logo

Telangana News: అక్కినేని అఖిల్‌ బౌలింగ్‌.. మంత్రి హరీశ్‌ బ్యాటింగ్‌..

సిద్దిపేట క్రీడా మైదానంలో రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్‌రావు, సినీ నటుడు అక్కినేని అఖిల్‌.. క్రికెట్‌ అభిమానులను అలరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా మంత్రి ఆధ్వర్యంలో 4000 మంది క్రీడాకారులతో 258 జట్లు

Updated : 18 Feb 2022 09:48 IST

సందడిగా సీఎం కేసీఆర్‌ క్రికెట్‌ ట్రోఫీ

సిద్దిపేట క్రీడా మైదానంలో రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్‌రావు, సినీ నటుడు అక్కినేని అఖిల్‌.. క్రికెట్‌ అభిమానులను అలరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పుట్టినరోజు సందర్భంగా మంత్రి ఆధ్వర్యంలో 4000 మంది క్రీడాకారులతో 258 జట్లు పాల్గొంటున్న సీఎం కేసీఆర్‌ క్రికెట్‌ ట్రోఫీని గురువారం రాత్రి లాంఛనంగా వారు ప్రారంభించారు. కాసేపు బ్యాటింగ్‌, బౌలింగ్‌తో ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. అనంతరం ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, చాముండేశ్వరనాథ్‌తో కలిసి కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికి సీఎం కేసీఆర్‌ ఆదర్శమని, క్రీడాకారులు పట్టుదలతో రాణించాలన్నారు. అఖిల్‌ మాట్లాడుతూ.. సిద్దిపేట విద్య, క్రీడలకు హబ్‌గా మారిందన్నారు. కార్యక్రమంలో జడ్పీ అధ్యక్షురాలు రోజాశర్మ, నిర్వాహకులు వేణుగోపాల్‌రెడ్డి, మల్లికార్జున్‌, ప్రజాప్రతినిధులు, నాయకులు రాజనర్సు, రవీందర్‌రెడ్డి, నాగిరెడ్డి తదితరులు ఉన్నారు. అనంతరం కోమటిచెరువు ప్రాంతాన్ని అఖిల్‌ సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి విశేషాలను మంత్రి వివరించారు. రంగనాయకసాగర్‌ను అందాలను వీక్షించారు.

 - ఈనాడు డిజిటల్‌, సిద్దిపేట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని