logo

Hyderabad News: పెళ్లి సంబంధం మాట్లాడేందుకు వచ్చి.. వైద్యుడి మృతి

కూమార్తె పెళ్లి సంబంధం మాట్లాడేందుకు నగరానికి వచ్చిన వైద్యుడు ప్రమాదవశాత్తు హోటల్‌ లిఫ్టు గుంతలో పడి మృతి చెందిన ఘటన ఇది. బంజారాహిల్స్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌ ఇండోర్‌కు చెందిన వైద్యుడు

Updated : 20 Mar 2022 07:54 IST


పంకజ్‌కుమార్‌ జైన్‌

జూబ్లీహిల్స్‌, న్యూస్‌టుడే: కూమార్తె పెళ్లి సంబంధం మాట్లాడేందుకు నగరానికి వచ్చిన వైద్యుడు ప్రమాదవశాత్తు హోటల్‌ లిఫ్టు గుంతలో పడి మృతి చెందిన ఘటన ఇది. బంజారాహిల్స్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌ ఇండోర్‌కు చెందిన వైద్యుడు పంకజ్‌ కుమార్‌ జైన్‌(60) కుమార్తె వివాహ సంబంధం నిమిత్తం కుటుంబంతో కలిసి గురువారం నగరానికి వచ్చారు. భార్య ఆశాజైన్‌, ఇద్దరు కుమార్తెలతో కలిసి కోఠిలోని ఓ హోటల్‌లో బస చేశారు. శుక్రవారం ఉదయం బంజారాహిల్స్‌ రోడ్‌ నం12లోని హోటల్‌లో రెండు గదులు అద్దెకు తీసుకొని దిగారు. అనంతరం పెళ్లి మాటలకు వెళ్లి రాత్రి తిరిగొచ్చారు. పది గంటల సమయంలో హోటల్‌ మూడో అంతస్తులో ఉన్న ఆశాజైన్‌ తన కుమార్తెలతో కలిసి భోజనానికి వెళ్లారు. ఆరో అంతస్తులో ఉన్న ఆయన ప్రమాదవశాత్తు నిర్మాణంలో ఉన్న లిఫ్టుగుంతలో పడిపోయాడు. కొద్ది సమయం తరువాత కుమార్తె తండ్రి కోసం వెదకగా లిఫ్టు గుంతలో రక్తపు మడుగులో కనిపించారు. హోటల్‌ సిబ్బంది సాయంతో ఆయన్ని బంజారాహిల్స్‌లోని విరించి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుమార్తె అనుపమజైన్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని