logo

Andhra News: పెంపుడు కుక్క చనిపోయిందని ఆత్మహత్యాయత్నం

పెంపుడు కుక్క చనిపోయిందన్న మనస్తాపంతో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొవ్వూరులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. దొమ్మేరు సావరానికి చెందిన వరిగేటి శ్రీను(36) చాలాకాలంగా కుక్కను పెంచుకుంటున్నారు.

Updated : 20 Feb 2022 08:14 IST

చికిత్స పొందుతూ మృతి

కొవ్వూరు పట్టణం, న్యూస్‌టుడే: పెంపుడు కుక్క చనిపోయిందన్న మనస్తాపంతో పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కొవ్వూరులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. దొమ్మేరు సావరానికి చెందిన వరిగేటి శ్రీను(36) చాలాకాలంగా కుక్కను పెంచుకుంటున్నారు. ఈ నెల 7న కుక్క చనిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన శ్రీను అదే రోజు కలుపు మందు తాగారు. ఆయన్ని కుటుంబ సభ్యులు రాజమహేంద్రవరం ఆసుపత్రికి తీసుకెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చిన ఆయన మళ్లీ అస్వస్థతకు గురవ్వడంతో ఈ నెల 16న విశాఖపట్నం కేజీహెచ్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి మృతి చెందారు. శ్రీను భార్య రాజమణి ఇచ్చిన ఫిర్యాదుపై హెడ్‌కానిస్టేబుల్‌ ఆర్‌.సత్యనారాయణ కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని