పెళ్లయి మరో వ్యక్తితో సాన్నిహిత్యం.. మందలించాడని తమ్ముడిని చంపించిన అక్క
తనకు అడ్డువస్తున్నాడనే నెపంతో పథకం ప్రకారం అక్క తమ్ముడినే హత్య చేయించిన ఘటన మెట్పల్లి పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోదరి ప్రియుడు లొంగిపోవడంతో ఆరు నెలల క్రితం జరిగిన హత్య విషయం బహిర్గతమైంది.
ఆరు నెలల ఆలస్యంగా ఘటన వెలుగులోకి
నిందితులను అరెస్టు చేసిన పోలీసులు
నిందితుల అరెస్టు చూపుతున్న డీఎస్పీ రవీందర్ రెడ్డి
మెట్పల్లి, న్యూస్టుడే : తనకు అడ్డువస్తున్నాడనే నెపంతో పథకం ప్రకారం అక్క తమ్ముడినే హత్య చేయించిన ఘటన జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సోదరి ప్రియుడు లొంగిపోవడంతో ఆరు నెలల క్రితం జరిగిన హత్య విషయం బహిర్గతమైంది. మంగళవారం రాత్రి స్థానిక పోలీస్స్టేషన్లో జరిగిన విలేకర్ల సమావేశంలో సీఐ శ్రీను, ఎస్సై సదాకర్లతో కలిసి మెట్పల్లి డీఎస్పీ రవీందర్ రెడ్డి వెల్లడించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని కళానగర్లో నివాసముంటున్న మహ్మద్ అబ్దుల్ సోహెల్(19) 2021, సెప్టెంబర్ 4న ఇంట్లోంచి వెళ్లిపోయాడని పోలీస్స్టేషన్లో అదృశ్యం కేసు నమోదైంది. సోహెల్ అక్క నిషత్ఫాతిమా(21)తో సజ్జత్అలీ అనే వ్యక్తితో సాన్నిహిత్యం ఉంది. సోదరుడు సోహెల్ అక్క పాతిమాను హెచ్చరించాడు. సోహెల్ తన స్నేహితుడైన బాలుడి(17)కి చెప్పి ఆమెను బెదిరించాడు. దీంతో తమ్ముడిని అడ్డు తొలగించుకోవాలనుకుంది. సోహెల్ను చంపితే రూ.లక్ష సుపారీ ఇస్తానని తనను బెదిరించిన బాలుడితో ఒప్పందం చేసుకుంది. 2021 సెప్టెంబర్ 4న రాత్రి 8 గంటల ప్రాంతంలో బాలుడు, సోహెల్ను పట్టణంలోని ఎస్సారెస్పీ ప్రధానకాలువ పక్కన ఉన్న దోబీఘాట్ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ సజ్జత్అలీ, మరో స్నేహితుడు ఎం.డి మహ్మద్(19), బాలుడు, సోహైల్ కలిసి మద్యం తాగారు. అనంతరం గొడవ జరగ్గా సోహెల్ తలపై బీరు సీసాలతో కొట్టి, దోబీఘాట్లో దొరికిన చీరతో మెడకు ఉరి బిగించి చంపారు. శవం ఆధారం దొరకకుండా నీళ్లు ప్రవహిస్తున్న ఎస్సారెస్పీ ప్రధాన కాలువలో పడవేశారు. సోదరి ప్రియుడు, నిందితుడైన సయ్యద్ సజ్జత్ అలీ అలియాస్ షాబాద్(25) సోమవారం జగిత్యాలకు చెందిన ఖాజీ కుతుబుద్దీన్ అనే వ్యక్తితో వచ్చి పోలీసులకు లొంగిపోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సజ్జత్ అలీని విచారించగా హత్య పూర్తి వివరాలు తెలిపాడు. విచారణలో మిగతా నేరస్థులు నేరాన్ని అంగీకరించారు. హత్యకు కారకులైన సయ్యద్ సజ్జత్అలీ, బాలుడు, ఎం.డి.మహ్మద్, మృతుని సోదరి నిషత్ఫాతిమాలను మంగళవారం అరెస్టు చేసి రిమాండ్కు పంపిచామని పోలీసులు తెలిపారు. తమకు శవం చూపాలంటూ మృతుడి బంధువులు స్టేషన్కు తరలివచ్చారు. మృతదేహాన్ని గుర్తించడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని వారిని డీఎస్పీ శాంతింపజేశారు. సోదరి నిషత్ఫాతిమాకు వివాహం అయింది. భర్త కరీంనగర్లో ఉంటున్నాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ద్వితీయంలో 4.. ప్రథమంలో 5
[ 25-04-2024]
రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు వారు బుధవారం ప్రకటించిన ఇంటర్ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గత విద్యాసంవత్సరం కంటే మెరుగైన ఫలితాలను సాధించారు. ద్వితీయ సంవత్సరంలో నాలుగు, ప్రథమలో అయిదో స్థానం సాధించారు. -
రాజేందర్రావు చేతికే టికెట్
[ 25-04-2024]
రోజుల తరబడి నిరీక్షణకు కాంగ్రెస్ పార్టీ తెరదించింది. ఎట్టకేలకు నామినేషన్ల చివరి రోజుకు ముందు బుధవారం రాత్రి అభ్యర్థిని ప్రకటించింది. కరీంనగర్ లోక్సభ స్థానంలో పోటీ చేసేందుకు వెలిచాల రాజేందర్రావుకు అవకాశమిచ్చింది. -
కాంగ్రెస్తో భారాస నేతల కుమ్మక్కు
[ 25-04-2024]
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని తాను కొట్లాడుతుంటే భారాస నేతలు ఆ పార్టీతో కుమ్మక్కై తనను ఓడించాలని చూస్తున్నారని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ విమర్శించారు. -
ఆరో రోజు 17 నామినేషన్లు
[ 25-04-2024]
లోక్సభ ఎన్నికల్లో కీలక అంకానికి గురువారంతో తెరపడనుంది. లోక్సభ నియోజకవర్గం బరిలో నిలిచే అభ్యర్థుల నామినేషన్ దాఖలుకు నేడు చివరి రోజు కావడంతో గడిచిన వారం రోజుల నుంచి కొనసాగుతున్న ప్రక్రియ మధ్యాహ్నం 3 గంటలతో ముగియనుంది. -
పేదింటి బిడ్డలు ఇంటర్లో మెరిశారు
[ 25-04-2024]
కరీంనగర్ విద్యావిభాగం, భాగ్యనగర్, న్యూస్టుడే : ఇంటర్మీడియెట్ ఫలితాల్లో పేద విద్యార్థులు ప్రతిభ చాటారు. తల్లిదండ్రులు కష్టపడి చదివించగా.. వారి పేరు నిలబెట్టారు. ఉపాధ్యాయుల సహకారంతో ఉత్తమ మార్కులు సాధించారు. -
భూ కబ్జా వ్యవహారంలో కార్పొరేటర్.. ఆమె భర్తపై కేసు
[ 25-04-2024]
కొనుగోలు చేసిన భూమికి సంబంధించి నకిలీ పత్రాలు సృష్టించడమే కాకుండా బాధితుడిని డబ్బుల కోసం బెదిరించిన నాయకులతోపాటు వారికి సహకరించిన నగరపాలక సంస్థ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేసి కొంత మందిని అరెస్టు చేశారు. -
బాలికలదే పై చేయి
[ 25-04-2024]
జిల్లాలో ఇంటర్మీడియట్ ఫలితాలు నిరాశ పరిచాయి. సర్కారు కళాశాలల్లో ఆధునిక వసతులు, సరిపడా బోధన సిబ్బంది, విద్యార్థుల దత్తత, తరుచూ చరవాణిలో తల్లిదండ్రులను సంప్రదించినా ఆశించిన మేర ఫలితాలు రాలేదు. -
జూన్ 6 తర్వాత నిరుపేదలకు ఇళ్లు
[ 25-04-2024]
జూన్ 6 తర్వాత ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్లు ఇచ్చే కార్యాచరణ చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు పేర్కొన్నారు. -
భాజపా బీఫామ్ ఎవరికో!
[ 25-04-2024]
నామినేషన్ల ఘట్టం తుది దశకు చేరిన వేళ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గంలో భాజపా తరఫున బరిలో ఉండే అభ్యర్థిపై ఉత్కంఠ వీడటం లేదు. పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన గోమాసె శ్రీనివాస్ బుధవారం రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. -
ఇంటర్ ఫలితాల్లో బాలికలదే హవా
[ 25-04-2024]
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాల్లో అమ్మాయిల హవా కొనసాగింది. ఫిబ్రవరి 28 నుంచి మార్చి 19 వరకు జరిగిన పరీక్షల్లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఒకేషనల్ కలిపి 7,624 మంది పరీక్షలకు హాజరవగా అందులో 4,628 మంది ఉత్తీర్ణత సాధించారు. -
పెరిగిన వినియోగం.. తగ్గిన గృహజ్యోతి లబ్ధిదారులు
[ 25-04-2024]
వేసవి ఎండల తీవ్రత కారణంగా విద్యుత్తు వినియోగం భారీగా పెరిగింది. దీని ప్రభావం గృహజ్యోతి పథకం లబ్ధిదారులపై పడింది. దీంతో చాలా మంది మార్చిలో ఈ పథకానికి అనర్హులుగా తేలారు. -
ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్లు కుమ్మక్కు: కేటీఆర్
[ 25-04-2024]
ప్రస్తుత పార్లమెంటు ఎన్నికల్లో భాజపా, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కయ్యాయని, అందుకే ప్రజలకు తెలియని వ్యక్తిని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబెట్టారని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. -
ఇంటర్లో బాలికలదే పైచేయి
[ 25-04-2024]
ప్రథమ సంవత్సరంలో 5,717 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 2,955 మంది ఉత్తీర్ణులయ్యారు. 51.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. వొకేషనల్లో 949 మంది విద్యార్థులకుగాను 419 మంది ఉత్తీర్ణత సాధించారు. -
భానుడి భగభగ
[ 25-04-2024]
రాష్ట్రవ్యాప్తంగా బుధవారం నమోదైన పది గరిష్ఠ పగటి ఉష్ణోగ్రత ప్రాంతాల్లో కరీంనగర్ జిల్లాలోని రెండు ప్రదేశాలున్నాయి. -
బెదిరింపు రాజకీయాలు సరికాదు
[ 25-04-2024]
కాంగ్రెస్ నాయకులు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ తమ పార్టీ అభ్యర్థులు, శ్రేణులను చేర్చుకుంటున్నారని, అలాంటి చర్యలు తగవని భారాస ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
-
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
-
(ADVT) జేఈఈ మెయిన్ ఓపెన్ కేటగిరీలో ఆలిండియా 1st ర్యాంక్ నారాయణదే