logo

Andhra News: హైదరాబాద్‌ వెళితే జగన్‌ జైలుకే: అయ్యన్నపాత్రుడు

రాజధాని విషయంలో మంత్రి బొత్స సత్యనారాయణ గందరగోళానికి గురిచేస్తున్నారని మాజీ మంత్రి, తెదేపా అగ్రనేత చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. బుధవారం

Updated : 10 Mar 2022 08:58 IST

నర్సీపట్నం అర్బన్‌, న్యూస్‌టుడే: రాజధాని విషయంలో మంత్రి బొత్స సత్యనారాయణ గందరగోళానికి గురిచేస్తున్నారని మాజీ మంత్రి, తెదేపా అగ్రనేత చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. బుధవారం ఆయన వీడియో ప్రకటనలో మాట్లాడారు. ‘హైదరాబాదే రాజధానంటూ బొత్స అంటున్నారు. హైదరాబాద్‌ వెళ్లండి.. మీ సీఎంని సీబీఐ అధికారులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపిస్తారు. మూడు రాజధానులని చెబుతూ మళ్లీ హైదరాబాద్‌ రాజధాని అనడం ఏమిటో?, ఇలాంటి తుగ్లక్‌ మాటలొద్దు. గత నవంబరుకే పోలవరం నుంచి నీళ్లిస్తామని జలవనరుల శాఖ మంత్రి ప్రకటించారు. మార్చి గడుస్తున్నా నీళ్ల జాడ ఏద’ని
అయ్యన్న ఎద్దేవా చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని