logo

Telangana News: హిజ్రాను మనువాడిన యువకుడు

పెద్దలను ఒప్పించి ఓ యువకుడు, హిజ్రా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో వివాహం చేసుకున్నారు. వివరాలు.. భూపాలపల్లికి చెందిన యువకుడు రూపేశ్‌, ఆళ్లపల్లి మండలం అనంతోగు గ్రామానికి చెందిన హిజ్రా అఖిలకు

Published : 12 Mar 2022 06:58 IST

కల్యాణ మండపంలో రూపేశ్‌, అఖిల

ఇల్లెందు, న్యూస్‌టుడే: పెద్దలను ఒప్పించి ఓ యువకుడు, హిజ్రా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో వివాహం చేసుకున్నారు. వివరాలు.. భూపాలపల్లికి చెందిన యువకుడు రూపేశ్‌, ఆళ్లపల్లి మండలం అనంతోగు గ్రామానికి చెందిన హిజ్రా అఖిలకు మూడేళ్ల క్రితం పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. గత 3 నెలల నుంచి ఇల్లెందు పట్టణంలోని స్టేషనుబస్తీలో ఓ ఇంటిని అద్దెకు తీసుకొని సహజీవనం చేస్తున్నారు. ఇరు కుటుంబాలకు విషయం చెప్పి పెళ్లికి ఒప్పించారు. వారంతా అంగీకరించడంతో మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ వైభవంగా శుక్రవారం పెళ్లి చేసుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని