెప్పారు.అందుకు నిర్వాసితులు అభ్యంతరం తెలపడంతో వారికి అధికారులకు మధ్య కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. ఖాళీ చేయడానికి తమకు కొంత సమయం కావాలని నిర్వాసితులు కోరారు. ప్రస్తుతం నిర్మిస్తున్న ఇళ్లకు బిల్లులు సక్రమంగా అందడం లేదని వాపోయారు. చర్చలు విఫలం కావడంతో అధికారులు సమావేశాన్ని ముగించి వెళ్లిపోయారు. తహసీల్దారు రమణమ్మ, డీటీ గాంధీ, రెవెన్యూ అధికారులు, నిర్వాసితులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని