VK Sasikala: మళ్లీ అన్నాడీఎంకేలోకి చిన్నమ్మ?
దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే వరుస ఓటములు ఎదుర్కొంది. ఇందుకు కారణం పార్టీలో నెలకొన్న వర్గపోరే అని పార్టీ కార్యకర్తలు...
పన్నీర్సెల్వం సమక్షంలో తీర్మానం
పార్టీలో అనూహ్య పరిణామాలు
సైదాపేట, న్యూస్టుడే: దివంగత ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం జరిగిన ఎన్నికల్లో అన్నాడీఎంకే వరుస ఓటములు ఎదుర్కొంది. ఇందుకు కారణం పార్టీలో నెలకొన్న వర్గపోరే అని పార్టీ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఓపీఎస్, ఈపీఎస్ ద్వంద్వ నాయకత్వంతో ఇకపై లాభం లేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఎడప్పాడి పళనిస్వామికి ఎక్కువగా పలుకుబడి ఉండే కొంగు మండలం, పన్నీర్సెల్వానికి పలుకుబడి ఉండే దక్షిణ మండలాల్లోనూ అన్నాడీఎంకేకు ఊహించని ఓటమి ఎదురైంది. దీంతో నాయకత్వాన్ని మార్చాలన్న డిమాండ్ అధికమైంది. అదికూడా జయలలితకు నీడలా వ్యవహరించిన శశికళే పార్టీకి నేతృత్వం వహించాలని దక్షిణ మండల అన్నాడీఎంకే వర్గాలు మాట్లాడుతున్నారు. ఇందుకు ఓపీఎస్ కూడా అంగీకరిస్తారని కొన్ని రోజులుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అనుకోని మలుపు అన్నాడీఎంకేలో చోటు చేసుకుంది. తేని జిల్లా పెరియకుళం కైలాసపట్టిలోని అన్నాడీఎంకే సమన్వయకర్త ఓ.పన్నీర్ సెల్వానికి సొంతమైన ఫామ్ హౌస్లో బుధవారం సమావేశం జరిగింది. ఇందులో తేని జిల్లా అన్నాడీఎంకే ముఖ్య నిర్వాహకులు అనేక మంది పాల్గొన్నారు.
శశికళ చేరికపై అధిష్టానానికి తీర్మానం
పన్నీర్ సెల్వంతో పార్టీ నిర్వాహకులు ఎన్నికల్లో ఓటమి గురించి చర్చించినట్లు తెలుస్తోంది. పార్టీ ఓటమికి వర్గపోరే కారణమని నిర్వాహకులు ఓపీఎస్ ఎదుట ఆరోపించినట్లు సమాచారం. అన్నాడీఎంకే, ఏఎంఎంకే, శశికళ ఒక్కటయితే తప్ప అన్నాడీఎంకే విజయం సాధించటం సాధ్యం కాదని నిర్వాహకులు, కార్యకర్తలు పేర్కొన్నట్లు తెలుస్తోంది. 5వ తేదీ శశికళను అన్నాడీఎంకేలో చేర్చుకోవటం గురించి తీర్మానం ఆమోదించి పార్టీ అధిష్టానానికి పంపాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తేని జిల్లాలో తీసుకున్న నిర్ణయం లాగానే మిగతా జిల్లాల్లో కూడా తీర్మానం ఆమోదిస్తారని తెలుస్తోంది. ప్రారంభం నుంచే శశికళను పార్టీలోకి చేర్చుకోవాలనే అభిప్రాయంలోనే ఓపీఎస్ ఉన్నారు. పార్టీ వ్యవహారాల్లో ఎడప్పాడి పళనిస్వామిది పైచేయిగా ఉండటంతో ఓపీఎస్ వ్యాఖ్యలు సద్దుమణిగాయి. అయితే అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత జరిగిన స్థానిక ఎన్నికల్లో పార్టీ ఘోర పరాజయం పాలైంది. స్థానిక ఓటమి నేపథ్యంలో ఎడప్పాడి వర్గం కొన్ని రోజులుగా మౌనం వహిస్తోంది. తేని జిల్లాలో తీసుకున్న నిర్ణయంపై ఎడప్పాడి వర్గం ఎలా స్పందిస్తారన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మొత్తానికి ఓపీఎస్ సమక్షంలో ఆమోదించిన తీర్మానంతో అన్నాడీఎంకేలో అంతర్గత రాజకీయాలు మళ్లీ వేడెక్కడం ప్రారంభించాయి.ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఆర్బీ ఉదయకుమార్ గురువారం పన్నీర్సెల్వంతో సమావేశమయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అగ్రనేతలు ఏం చేస్తున్నారో!
[ 24-04-2024]
రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యింది. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఫలితాలు వచ్చి ఎన్నికల కమిషన్ ప్రకటన విడుదల చేసేవరకు ఎన్నికల కోడ్ అమల్లోనే ఉంటుంది. అప్పటి వరకు రాజకీయ నేతల సందడి పెద్దగా ఉండకపోవచ్చు. -
అత్యాశతోనే భాజపాలోకి విజయధరణి
[ 24-04-2024]
అత్యాశతోనే విజయధరణి భాజపాలో చేరారని తమిళనాడు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు హసీనా సయ్యద్ ఆరోపించారు. దిల్లీ నుంచి తిరిగి వచ్చిన ఆమెకు సోమవారం రాత్రి చెన్నై విమానాశ్రయంలో పార్టీ మహిళా విభాగం తరఫున ఘనస్వాగతం పలికారు. -
ఓట్ల కోసం మతవిద్వేష ప్రచారాలు తగదు
[ 24-04-2024]
రాజకీయ నాయకులు ఎన్నికల్లో ఓట్ల కోసం మత విద్వేష ప్రసంగాలు చేయరాదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి తెలిపారు. -
కన్నగికి ప్రభుత్వ నివాళి
[ 24-04-2024]
తమిళుల సాంస్కృతిక చిహ్నంగా విరాజిల్లుతున్న కన్నగి విగ్రహానికి రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం నివాళులర్పించింది. -
పుస్తకాలను ప్రేమించండి : ముఖ్యమంత్రి పిలుపు
[ 24-04-2024]
పుస్తకాలు చదవాలని, ప్రేమించాలని ముఖ్యమంత్రి స్టాలిన్ పిలుపునిచ్చారు. ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా ఆయన ఓ సందేశ ప్రకటన విడుదల చేశారు. -
వర్షపాతం పెరిగినా భూమిలో నీరేది!
[ 24-04-2024]
ఈ ఏడాది రాష్ట్రంలో వర్షపాతం పెరిగినా భూమిలో నీరు మాత్రం అప్పుడే అడుగంటింది. చెన్నైలో రుతుపవనాల వర్షాల తర్వాత జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో భూగర్భ జలాలు 8 అడుగుల మేర తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయి. -
కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలి
[ 24-04-2024]
పొరుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళలో లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగే రోజు కార్మికులకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని తమిళనాడు ప్రజా సంబంధాల శాఖ తెలిపింది. -
‘ఇంగ నాన్తాన్ కింగు’ మోషన్ పోస్టర్ విడుదల
[ 24-04-2024]
ఆనంద్ నారాయణ్ దర్శకత్వంలో నటుడు సంతానం నటించిన చిత్రం ‘ఇంగ నాన్తాన్ కింగు’. కథ, స్క్రీన్ప్లే, సంభాషణలు ఎళిచ్చుర్ అరవిందన్. గోపురం ఫిలిం ప్రొడక్షన్ నిర్మించిన ఈ చిత్రంలో మనోబాలా, తంబి రామయ్య, మునిశ్కాంత్, బాల శరవణన్ తదితరులు నటించారు. -
అన్నాడీఎంకే నేత ఎస్టేట్లో వన్యప్రాణుల వేట
[ 24-04-2024]
అన్నాడీఎంకే నేత సజీవన్కు చెందిన సిల్వర్ క్లైవ్డ్ ఎస్టేట్ కూడలూర్లో ఉంది. ఇక్కడ వన్యప్రాణులను వేటాడుతున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అటవీశాఖ అధికారులు అక్కడికి చేరుకుని ఎస్టేట్లో పనిచేస్తున్న ఫైజల్, సాబు జాకబ్ అనే వ్యక్తుల వద్ద దర్యాప్తు చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
జగన్పై రాయి దాడి కేసు.. నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో