Andhra News: అమరావతి పెళ్లికి ఊరంతా ఏకమై..!
‘అడగందే అమ్మయినా అన్నం పెట్టదు’ అనేది సామెత...అయితే చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన మాదాబత్తుల అమరావతి విషయంలో ఆ ఊరివాళ్లు అడక్కముందే అన్నీ సమకూర్చారు. పదేళ్లగా ఆమెని అక్కున చేర్చుకున్నారు. కల్యాణ ఘడియలు రావడంతో అత్తింటికి వెళ్లేటప్పుడు ఏం పంపాలో
విశాఖ జిల్లా గుండుపాల గ్రామస్థుల ఆదర్శం
‘అడగందే అమ్మయినా అన్నం పెట్టదు’ అనేది సామెత...అయితే చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన మాదాబత్తుల అమరావతి విషయంలో ఆ ఊరివాళ్లు అడక్కముందే అన్నీ సమకూర్చారు. పదేళ్లగా ఆమెని అక్కున చేర్చుకున్నారు. కల్యాణ ఘడియలు రావడంతో అత్తింటికి వెళ్లేటప్పుడు ఏం పంపాలో అవన్నీ ఊళ్లోవాళ్లే సమకూర్చారు. ఆదివారం ఉదయం లింగంపేటలో ‘కల్యాణం’. ఈ వేడుకలో పాల్గొని అక్షింతలు వేసి ఆశీర్వదించేందుకు ఊరంతా బయలుదేరుతున్నారు.
నర్సీపట్నానికి సమీపంలోని గుండుపాల గ్రామానికి చెందిన అమరావతితో విధి చెలగాటమాడింది. ఆమెకు పదేళ్లప్పుడే తల్లీతండ్రి కన్నుమూశారు. ఇప్పుడామె వయసు 20 ఏళ్లు. ఇన్నాళ్లూ ఆమెని చుట్టుపక్కల వారే ఆదరించారు. ఎనిమిదో తరగతి వరకు చదువుకున్న ఆమె మధ్యాహ్నం వేళ స్కూల్లో భోజనం చేసేది. రాత్రి ఆకలయ్యే సమయానికి చుట్టుపక్కల వారే భోజనం పంపేవారు. సిమెంట్ ఇటుకలు పేర్చి ఇనుపరేకుల కప్పు కింద నిద్రిస్తూ అందరి ఆడపిల్లల్లానే కలలు కనేది. అవి నిజమయ్యే దారి కనిపించక కలవరపడేది.
పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయం అవుతాయంటారు.. విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ట్రాన్స్పోర్టులో డ్రైవర్గా పనిచేస్తున్న గొలుగొండ మండలం లింగంపేట నివాసి బొద్దిన సురేష్ తొలిచూపులోనే అమరావతిపై మనసు పారేసుకున్నాడు. కట్నం లేకుండా పెళ్లి చేసుకోవడానికి ముందుకొచ్చాడు. ఆమెకు పెళ్లి కుదరడంతో ఊళ్లో వాళ్లంతా సంతోషించారు. ఉపాధ్యాయుడు రాము ముందుకొచ్చి మన ఊరి ఆడపడుచుకు మనందరం దగ్గరుండి కల్యాణం జరిపిద్దామన్నారు. అందరు మద్దతు తెలిపారు. ఆ తరువాత అన్నీ చకచకా జరిగిపోయాయి. వీధిలోని చేనేత సామాజికవర్గానికి చెందిన మహిళలంతా కలిసి బంగారు చెవి బుట్టలు తయారు చేయించారు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు కలిసి టేకు మంచం, కార్యదర్శి పరుపు, దిండ్లు, సచివాలయ ఓ మహిళా పోలీసు బీరువా కొన్నారు. ఊళ్లోని ఆటో వాళ్లంతా ఆదివారం పూర్తిగా పెళ్లిపనుల్లోనే ఉండాలని నిర్ణయించారు. కొందరు చీరలు కొన్నారు. కొందరు ఖర్చులకు డబ్బులిచ్చారు.
వారే దేవుళ్లు..
కడుపున పెట్టుకునే అమ్మలేదు. చేయిపట్టుకు నడిపించే నాన్నలేడు. చేనేత కార్మికులైన అమ్మానాన్న వయోభారంతో చనిపోయారు. అప్పుడప్పుడు ఫిట్స్ వస్తుండటంతో ఎనిమిదో తరగతి మించి చదువుకోలేకపోయా. చుట్టుపక్కల వారే ఆకలి తీర్చేవారు. అనారోగ్యంగా ఉంటే సపర్యలు చేశారు. విధి చిన్నచూపు చూసినా ఊళ్లో వాళ్లంతా దేవుళ్లలా ఆదుకున్నారు. వారందరి దయతోనే పెళ్లవుతోంది.
- మాదాబత్తుల అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బస్సులు జగన్ సభకు.. కష్టాలు ప్రయాణికులకు
[ 20-04-2024]
జగనన్న ఎక్కడికి వస్తున్నా ప్రజలకు కష్టాలు తప్పడం లేదు. కాకినాడలోని సిద్ధం సభకు ఆర్టీసీ బస్సులు శుక్రవారం తరలిపోయాయి. దీంతో ప్రయాణికులు అష్టకష్టాలు పడ్డారు. సింహాచలం ఆర్టీసీ డిపోలో బస్సుల సంఖ్యే చాలా తక్కువ. -
విశాఖ-బెంగళూరు మధ్య ప్రత్యేక రైలు
[ 20-04-2024]
వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని విశాఖ- బెంగళూరు మధ్య ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. -
నరకయాతన!!
[ 20-04-2024]
ఇతర జిల్లాల్లో జగన్ సభలు జరిగినా ఆర్టీసీ అధికారులు నగరవాసులకు చుక్కలు చూపిస్తున్నారు. రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తున్నారు. ప్రయాణికుల గురించి పట్టించుకోకుండా వందలాది బస్సులను జగన్ సభలకు తరలించేస్తున్నారు. -
ఊకదంపుడు మాటలు.. ఉత్తుత్తి చేతలు
[ 20-04-2024]
మాట తప్పనన్నారు.. మడమ తిప్పనన్నారు.. నా అంతటివాడు లేడన్నారు.. విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనమంటూ గొప్పలు చెప్పారు.. -
అప్పన్న కల్యాణ వైభోగం!
[ 20-04-2024]
సింహగిరిపై అప్పన్న వార్షిక తిరు కల్యాణ మహోత్సవం శుక్రవారం రాత్రి శోభాయమానంగా జరిగింది. ఆలయ అనువంశిక ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు, దేవస్థానం ఈవో సింగల శ్రీనివాసమూర్తి కొబ్బరికాయ కొట్టి రథయాత్రను ప్రారంభించారు. -
అడుగడుగునా నిబంధనల ఉల్లంఘన
[ 20-04-2024]
ఎన్నికల నామినేషన్ దాఖలులో కూడా అధికార పార్టీ ఇష్టారాజ్యం కనిపించింది. శుక్రవారం ఉదయం సీతమ్మధార తహసీల్దార్ కార్యాలయంలో వైకాపా ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు నామినేషన్ వేయడంలో అడుగడుగునా కోడ్ ఉల్లంఘన కనిపించింది. -
ఐదు అసెంబ్లీ స్థానాలకు 22 నామపత్రాలు
[ 20-04-2024]
జిల్లా పరిధిలోని ఐదు అసెంబ్లీ స్థానాలకు శుక్రవారం 22 నామపత్రాలు దాఖలయ్యాయి. తొలి రోజు ఏడు రాగా, ఇప్పటి వరకు మొత్తం 29 వచ్చాయి. ఆయా నియోజకవర్గాల ఆర్వో కార్యాలయాలలో అభ్యర్థులు 27 సెట్ల నామపత్రాలు సమర్పించారు. -
5వ వార్డులో గంటాకు బ్రహ్మరథం
[ 20-04-2024]
జీవీఎంసీ 5వవార్డులో శుక్రవారం జరిగిన భీమిలి నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచార యాత్ర జనసందోహంతో కిటకిటలాడింది. భారీగా విచ్చేసిన జనం, అభిమానులు గంటాకు ఘనంగా స్వాగతం పలికారు. -
ఉక్కు పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం.. : పల్లా
[ 20-04-2024]
విశాఖ ఉక్కు పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని గాజువాక తెదేపా అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం ఉక్కు ప్రధాన పరిపాలన భవనం కూడలిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. -
తెదేపాలో చేరిన వైకాపా కార్యకర్తలు
[ 20-04-2024]
ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు సచివాలయానికి, మాజీ ముఖ్యమంత్రిగా జగన్ ఇంటికి వెళ్లడం ఖాయమని తెదేపా విశాఖ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు, దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గండి బాబ్జీ అన్నారు. -
రెండో రోజు పది నామినేషన్లు దాఖలు
[ 20-04-2024]
సార్వత్రిక ఎన్నికల నామినేషన్ల కార్యక్రమంలో భాగంగా పెందుర్తి నియోజకవర్గం నుంచి శుక్రవారం పది మంది అభ్యర్థులు ఆర్వో శేషశైలజకు పెందుర్తి కార్యాలయంలో నామపత్రాలు సమర్పించారు. -
జిల్లా వైద్యాధికారి సబ్బవరం ఆసుపత్రి సందర్శన
[ 20-04-2024]
జిల్లా కుష్ఠు, ఎయిడ్స్, క్షయ నివారణ అధికారి ఎంవీఎస్కే బాలాజీ శుక్రవారం సబ్బవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించారు. -
జనంలో అయ్యన్న సంతకం.. అట్టహాసంగా నామినేషన్
[ 20-04-2024]
కార్యకర్తల కోలాహలం నడుమ కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు శుక్రవారం నామినేషన్ వేశారు. -
మాడుగులను ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతా
[ 20-04-2024]
తెదేపా, భాజపా, జనసేన కూటమికి మద్దతిచ్చి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను గెలిపిస్తే.. సీఎం రమేశ్తో కలిసి మాడుగులను ఆదర్శ నియోజకవర్గంగా నిలుపుతానని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. -
ఎన్నికల్లో కూటమిది తిరుగులేని విజయం
[ 20-04-2024]
ఎన్నికల్లో కూటమి తిరుగులేని విజయాన్ని సాధిస్తుందని తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు, కూటమి అభ్యర్థిని వంగలపూడి అనిత అన్నారు. -
జబర్దస్త్ నటులకు సత్కారం
[ 20-04-2024]
జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణకు మద్దతుగా జబర్దస్త్ నటులు ఆటో రాంప్రసాద్, గెటప్ శ్రీను అనకాపల్లి నియోజకవర్గంలో రెండు రోజులపాటు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
మునగకాడలు కోస్తుండగా విద్యార్థికి విద్యుదాఘాతం
[ 20-04-2024]
కొండకొప్పాక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి విద్యార్థి ఎం.హేమంత్ ఇనుప ఊచతో మునగకాడలు కోస్తూ విద్యుదాఘాతానికి గురయ్యాడు. -
జిల్లాలో 12,86,241 మంది ఓటర్లు
[ 20-04-2024]
జిల్లాలో 12,86,241 మంది ఓటర్లు ఉన్నారని డీఆర్వో బి.దయానిధి పేర్కొన్నారు. కలెక్టరేట్లో శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. -
ప్రశ్నించడమే నేరమా!!
[ 20-04-2024]
జాతీయ ఎస్సీ కమిషన్కు ఆంధ్ర విశ్వవిద్యాలయ విద్యార్థిని చేసిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన పోలీసులు, వర్సిటీ అధికారులు నివేదికలు పంపారు. అయితే వర్సిటీ అధికారులు ఇచ్చిన నివేదికను పరిశీలిస్తే బాధిత విద్యార్థినిపైనే పలు ఆరోపణలు చేసినట్లు కనిపిస్తోంది. -
అటల్ కమ్యూనిటీ ఉత్సవాలు
[ 20-04-2024]
సబ్బవరం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురుకుల కళాశాలలో అటల్ కమ్యూనిటీ డే ఉత్సవాలు అటల్ ఇన్ఛార్జి టి.రాంబాబు ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా జరిగాయి.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్లో పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం
-
సిద్ధమంటూ వచ్చి.. నరకం చూపించి
-
2026లో ఇండిగో ఎయిర్ట్యాక్సీలు.. ప్రయాణ సమయం ఎంతో ఆదా
-
రాజీనామా చేయకుంటే ఊరుకోం.. వాలంటీర్లపై వైకాపా నాయకుల ఒత్తిడి
-
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
-
నిషేధమెక్కడ.. ‘నిషా’దమే.. రక్త మాంసాలతో జగన్ వ్యాపారం