Crime News:పెట్రోల్ పోసి..కాల్చివేసి..కుమారుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య
కుమారుడితో కలిసి భర్తను భార్య పెట్రోలు పోసి హత్యచేసిన ఘటన తిరుమలగిరి(సాగర్) మండలం జువ్విచెట్టుతండాలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జువ్విచెట్టుతండాకు చెందిన సపావత్ బాబు(45) వ్యవసాయం చేస్తూ కూలీ పనులకు వెళ్లేవారు.
సపావత్ బాబు
తిరుమలగిరి(సాగర్), న్యూస్టుడే: కుమారుడితో కలిసి భర్తను భార్య పెట్రోలు పోసి హత్యచేసిన ఘటన నల్గొండ జిల్లా తిరుమలగిరి(సాగర్) మండలం జువ్విచెట్టుతండాలో గురువారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జువ్విచెట్టుతండాకు చెందిన సపావత్ బాబు(45) వ్యవసాయం చేస్తూ కూలీ పనులకు వెళ్లేవారు. వచ్చిన డబ్బులతో నిత్యం మద్యం తాగడంతో భార్య, కుమారుడికి మధ్య తరచూ గొడవలు జరిగేవి. దీంతో విసుగు చెందిన కొడుకు కల్యాణ్, భార్య సపావత్ బుజ్జి గురువారం మధ్యాహ్న మంచంపై పడుకున్న సమయం చూసి పెట్రోలు పోసి తగలబెట్టారు. మంటలు వస్తుండటంతో స్థానికులు గమనించగా కాలిపోతు సపావత్ బాబు కనిపించాడు. తల్లీకొడుకులు రోడ్డుపైకి వచ్చి చూస్తున్నారు. స్థానికులు దుప్పటితో మంటలార్పే సరికి అప్పటికే పూర్తిగా కాలిపోయి మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడి చేరుకుని వివరాలు సేకరించి మృతుడి భార్య, కుమారుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు.
ముగ్గురి బలవన్మరణం
కట్టంగూరు: ఉమ్మడి జిల్లాలో వేర్వేరు చోట్ల ముగ్గురు బలవన్మరణం చెందారు. వివరాల్లోకి వెళ్తే.. కట్టంగూరు మండలంలోని అయిటిపాములకు చెందిన కొర్పుల ప్రవీణ్కుమార్(22) డ్రైవర్గా పని చేస్తున్నారు. ఐదేళ్ల ఏళ్ల క్రితం అనారోగ్యంతో అతని తల్లిదండ్రులు కన్నుమూశారు. తన సోదరితో కలిసి అదే గ్రామంలోని అమ్మమ్మ లట్టిపల్లి యాదమ్మ ఇంట్లో ఉంటున్నారు. కొంత కాలం క్రితం తన అక్కకు వివాహం చేశారు. బుధవారం రాత్రి ఇంట్లో ఎవరు లేని సమయంలో ప్రవీణ్ కుమార్ ఉరేసుకుని మృతి చెందాడు. మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని మృతుని అమ్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివప్రసాద్ తెలిపారు.
కనగల్: కనగల్ మండలం చిన్నమాదారానికి చెందిన పిండి నర్సిరెడ్డి (60) తన మామిడి తోటలో గురువారం సాయంత్రం ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. తనసోదరుడు సాయంత్రం మోటర్ పెట్టడానికి వెళ్లేసరికి చెట్టుకు వేలాడుతుండటంతో రోడ్డు వెంట వెళ్లే వారిని పిలిచి కిందికిదించగా అప్పటికే మృతి చెందారు. బలవన్మరణానికి గల కారణాలు తెలియాల్సిఉంది. గతంలో కూడా ఆత్మహత్యాయత్నానికి యత్నించినట్లు గ్రామస్థులు తెలిపారు.
మనస్తాపంతో చెరువులో దూకి...
సూర్యాపేట నేరవిభాగం: కుమారుడు మృతిచెందాడని మనస్తాపానికి గురై వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన గురువారం సూర్యాపేటలో వెలుగు చూసింది. టేకుమట్ల గ్రామానికి చెందిన కందుకూరి బ్రహ్మచారి (24) సూర్యాపేటలో కూలీ పనిచేసుకుంటూ జీవిస్తున్నారు. బ్రహ్మచారి, రాజేశ్వరి దంపతులకు ఇటీవల కుమారుడు జన్మించి, నవంబరు 25న అనారోగ్య కారణాలతో మృతిచెందాడు. అప్పటి నుంచి బాధపడుతూ, మద్యం తాగుతూ.. అప్పుడప్పుడూ బ్రహ్మచారి పనికి వెళ్తున్నారు. ఈ నెల 3న పనికోసం సూర్యాపేటకు వచ్చారు. అప్పటి నుంచి తిరిగి ఇంటికి వెళ్లలేదు. సూర్యాపేటలోని సద్దుల చెర్వులో బ్రహ్మచారి మృతదేహాన్ని పోలీసులు గురువారం గుర్తించారు. రెండు రోజుల క్రితం చెరువులో దూకి బలవన్మరణానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని ఇన్స్పెక్టర్ ఆంజనేయులు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నామినేషన్ దాఖలు చేసిన బూర నర్సయ్య గౌడ్
[ 23-04-2024]
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థిగా బూర నర్సయ్య గౌడ్ తమ నామినేషన్ పత్రాన్ని రిటర్నింగ్ అధికారి హనుమంతు కే జండగేకు మంగళవారం అందజేశారు. -
కేసీఆర్ రోడ్ షోను జయప్రదం చేయాలి: క్యామ మల్లేష్
[ 23-04-2024]
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 25న జరిగే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షోను జయప్రదం చేయాలని భువనగిరి ఎంపీ అభ్యర్థి క్యామ మల్లేష్.. నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. -
మోదీ హయాంలో దేశం అభివృద్ధి చెందింది: భాజపా
[ 23-04-2024]
భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ భాజపా అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్కు మద్దతుగా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. -
సీపీఎం అభ్యర్థి ఎండీ జహంగీర్ను గెలిపిద్దాం
[ 23-04-2024]
భువనగిరి పట్టణ కేంద్రంలోని తారక రామ్ నగర్లో ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. -
భువనగిరిలో హనుమాన్ శోభయాత్ర ర్యాలీ
[ 23-04-2024]
హనుమాన్ జయంతి పురస్కరించుకొని భువనగిరి పట్టణంలో బజరంగ్దళ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. -
పతాక స్థాయికి ప్రచారం
[ 23-04-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారం ఉమ్మడి నల్గొండ జిల్లాలో పతాక స్థాయికి చేరింది. భువనగిరి లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్కుమార్రెడ్డికి మద్దతుగా ఆదివారం భువనగిరి పట్టణంలో -
కుటుంబ పాలనను తరిమికొట్టాలి
[ 23-04-2024]
ఉమ్మడి నల్గొండ జిల్లాకు మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి కుటుంబాలతో పాటూ జానారెడ్డి కుటుంబం చేసిందేమీ లేదని కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి విమర్శించారు. -
అనర్థం.. చెత్తలో బయో వ్యర్థం
[ 23-04-2024]
నల్గొండ జిల్లా పరిషత్తు, న్యూస్టుడే: ఆసుపత్రుల్లో జాగ్రత్తలు తీసుకునే వైద్యులు తమ ఆసుపత్రుల నుంచి వెలువడే వ్యర్థాలను మాత్రం నిర్లక్ష్యం చేస్తున్నారు. -
విత్తనం.. ఎవరిదీ పెత్తనం
[ 23-04-2024]
వరి విత్తనాలకు ప్రభుత్వం రాయితీ ఇవ్వడం లేదు. రైతన్నలపై విత్తన భారం పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం పరిశోధనా స్థానాలు, ఐఆర్ఆర్, ఐసీఏఆర్ తదితర కేంద్ర సంస్థల నుంచి విడుదలైన విత్తన రకాలనే సరఫరా చేస్తుంది. -
భగభగ మండే
[ 23-04-2024]
విపరీతమైన ఎండలకు మిర్యాలగూడ ప్రాంతం మాడిపోతోంది. సోమవారం మండల పరిధిలోని టీక్యాతండాలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత 45 డిగ్రీలు నమోదైంది. -
కరదీపిక.. సందేహాల నివృత్తికి వేదిక
[ 23-04-2024]
ఎన్నికల నిర్వహణలో పోలింగ్ విధులు నిర్వర్తించే అధికారుల పాత్ర కీలకం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నల్గొండ, భువనగిరి లోక్సభ నియోజకవర్గాల్లో నామపత్రాల స్వీకరణ -
పేదల హృదయాల్లో నిలిచె
[ 23-04-2024]
ప్రజాభీష్టంతో మూడు పర్యాయాలు నాటి మిర్యాలగూడ ఎంపీగా ఎన్నికై, పేదల అభ్యున్నతికి పాటుపడిన దివంగత జీఎస్ రెడ్డి(గోపు శౌరెడ్డి).. -
ఈవీఎంలకు 35 ఏళ్లు
[ 23-04-2024]
ఎన్నికల ప్రక్రియలో ఈవీఎంల పాత్ర అత్యంత ముఖ్యం. ఈ యంత్రం తొలుత వినియోగం, పుట్టు పూర్వోత్తరాలను పరిశీలించినట్లైతే.. -
అక్షరంతో సహవాసం.. వ్యక్తిత్వ వికాసం
[ 23-04-2024]
వ్యక్తి వికాసానికి, సమాజ చైతన్యానికి పుస్తకాలే ఆధారం. గతించిన కాలాన్ని భవిష్యత్ తరాలకు తెలియజేసే సాధనం పుస్తకం. పుస్తకాలను స్నేహితులుగా భావిస్తారు. -
జీవితంలో పాస్ అవుదాం..!
[ 23-04-2024]
పదో తరగతి, ఇంటర్, డిగ్రీ పరీక్షల్లో ఫెయిలయ్యామంటూ.. మార్కులు తక్కువ వచ్చాయంటూ.. పోటీ పరీక్షల్లో సీట్లు రాలేదంటూ.. ఏటా పలువురు విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్న తరుణంలో.. -
నిర్మాణాల్లో.. అమలు కాని నిబంధనలు
[ 23-04-2024]
ఆలేరు పురపాలికగా ఏర్పడ్డాక ఏటా వందకు పైగా ఇళ్ల నిర్మాణాల అనుమతుల కోసం దరఖాస్తులు వస్తున్నాయి. కొత్త పురపాలిక చట్టం అమలులోకి వచ్చాక నిర్మాణాల అనుమతుల నిబంధనలు కఠినతరం చేశారు. -
బాలుడు మరణించిన 10 రోజులకు తండ్రి ఫిర్యాదు
[ 23-04-2024]
సంపులో పడి 22 నెలల బాలుడు మృతి చెందిన ఘటన మండలంలోని రెడ్డినాయక్తండాలో ఈ నెల 11న చోటు చేసుకుంది. -
ఎన్నికలయ్యే వరకు అప్రమత్తంగా ఉండండి: కలెక్టర్
[ 23-04-2024]
పోలింగ్ ప్రక్రియ ముగిసేంత వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి వెంకటరావు అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
-
ఆ ‘ఎస్-400’లు.. వచ్చే ఏడాదే భారత్కు!
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
తగ్గిన బంగారం, వెండి ధరలు.. కారణం ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
మీరు వింటున్న రూమర్స్ నిజమే.. సినిమాటిక్ యూనివర్స్పై ప్రశాంత్ వర్మ