TS News: మూడేళ్లుగా మంచంపైనే..దిక్కుతోచని స్థితిలో కుటుంబం
నిరుపేద కుటుంబం.. ఇంటి యజమాని ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తూ.. జీవనం కొనసాగించేవారు. తన ఇద్దరు పిల్లలను చూసుకుంటూ ఆనందంగా గడిపేవారు. మూడేళ్ల కిందట విధి వక్రీకరించి.. ఓ రోజు ఆయన ప్రమాదానికి గురయ్యారు.
ఆదుకోవాలని వేడుకుంటున్న సంపత్ కుటుంబ సభ్యులు
పెద్దవంగర, తొర్రూరుటౌన్, న్యూస్టుడే: నిరుపేద కుటుంబం.. ఇంటి యజమాని ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తూ.. జీవనం కొనసాగించేవారు. తన ఇద్దరు పిల్లలను చూసుకుంటూ ఆనందంగా గడిపేవారు. మూడేళ్ల కిందట విధి వక్రీకరించి.. ఓ రోజు ఆయన ప్రమాదానికి గురయ్యారు. నాటి నుంచి మంచానికే పరిమితమయ్యారు. ఇద్దరు పిల్లలను, ఆయనను సాకడానికి భార్య చిన్న చిన్న కూలీ పనులు చేస్తూ నెట్టుకొస్తోంది.
ప్రమాదవశాత్తు కిందపడి...
పెద్దవంగరకు చెందిన ముప్పై ఏళ్ల గాజరబోయిన సంపత్కు భార్య సరిత, ఏడేళ్ల కుమారుడు నిఖిల్, అయిదేళ్ల కుమార్తె లాస్య ఉన్నారు. గ్రామంలో ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. ఆయనకు ఇల్లు తప్పా ఎలాంటి ఆస్తులు లేవు. కష్టపడితేనే నాలుగు ముద్దలు నోట్లోకిపోయేది. ఓ రోజు ఇంటిపైన పడుకున్న సంపత్ ప్రమాదవశాత్తు కిందపడడంతో వెన్నుముక విరిగింది. చికిత్స నిమిత్తం ముందుగా వరంగల్లోని ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం స్థానికుల సహాయంతో హైదరాబాద్లోని నిమ్స్ దవాఖానాలో శస్త్రచికిత్స చేసినా పూర్తి స్థాయిలో కోలుకోలేదు. నడుము నుంచి పాదాల వరకు స్పర్శలేక చచ్చుపడ్డాయి. మంచానికే పరిమితమయ్యారు. ఫిజియోథెరఫీ చేయిస్తే కోలుకోవచ్చని వైద్యులు సూచించారు. ప్రారంభంలో ఒక నెల ఫిజియోథెరఫీ చేయిస్తే రూ.50 వేల వరకు ఖర్చు అయింది. ఆ తర్వాత డబ్బులు లేక నిలిపివేశారు. మలవిసర్జన సంచి, ప్యాంపర్స్, మందులకుగాను నెలకు రూ.5 వేలు, వివిధ ఆరోగ్య పరీక్షల నిమిత్తం హైదరాబాద్ తీసుకెళ్లడానికి రవాణా ఖర్చులు రూ.5 వేలు అవుతున్నాయి. ఆయన భార్య కూలీకి వెళ్తున్నా.. కుటుంబాన్ని పోషించలేని దుస్థితి నెలకొంది. ఎన్నో సార్లు పస్తులుంటున్నారు.
పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం..
- సరిత, సంపత్ భార్య
కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుందామనుకుంటే నా కుడి చెయ్యి విరిగింది. బలమైన పనులు చేయలేక పిల్లలను పస్తులు ఉంచలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాను. నా పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటి వరకు వైద్య ఖర్చులకు రూ.5 లక్షల అప్పు అయ్యింది. నా భర్త వైద్యానికి, పిల్లల భవిష్యత్తుకు సాయం చేయండి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కాంగ్రెస్ కంచుకోట.. మానుకోట!
[ 20-04-2024]
మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో శుక్రవారం నిర్వహించిన కాంగ్రెస్ జన జాతర సభ విజయవంతమైంది. ఈ లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో తరలొచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులతో సభా ప్రాంగణం హోరెత్తింది. -
కబ్జా కోరల్లో ఇనుపరాతి గుట్ట అటవీ భూములు!
[ 20-04-2024]
భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని కొంపెల్లి గ్రామ పరిధిలో 106.34 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తులది కాదని.. అది అటవీ భూమేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు పర్యావరణానికి ఎంతో మేలు చేయనుంది. -
ఛత్రం పడితేనే.. చకచకా నడిచేది..!
[ 20-04-2024]
గత లోక్సభ ఎన్నికలు 2019 ఏప్రిల్ 11న జరిగాయి. ఈసారి మే 13న నిర్వహించనున్నారు. ఇప్పుడే ఎండలు దంచి కొడుతున్నాయి. ఆ సమయంలో మరింత తీవ్రంగా ఉండే ప్రమాదం ఉంది.. -
బలరాంనాయక్ నామపత్రం దాఖలు
[ 20-04-2024]
మహబూబాబాద్ (ఎస్టీ) లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థి, కేంద్ర మాజీ సహాయమంత్రి పోరిక బలరాంనాయక్ శుక్రవారం రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు. -
మావోయిస్టు దంపతులకు తుది వీడ్కోలు
[ 20-04-2024]
ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో మృతిచెందిన మావోయిస్టు దంపతులు జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామానికి చెందిన సిరిపెల్లి సుధాకర్ అలియాస్ శంకర్ అలియాస్ మురళీ, ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్కు చెందిన సుమన అలియాస్ రంజిత అంత్యక్రియలు శుక్రవారం స్వగ్రామంలో ముగిశాయి. -
ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి
[ 20-04-2024]
వచ్చేనెల 13న జరగబోయే లోక్సభ ఎన్నికల పోలింగ్ రోజు అందరూ ఓటేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ పిలుపునిచ్చారు. -
సీఎం హెలిప్యాడ్కు మూడు స్థలాల పరిశీలన
[ 20-04-2024]
కాజీపేట మండలం మడికొండ సెయింట్ పాల్స్ మైదానంలో ఈ నెల 24న నిర్వహించనున్న కాంగ్రెస్ పార్టీ బహిరంగ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. -
వరంగల్లో భారాస విజయం ఖాయం
[ 20-04-2024]
వరంగల్ లోక్సభ నియోజకవర్గంలో భారాస విజయం ఖాయమైందని మాజీ మంత్రి దయాకర్రావు అన్నారు. -
మరాడించలే.. లెక్కచూపలే
[ 20-04-2024]
జిల్లాలో సీఎంఆర్(కస్టమ్ మిల్లింగ్ రైస్) ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.. రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సేకరిస్తోంది. -
ఎన్నిక ఏదైనా సత్తా చాటారు..!
[ 20-04-2024]
రాజకీయ నేతలు తమ జీవిత కాలంలో ఒక్కసారైనా ఏదో ఒక చట్టసభలో అడుగుపెట్టాలని ఆశిస్తుంటారు.. ఒకరికే ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చి విజయం సాధిస్తే వారి ఆనందానికి అవధులు ఉండవు. -
అట్టహాసంగా ప్రారంభం.. పరిశోధనలు శూన్యం
[ 20-04-2024]
కాకతీయ విశ్వవిద్యాలయంలో పరిశోధనల నిమిత్తం రూ.50 కోట్లతో కె-హబ్, పీవీ నర్సింహారావు విజ్ఞాన కేంద్రం నిర్మించారు. -
ఓటాస్త్రం.. స్వీయచిత్రమే సాక్ష్యం
[ 20-04-2024]
ఓరుగల్లు నగరంలో ఓటింగ్ శాతం పెంచేందుకు వరంగల్ కలెక్టరేట్ ఆవరణలో సెల్ఫీ పాయింట్ ఏర్పాటు చేశారు. -
రెండోరోజు మూడు నామపత్రాలు
[ 20-04-2024]
వరంగల్ లోక్సభ స్థానానికి రెండోరోజు శుక్రవారం ముగ్గురు అభ్యర్థులు, నాలుగుసెట్ల నామపత్రాలు దాఖలు చేశారని వరంగల్ పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, వరంగల్ జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఉండి’ అభ్యర్థిగా 22న నామినేషన్: రఘురామ
-
జగన్ ఎదుటే జనసేనానికి జేజేలు.. విద్యార్థుల నినాదాలతో అవాక్కయిన సీఎం
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!