Telangana News: రైతుల ఖాతాల్లో రూ.లక్షల్లో జమ
ఆ రైతుల ఖాతాల్లో డబ్బులు ఎక్కడి నుంచి జమ అయ్యాయో తెలియదు. ఎంత జమ అయ్యాయో కూడా తెలియదు. ఆదివాసీ రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని
రూ. 1.28 కోట్లు డ్రా చేసిన సీఎస్పీ నిర్వాహకుడు
ఆదిలాబాద్ గ్రామీణం, న్యూస్టుడే : ఆ రైతుల ఖాతాల్లో డబ్బులు ఎక్కడి నుంచి జమ అయ్యాయో తెలియదు. ఎంత జమ అయ్యాయో కూడా తెలియదు. ఆదివాసీ రైతుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారి ఏటీఎంల నుంచి సీఎస్పీ నిర్వాహకుడు మాత్రం రూ.1.28 కోట్లు డ్రా చేసిన వైనం ఆదిలాబాద్ జిల్లాలో కలకలం రేపింది. తమ బ్రాంచి నుంచి డబ్బులు డ్రా అయిన విషయం తెలిసిన బ్యాంకు అధికారులు రైతుల వద్దకు వెళ్లి రికవరీకి యత్నించడంలో అసలు విషయం బయటకు వచ్చింది. వివరాల్లోకి వెళితే.. ఆదిలాబాద్ గ్రామీణ మండలం మామిడిగూడ పంచాయతీ సల్పలగూడ గ్రామ రైతులకు ఆదిలాబాద్ పట్టణంలోని బస్టాండ్ సమీపంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉంది. అందులోని ఆదివాసీ రైతులు కొడప భీంరావు, మడావి రాంబాయి, కొడప గంగాదేవిల కిసాన్ క్రెడిట్ కార్డుల నుంచి రూ.1,28,78,000 డ్రా అయినట్లు అధికారులు గుర్తించారు. ఆ డబ్బుల రికవరీ కోసం చీఫ్ మేనేజరు ఎం.వివేక్ సిబ్బందితో కలిసి శుక్రవారం రైతుల వద్దకు వెళ్లారు. అంత డబ్బు తాము డ్రా చేయలేదని మామిడిగూడ సీఎస్పీ(కస్టమర్ సర్వీస్ పాయింట్) నిర్వాహకుడు జటల రమేష్ నుంచి విడతల వారీగా మొత్తం రూ.16.20 లక్షలు తీసుకున్నట్లు చెప్పారు. ఇందులో భీంరావు రూ.5.20 లక్షలు, మడావి రాంబాయి రూ.9.50 లక్షలు, కొడప గంగాదేవి రూ.1.50 లక్షలు సీఎస్పీ నుంచి తీసుకున్నట్లుగా చెబుతుండగా.. మిగిలిన రూ.1,12,58,000 సీఎస్పీ నిర్వాహకుడు రైతుల పేర డ్రా చేసుకున్నట్లుగా బ్యాంకు మేనేజరు తెలిపారు. ఈ మొత్తం నాలుగు నెలలుగా డ్రా చేయడంతో తాము ఏ ఖాతా నుంచి డబ్బులు డ్రా అవుతున్నాయో తెలుసుకోలేకపోయినట్లు పేర్కొన్నారు.
రూ.30 లక్షలు రికవరీ
సీఎస్పీ నుంచి ఇప్పటికే రూ.30 లక్షలు రికవరీ చేసిన అధికారులు ఆయన వద్ద ఉన్న రైతుల కిసాన్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఖాతాలను స్తంభింపజేశారు. రైతులు సైతం ఆ డబ్బులు తిరిగి చెల్లించేందుకు అంగీకరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేయలేదని మేనేజర్ పేర్కొన్నారు.
డబ్బుల జమపైనే అనుమానాలు..?
రైతుల ఖాతాల్లో డబ్బులు ఎక్కడి నుంచి జమ అయ్యాయో.. ఆ డబ్బులు ఎలా డ్రా అయ్యాయో మాత్రం బ్యాంకు అధికారులు చెప్పలేకపోతున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రైతులను గుర్తించిన అధికారులు వారి ఖాతాల్లోనూ ఎలాంటి లావాదేవీలు ఆన్లైన్లో కనిపించకపోవడంతో విస్తుపోతున్నారు. వాస్తవానికి కిసాన్ క్రెడిట్ కార్డు కింద రోజుకు రూ.60 వేల వరకు డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. ఒక్కో రైతు రుణం కింద రూ.2 లక్షల మించి తీసుకోరని అధికారులే చెబుతున్నారు. అలాంటిది అపరిమితంగా క్రెడిట్ కార్డుల నుంచి డబ్బులు ఎలా డ్రా అయ్యాయన్నది మిస్టరీగా మారింది. సమగ్రంగా విచారణ జరిపితేగానీ అసలు విషయం బయటపడేలా లేదు.
నగదు చెల్లించేందుకు అంగీకరించారు
- ఎం.వివేక్, చీఫ్ మేనేజరు, తెలంగాణ గ్రామీణ బ్యాంకు
రైతుల ఖాతాల్లో జమ అయిన బ్యాంకు నగదు తిరిగి చెల్లించేందుకు వారు అంగీకరించారు. ఈ వ్యవహారంలో సీఎస్పీ నిర్వాహకుడి పాత్ర ఉంది. ఆయన నుంచి రూ.30 వేలు రికవరీ చేశాం. మిగిలిన డబ్బులు చెల్లిస్తానని రాత పూర్వక హామీ ఇవ్వడంతో పోలీసు కేసు నమోదు చేయలేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మలేరియా రహిత సమాజానికి కృషి చేయాలి
[ 25-04-2024]
జిల్లాను మలేరియా రహిత జిల్లాగా మార్చడానికి ప్రజలను భాగస్వాములు చేస్తూ కృషి చేయాలని డీఎంహెచ్ఓ నరేందర్ సూచించారు. -
టీకాల నిర్వహణపై పరిశీలన
[ 25-04-2024]
జిల్లాలో టీకాల నిర్వహణ తీరుపై పరిశీలన కార్యక్రమం కొనసాగుతోంది. 2019లో అందుబాటులోకి వచ్చిన ఆర్వీవీ, 2021లో అందుబాటులోకి ... -
వివాహితపై హెడ్ కానిస్టేబుల్ అసభ్య ప్రవర్తన
[ 25-04-2024]
పట్టణంలోని ఓ కాలనీకి చెందిన వివాహితపై బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ అసభ్యంగా ప్రవర్తించిన ఘటన వెలుగు చూసింది. -
కూచిపూడి నృత్యం వేసవి శిక్షణ శిబిరం ప్రారంభం
[ 25-04-2024]
భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకలు నృత్యాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. -
ఉత్సాహంగా అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు
[ 25-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో గురువారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు ఉత్సాహంగా సాగాయి. -
ప్రారంభమైన వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం
[ 25-04-2024]
జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని క్రీడా ప్రాంగణంలో గురువారం హైదరాబాద్ క్రికెట్ సంఘం ఆధ్వర్యంలో వేసవి క్రికెట్ శిక్షణ శిబిరం ప్రారంభమైంది. -
తగ్గిన ఇంటర్ ఉత్తీర్ణత
[ 25-04-2024]
కిందటేడాది మాదిరిగానే ఈసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను బుధవారం ఒకేసారి విడుదల చేశారు. గత సంవత్సరంతో పోల్చితే ఈసారి జిల్లా ఉత్తీర్ణత శాతం కొద్దిగా తగ్గింది. -
అయిదేళ్లుగా ఎదురుచూపులే!
[ 25-04-2024]
కేంద్ర ప్రభుత్వం అందించే పెట్టుబడి సాయం రైతులందరికి అందడం లేదు. ప్రారంభంలో ఉన్న రైతుల్లో నిబంధనల కారణంగా తొలగిస్తున్నా.. కొత్త వారిని చేర్చకపోవడంతో ఏటా సాయం పొందే రైతుల సంఖ్య తగ్గుతోంది. -
దిగజారిన ఫలితాలు..
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ బోర్డు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా గతేడాదితో పోలిస్తే అయిదు స్థానాలు కిందికి పడిపోయి రాష్ట్రంలో 7వ స్థానానికి పరిమితమైంది. అయినప్పటికీ ఉత్తమ ఫలితాలనే సాధించినట్లు సంబంధిత అధికారులు ప్రకటించారు. -
పక్కాగా ఎన్నికల సంఘం మార్గదర్శకాల అమలు
[ 25-04-2024]
పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్రాజ్ అన్నారు. బుధవారం హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారులతో కలిసి జిల్లాల ఎన్నికల అధికారులు, పాలనాధికారులు, -
ఏసీబీ అధికారుల విస్తృత తనిఖీలు
[ 25-04-2024]
నాలుగు వరుసల రహదారి విస్తరణలో భాగంగా.. పరిహారం చెల్లింపులో జరిగిన అక్రమాలపై ‘ఈనాడు’ ప్రచురించిన వరుస కథనాలకు ఏసీబీ అధికారులు స్పందించారు. -
స్థిరాస్తి వ్యాపారుల్లో గుబులు
[ 25-04-2024]
ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడం, నిబంధనలు కాలరాసి వెంచర్లు వేసి అమాయకులను మోసం చేయడం, బాండ్ పేపర్ల మీద రాసుకుంటూ బీడీపీపీ భూములను విక్రయించడం, వివాదాస్పద భూములను వాటాలు వేసుకుని పంచుకోవడం, -
ఏనుగు దాడి ఘటనలో.. బాధిత కుటుంబాలకు పరిహారం
[ 25-04-2024]
కాగజ్నగర్ అటవీ డివిజన్ పరిధిలో ఏనుగు దాడిలో మృతి చెందిన ఇద్దరు రైతుల కుటుంబాలకు ప్రభుత్వం మంజూరు చేసిన పరిహారం చెక్కులను అందజేశారు. -
ఆరో రోజు 8 నామినేషన్లు
[ 25-04-2024]
పెద్దపల్లి లోక్సభ స్థానానికి ఆరో రోజు బుధవారం 8 మంది నామినేషన్లు దాఖలు చేశారు. భాజపా జిల్లా అధ్యక్షుడు చందుపట్ల సునీల్రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, నాయకులు కన్నం అంజయ్యలతో కలిసి -
ఫలితాల్లో దిగజారి.. అట్టడుగుకు చేరి
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో ప్రథమ ద్వితీయ ఫలితాల్లో జిల్లాకు నిరాశే ఎదురైంది. -
అలా ఏర్పాటు.. ఇలా తొలగింపు
[ 25-04-2024]
ఆ యూటర్న్ మృత్యువుకు చిరునామాగా మారింది. ఇక్కడ జరిగిన రహదారి ప్రమాదాల్లో దాదాపు 10 మంది మృతి చెందారు. వీరంతా యూటర్న్ వద్దకు రాగానే ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోయారు. -
మొరం తవ్వేస్తున్నారు.. వెంచర్లలో నింపేస్తున్నారు
[ 25-04-2024]
జిల్లాలో ఏ గుట్టను చూసినా అక్రమ దందా ఎలా సాగుతుందో తెలుస్తోంది. యథేచ్ఛగా మొరం తవ్వకాలు జరుగుతున్నా.. సిబ్బంది లేకనే ఇబ్బందులు ఉన్నాయంటూ సంబంధిత అధికారులు ప్రకటించడం చూస్తుంటే పరోక్షంగా వారికి ఎలా అండగా ఉన్నారో తెలిసిపోతోంది. -
అమ్మాయిలదే హవా
[ 25-04-2024]
ఇంటర్ వార్షిక పరీక్ష ఫలితాల్లో జిల్లాలో బాలికలదే పైచేయిగా నిలిచింది. గత ఏడాది సైతం వారే ముందంజలో ఉన్నారు. రెగ్యులర్ కోర్సుల్లో గత సంవత్సరంకంటే రాష్ట్రస్థాయిలో దిగజారినా ఒకేషనల్లో మాత్రం కొంత మెరుగైంది. -
ఇంటర్లో మెరిసిన విద్యాకుసుమాలు
[ 25-04-2024]
బోథ్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, ఆదర్శ పాఠశాల విద్యార్థులు బుధవారం వెలువడిన ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సర ఫలితాలలో సత్తా చాటారు. -
నమ్మించి మోసం చేసిన హోంగార్డు అరెస్ట్
[ 25-04-2024]
ప్రజలను నమ్మించి మోసం చేసిన హోంగార్డు షమీ ఉల్లాఖాన్ను బుధవారం పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ సీఐ అనిల్ తెలిపిన వివరాల ప్రకారం షమీ ఉల్లాఖాన్ కొద్ది రోజుల క్రితం పట్టణంలో ట్రాఫిక్ విధులు నిర్వహించారు. -
చర్చనీయాంశంగా మాజీ ఎంపీ నామపత్రం దాఖలు
[ 25-04-2024]
మాజీ ఎంపీ రాఠోడ్ రమేష్ ఒక్కరే వచ్చి భాజపా తరఫున నామపత్రం దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది. భాజపా అభ్యర్థి గోడం నగేష్ చేపట్టిన ర్యాలీలో పాల్గొన్న ఆయన ఆ తర్వాత
తాజా వార్తలు (Latest News)
-
ఎక్స్ట్రా ఫీజుతో జొమాటోలో ఇక ఫాస్ట్ డెలివరీలు సేవలు..!
-
మస్క్ పేరుతో మస్కా.. మహిళకు రూ.41 లక్షలకు సైబర్ నేరగాడు టోకరా
-
మాజీ క్రికెటర్పై చిరుత దాడి.. కాపాడిన పెంపుడు శునకం
-
‘ఆ బ్లీచ్ జుట్టుకు చేరినట్టుంది’: ట్రంప్పై బైడెన్ వ్యక్తిగత విమర్శలు
-
323km రేంజ్.. 155km టాప్ స్పీడ్తో అల్ట్రావయోలెట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్
-
తిరుపతిలో తెదేపా కార్యకర్తలపై వైకాపా శ్రేణుల రాళ్ల దాడి.. ఉద్రిక్తత