logo

నేనిక్కడ.. మీరెక్కడ: కుటుంబ సభ్యుల కోసం 22 ఏళ్లుగా నిరీక్షణ

ఆరేళ్ల వయసులో తప్పిపోయింది. ప్రస్తుతం ఆమెకు 28 ఏళ్లు. ఊరు పేరు తెలియకపోవడంతో తల్లిదండ్రులను కలుసుకునేందుకు పరితపిస్తోంది. నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలోని ఓ

Updated : 24 Jan 2022 08:02 IST

దామరచర్ల, న్యూస్‌టుడే: ఆరేళ్ల వయసులో తప్పిపోయింది. ప్రస్తుతం ఆమెకు 28 ఏళ్లు. ఊరు పేరు తెలియకపోవడంతో తల్లిదండ్రులను కలుసుకునేందుకు పరితపిస్తోంది. నల్గొండ జిల్లా దామరచర్ల మండలంలోని ఓ సిమెంటు కర్మాగారం ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న ఆమె ఉదంతం సినిమా కథను తలపిస్తోంది. వివరాలు ఆమె మాటల్లోనే.. ‘‘నా పేరు దుర్గ. మాది ఏపీ. మా గ్రామం పక్కనే రైల్వేస్టేషన్‌ ఉండేది. ఆరేళ్ల వయస్సులో రైలును చూడాలనే కోరికతో స్టేషన్‌ వద్దకు వచ్చి ఆగి ఉన్న రైలు ఎక్కాను. కదిలిన బండి నుంచి దిగలేక ఏడుస్తూ నిద్రపోయాను. కాచిగూడ స్టేషన్‌లో దిగాను. రైల్వే పోలీసులు వివరాలు అడిగినా చెప్పలేకపోవడంతో సమీప పోలీస్‌స్టేషన్‌లో అప్పగించారు. పోలీసులు కాచిగూడ మిషనరీ హోంకు తరలించారు. అక్కడే హాస్టల్‌లో ఉంటూ చదువుకున్నా. తల్లిదండ్రులు త్రివేణి, ఆంజనేయులు. అక్కా చెల్లెళ్లు వెంకటలక్ష్మి, మంగ, లలిత పేర్లను మరిచిపోకుండా నోట్సులో రాసుకున్నా. బీఎస్సీ నర్సింగు చేసిన నాకు మిషనరీ నిర్వాహకులు గతేడాది వివాహం జరిపించారు. భర్త అశ్వనీకుమార్‌. దామరచర్లలోని ఓ లారీ ట్రాన్స్‌పోర్టులో పనిచేస్తున్నారు. కుటుంబ సభ్యులను ఏనాటికైనా కలుసుకుంటాను’’ అనే అభిలాషను వ్యక్తం చేస్తున్నారు దుర్గ. కొన్నాళ్లుగా తోచిన మార్గాల్లో ప్రయత్నిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని