logo

Crime News:పెట్రోల్‌ పోసి..కాల్చివేసి..కుమారుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య

కుమారుడితో కలిసి భర్తను భార్య పెట్రోలు పోసి హత్యచేసిన ఘటన  తిరుమలగిరి(సాగర్‌) మండలం జువ్విచెట్టుతండాలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జువ్విచెట్టుతండాకు చెందిన సపావత్‌ బాబు(45) వ్యవసాయం చేస్తూ కూలీ పనులకు వెళ్లేవారు.

Updated : 07 Jan 2022 07:55 IST

సపావత్‌ బాబు

తిరుమలగిరి(సాగర్‌), న్యూస్‌టుడే: కుమారుడితో కలిసి భర్తను భార్య పెట్రోలు పోసి హత్యచేసిన ఘటన నల్గొండ జిల్లా తిరుమలగిరి(సాగర్‌) మండలం జువ్విచెట్టుతండాలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జువ్విచెట్టుతండాకు చెందిన సపావత్‌ బాబు(45) వ్యవసాయం చేస్తూ కూలీ పనులకు వెళ్లేవారు. వచ్చిన డబ్బులతో నిత్యం మద్యం తాగడంతో భార్య, కుమారుడికి మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో విసుగు చెందిన కొడుకు కల్యాణ్‌, భార్య సపావత్‌ బుజ్జి గురువారం మధ్యాహ్న మంచంపై పడుకున్న సమయం చూసి పెట్రోలు పోసి తగలబెట్టారు. మంటలు వస్తుండటంతో స్థానికులు గమనించగా కాలిపోతు సపావత్‌ బాబు కనిపించాడు. తల్లీకొడుకులు రోడ్డుపైకి వచ్చి చూస్తున్నారు. స్థానికులు దుప్పటితో మంటలార్పే సరికి అప్పటికే పూర్తిగా కాలిపోయి మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకుని వివరాలు సేకరించి మృతుడి భార్య, కుమారుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నట్లు ఎస్సై సుధాకర్‌ తెలిపారు.

ముగ్గురి బలవన్మరణం
కట్టంగూరు: ఉమ్మడి జిల్లాలో వేర్వేరు చోట్ల ముగ్గురు బలవన్మరణం చెందారు. వివరాల్లోకి వెళ్తే.. కట్టంగూరు మండలంలోని అయిటిపాములకు చెందిన కొర్పుల ప్రవీణ్‌కుమార్‌(22) డ్రైవర్‌గా పని చేస్తున్నారు. ఐదేళ్ల ఏళ్ల క్రితం అనారోగ్యంతో అతని తల్లిదండ్రులు కన్నుమూశారు. తన సోదరితో కలిసి అదే గ్రామంలోని అమ్మమ్మ లట్టిపల్లి యాదమ్మ ఇంట్లో ఉంటున్నారు. కొంత కాలం క్రితం తన అక్కకు వివాహం చేశారు. బుధవారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ప్రవీణ్‌ కుమార్‌ ఉరేసుకుని మృతి చెందాడు. మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుని అమ్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివప్రసాద్‌ తెలిపారు.
కనగల్‌: కనగల్‌ మండలం చిన్నమాదారానికి చెందిన పిండి నర్సిరెడ్డి (60) తన మామిడి తోటలో గురువారం సాయంత్రం ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. తనసోదరుడు సాయంత్రం మోటర్‌ పెట్టడానికి వెళ్లేసరికి చెట్టుకు వేలాడుతుండటంతో రోడ్డు వెంట వెళ్లే వారిని పిలిచి కిందికిదించగా అప్పటికే మృతి చెందారు. బలవన్మరణానికి గల కారణాలు తెలియాల్సిఉంది. గతంలో కూడా ఆత్మహత్యాయత్నానికి యత్నించినట్లు గ్రామస్థులు తెలిపారు.  

మనస్తాపంతో చెరువులో దూకి...
సూర్యాపేట నేరవిభాగం: కుమారుడు మృతిచెందాడని మనస్తాపానికి గురై వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన గురువారం సూర్యాపేటలో వెలుగు చూసింది. టేకుమట్ల గ్రామానికి చెందిన కందుకూరి బ్రహ్మచారి (24) సూర్యాపేటలో కూలీ పనిచేసుకుంటూ జీవిస్తున్నారు. బ్రహ్మచారి, రాజేశ్వరి దంపతులకు ఇటీవల కుమారుడు జన్మించి, నవంబరు 25న అనారోగ్య కారణాలతో మృతిచెందాడు. అప్పటి నుంచి బాధపడుతూ, మద్యం తాగుతూ.. అప్పుడప్పుడూ బ్రహ్మచారి పనికి వెళ్తున్నారు. ఈ నెల 3న పనికోసం సూర్యాపేటకు వచ్చారు. అప్పటి నుంచి తిరిగి ఇంటికి వెళ్లలేదు. సూర్యాపేటలోని సద్దుల చెర్వులో బ్రహ్మచారి మృతదేహాన్ని పోలీసులు గురువారం గుర్తించారు. రెండు రోజుల క్రితం చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని ఇన్‌స్పెక్టర్‌ ఆంజనేయులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని