Anand Mahindra: చెన్నై ఆటో డ్రైవర్కు ఆనంద్ మహీంద్ర అభినందన
చెన్నై ఆటో డ్రైవర్ అన్నాదురై గురించి మహీంద్ర సంస్థ అధినేత ఆనంద్ మహీంద్ర చేసిన ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. చెన్నైలో పలువురికి ఆటో అన్నాగా పరిచమైన...
సైదాపేట, న్యూస్టుడే: చెన్నై ఆటో డ్రైవర్ అన్నాదురై గురించి మహీంద్ర సంస్థ అధినేత ఆనంద్ మహీంద్ర చేసిన ట్వీట్ సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. చెన్నైలో పలువురికి ఆటో అన్నాగా పరిచమైన అన్నాదురై గురించి తెలిసే ఉంటుంది. కొన్ని టీవీ కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొన్నారు. ఆటోలో ప్రయాణికులకు కల్పించే సౌకర్యాలే ఆనంద్ మహీంద్ర అభినందనకు కారణం. దినపత్రిక నుంచి ఐ-ప్యాడ్ వరకు సకల వసతులు అన్నాదురై ఆటోలో ఉండటం గమనార్హం. ఇది సామాజిక మాధ్యమాల్లో నేడు ట్రెండ్గా మారింది. ఆనంద్ మహీంద్ర ఆ ఆటోను చూసి ఆశ్చర్యపోయారంటే వసతులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. తంజావూరు సమీపం పేరావూరనిలో పుట్టిన అన్నాదురై కుటుంబం చెన్నైలో స్థిరపడింది. ఆయన తండ్రి, సోదరుడు కూడా ఆటో డ్రైవర్లే. అన్నాదురైకి చిన్నతనం నుంచి వ్యాపారం చేయాలని ఆశ. కుటుంబ పరిస్థితి కారణంగా ఆటో డ్రైవర్గా మారారు. ఇక్కడ తన ప్రత్యేక చూపారు. ఐటీ సంస్థలు ఎక్కువగా ఉండే చెన్నై ఓఎమ్మార్ (ఓల్డ్ మహాబలిపురం రోడ్డు)లో అన్నాదురై ఆటో నడుపుతున్నారు. ఆటోలో వార, వార్త పత్రికలు, బిజినెస్ మేగజైన్లు, ఐప్యాడ్, చిన్న టీవీ, అమెజాన్ ఎకో, ల్యాప్టాప్, శ్యామ్సంగ్ ట్యాబ్, నీళ్ల సీసా తదితర సౌకర్యాలు కల్పించారు. ఉచిత వైఫై వసతి కూడా ఉంది. ఓఎమ్మార్లో ఎక్కువ మంది ఐటీ ఉద్యోగులు ఉన్నందున వారి అవసరాల మేరకు వీటిని ఏర్పాటు చేశారు. దీంతో ఎక్కువ మంది ఆయన ఆటోలో ప్రయాణిస్తున్నారు. ఈ వ్యాపార నమూనా పలు సంస్థలను ఆకర్షించింది. వాటి ఆహ్వానం మేరకు అన్నాదురై వెళ్లి ప్రసంగాలు కూడా చేస్తున్నారు. ఇలా ఐఐటీ, ఐఐఎంలలో కూడా ప్రగించడం గమనార్హం. ఈ నేపథ్యంలో అన్నాదురై గురించి ఓ ఛానల్ విడుదల చేసిన వీడియోను షేర్ చేస్తూ ఆనంద్ మహీంద్ర అభినందించారు. అన్నాదురై నుంచి మనం నేర్చుకోవాలని, ఎంబీఏ విద్యార్థులు ఒక్క రోజు ఆయనతో గడిపితే వారికి చాలా ఉపయుక్తంగా ఉంటుందన్నారు. ఆయన కేవలం ఆటోడ్రైవర్ కాదని, మేనేజ్మెంట్లో ప్రొఫెసరని ట్వీట్ చేశారు. దీంతో అన్నాదురై పేరు మరోమారు సామాజిక మాధ్యమాల్లో మార్మోగుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
[ 19-04-2024]
వేలూర్ నియోజక వర్గ స్వతంత్ర అభ్యర్థి, నటుడు మన్సూర్ అలీఖాన్ అస్వస్థతకు గురయ్యారు. బుధవారం ప్రచారానికి చివరిరోజు కావడంతో ముమ్మరంగా ఓట్లు అభ్యర్థించారు. -
పాదచారుల సబ్వే త్వరగా తెరవండి
[ 19-04-2024]
పాదచారుల కోసం నిర్మించిన రైల్వే సబ్వే తిరిగి తెరవాలని తాంబరం వాసులు డిమాండు చేస్తున్నారు. తూర్పు, పడమర తాంబరాన్ని అనుసంధానం చేసే రైల్వే సబ్వేను 2018లో లాంఛనంగా ప్రారంభించారు. -
ఓటేద్దాం.. పదండి
[ 19-04-2024]
పార్లమెంటు నియోజకవర్గాల్లో పోటీపడుతున్న అభ్యర్థుల భవితవ్యం ఈరోజు ఈవీఎంల్లో భద్రంగా నమోదవనుంది. తొలివిడత ఎన్నికల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని కేంద్రాల్లోనూ శుక్రవారం పోలింగ్ నిర్వహించనున్నారు. -
ఓటేసేందుకు 25 కి.మీ. నడక
[ 19-04-2024]
తిరునెల్వేలి జిల్లాకు చెందిన కొందరు ఓటేసేందుకు కి.మీ. కొద్దీ నడిచివెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలోని ఇంజిక్కుళి గ్రామస్థులు సుమారు 60 ఏళ్ల కింద పశ్చిమ కనుమలపైనున్న అటవీ ప్రాంతంలో స్థిరపడ్డారు. -
గోట్లో విజయకాంత్
[ 19-04-2024]
నటుడు, డీఎండీకే వ్యవస్థాపకుడు విజయకాంత్ ‘గోట్’ సినిమాలో అతిథిపాత్రలో కనిపించే అవకాశం ఉంది. ఆయన చనిపోయారు కదా అనే కదా మీ ప్రశ్న. కృత్రిమ మేథ పరిజ్ఞానంతో ఆ చిత్రంలో ఆయన రూపాన్ని సృష్టించడానికి నిర్ణయించారు. -
మద్యం తాగడానికి డబ్బుల్లేవని బిడ్డ చేతిని బ్లేడుతో కోసి, సిగరెట్తో కాల్చిన తండ్రి
[ 19-04-2024]
తంజావూర్ జిల్లా కీళతోట్టం గ్రామానికి చెందిన బాలసుబ్రమణ్యం, శివరంజని భార్యాభర్తలు. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉంది. కుటుంబ పోషణ కోసం శివరంజని మలేషియాకు వెళ్లింది. -
పర్యాటకంపై పెరిగిన ఆసక్తి
[ 19-04-2024]
నగరంలో లోక్సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ఇదే సమయంలో వేసవి సెలవులు గడిపేందుకు దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలతో పాటు విదేశాలకు వెళ్లేందుకు ప్రయాణికులు సిద్ధమవుతున్నారు. -
శ్రీలంక తమిళ మహిళ ఓటరు కార్డు రద్దు
[ 19-04-2024]
శ్రీలంక తమిళుల పునరావాస శిబిరంలో ఉన్న మహిళకు ఇచ్చిన ఓటరు కార్డును రద్దు చేసినట్లు ఎన్నికల అధికారి, తిరుచ్చి కలెక్టర్ ప్రదీప్కుమార్ ప్రకటించారు. తిరుచ్చి జిల్లా కొట్టపట్టు ప్రాంతంలో శ్రీలంక తమిళుల పునరావాస శిబిరం ఉంది. -
రోడ్డులేక.. నడకమార్గంలో..
[ 19-04-2024]
నామక్కల్ జిల్లా రాశిపురం తాలూకా వెణ్ణత్తూర్ పంచాయతీ యూనియన్ పరిధిలోని బోదమలై 7 కి.మీ. ఎత్తులో ఉంది. ఇక్కడి కీళూర్, మేలూర్, కెడమలై గ్రామాల్లో 1,500 మందికి పైగా జనాభా ఉన్నారు. -
నయినార్ నాగేంద్రన్పై చర్యలు చేపట్టాలి
[ 19-04-2024]
భాజపా అభ్యర్థి నయినార్ నాగేంద్రన్పై చర్యలు చేపట్టాలని ఎన్నికల కమిషన్కు మద్రాసు హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. ఈనెల 6న తాంబరం రైల్వేస్టేషన్లో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేపట్టగా తిరునెల్వేలి భాజపా అభ్యర్థి నయినార్ నాగేంద్రన్ కారు డ్రైవరు సతీష్, సహాయకుడి నుంచి రూ.4 కోట్లు నగదు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాకెట్లను అక్కడకు పంపిద్దాం’.. ఇరాన్-ఇజ్రాయెల్ ఘర్షణ వేళ మస్క్ పోస్ట్
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’.. ఓటీటీలోకి స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో