logo

Telangana News: ఆర్టీసీ బస్సులో వివాహ మండపానికి.. ఆదర్శంగా నిలిచిన శిక్షణ కలెక్టర్‌

ఆయనో యువ ఐఏఎస్‌ అధికారి. ప్రస్తుతం నిజామాబాద్‌ జిల్లాలో శిక్షణ కలెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఆదర్శ భావాలు కలిగిన ఆయన వివాహంలో ప్రత్యేకతను చాటారు. సిద్దిపేటకు చెందిన ఉపాధ్యాయ

Updated : 12 Feb 2022 07:24 IST

వధూవరులను అభినందిస్తున్న ఆర్టీసీ ఈడీ వినోద్‌కుమార్‌

ఆయనో యువ ఐఏఎస్‌ అధికారి. ప్రస్తుతం నిజామాబాద్‌ జిల్లాలో శిక్షణ కలెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఆదర్శ భావాలు కలిగిన ఆయన వివాహంలో ప్రత్యేకతను చాటారు. సిద్దిపేటకు చెందిన ఉపాధ్యాయ దంపతులు సురేశ్‌, నిర్మల తనయుడు మంద మకరందు (2020 సివిల్‌ సర్వీసెస్‌ ర్యాంకరు).. ప్రస్తుతం నిజామాబాద్‌లో అసిస్టెంట్‌ కలెక్టర్‌గా చేస్తున్నారు. ఆయన వివాహం కరీంనగర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరు సాయితేజితతో హైదరాబాద్‌లోని నార్సింగి వద్ద ఓం కన్వెన్షన్‌లో శుక్రవారం జరిగింది. కల్యాణ మండపానికి వరుడు సహా అతడి కుటుంబీకులు, బంధువులు సిద్దిపేట ఆర్టీసీ బస్సు (పెళ్లికి బుక్‌ చేసుకున్న)లో చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ ట్విటర్‌ వేదికగా అభినందించారు. ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ వివాహానికి హాజరై ప్రశంసించారు. మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, సీపీ మహేశ్‌ భగవత్‌ సహా పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

- న్యూస్‌టుడే, సిద్దిపేట టౌన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు