మహిళ పొట్టలో హ్యాండ్ గ్లోవ్స్ వదిలేసి సర్జరీ చేసేశారు!
ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యంతో ఓ బాలింత ప్రాణాలకు ముప్పు వాటిల్లింది. ఆమె భర్త అప్రమత్తమై విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లడంతో అక్కడి వైద్యులు శస్త్రచికిత్స చేసి బాధితురాలిని కాపాడారు. రాయగడ జిల్లా కేంద్రాసుపత్రిలో చోటుచేసుకున్న
రాయగడ జిల్లా కేంద్రాసుపత్రిలో ఘటన
తొలగించిన విశాఖ పట్టణం వైద్యులు
బాధితురాలు కాంచన్
రాయగడ పట్టణం, న్యూస్టుడే: ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యంతో ఓ బాలింత ప్రాణాలకు ముప్పు వాటిల్లింది. ఆమె భర్త అప్రమత్తమై విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లడంతో అక్కడి వైద్యులు శస్త్రచికిత్స చేసి బాధితురాలిని కాపాడారు. రాయగడ జిల్లా కేంద్రాసుపత్రిలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. కొరాపుట్ జిల్లా లక్ష్మీపూర్ పోలీస్స్టేషన్ పరిధి బిరిగూడ గ్రామానికి చెందిన చేతన్ హల్బా భార్య కాంచన్ ప్రసవం కోసం గతేడాది అక్టోబర్ 3వ తేదీన స్థానిక జిల్లా కేంద్రాసుపత్రిలో చేరింది. సిజేరియన్ చేయడంతో మగబిడ్డ జన్మనివ్వగా అక్టోబర్ 8న కాంచన్ని డిశ్చార్జ్ చేశారు. ఇది జరిగిన 15 రోజుల తరువాత ఆమెకు కడుపునొప్పి రావడంతో మళ్లీ జిల్లా కేంద్రాసుపత్రికి వెళ్లారు. ఆమెను పరీక్షించిన వైద్యుడు ప్రఫుల్ల పాఢి సమస్య ఏమీ లేదని మందులు రాసిచ్చారు. మూడు నెలల తరువాత కడుపునొప్పి మళ్లీ తీవ్రం కావడంతో ఈ ఏడాది జనవరి 31న కొరాపుట్లో జిల్లాకేంద్రాసుపత్రిలో చేర్పించారు. అల్ట్రాస్కానింగ్ చేసిన వైద్యులు కాంచన్ పొట్టలో ఏవో వస్తువులు ఉన్నట్లు గుర్తించి వెంటనే శస్త్రచికిత్స చేయాలని లేదంటే ఆమె ప్రాణానికి ప్రమాదమని భావించి కటక్ లేదా బ్రహ్మపుర తీసుకెళ్లాలని సూచించారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆమెను విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించగా బాధితురాలి పొట్టలో చేతి తొడుగులు (గ్లోవ్స్) ఉన్నట్లు గుర్తించి పిబ్రవరి 5న వాటిని తొలగించారు. ఈ విషయమై బాధితురాలి భర్త మాట్లాడుతూ ఘటనపై ఈ నెల 18న రాయగడ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. చికిత్స కోసం రూ.12లక్షల వరకు ఖర్చు అయిందని వాపోయారు.
విచారణకు ఆదేశిస్తాం
ఈ విషయాన్ని కలెక్టర్ సరోజ్కుమార్ మిశ్ర దృష్టికి తీసుకెళ్లగా ఘటనపై విచారణకు ఆదేశిస్తామని చెప్పారు. జిల్లా ముఖ్యవైద్యాధికారి లాల్మోహన్ రౌత్రాయ్ మాట్లాడుతూ.. ఈ ఘటన తన హయాంలో జరగలేదని, అప్పుడు వేరే సీడీఎంవో ఉన్నట్లు పేర్కొన్నారు. అయినప్పటికీ దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు.
శస్త్రచికిత్స అనంతరం వైద్యులు తొలగించిన చేతి తొడుగులు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మావో డంప్ స్వాధినం
[ 19-04-2024]
మల్కానిగిరి జిల్లా కలిమెల ఠాణా పరిధిలో వున్న సానో టేకుడ, బెజంగి వాడ గ్రామం మధ్యలో వున్న అడవిలో బి.ఎస్.ఎఫ్. జవాన్లు మావో డంప్ స్వాధినం చెసుకున్నారు. -
వారసులొచ్చారు
[ 19-04-2024]
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కొంతమంది ప్రముఖ నాయకులు పోటీ నుంచి తప్పుకున్నారు. వారి భార్యలు, వారసులను బరిలోకి దించారు. బిజద, భాజపా, కాంగ్రెస్ పార్టీల నాయకత్వాలు వారికి అవకాశం కల్పించాయి. తండ్రులు, తల్లులు వారి తరుఫున ప్రచారం చేస్తున్నారు. -
కమిషనరేట్ ఆధ్వర్యంలో ‘హెర్’ టీం
[ 19-04-2024]
మహిళల్ని వేధించే వారి భరతం పట్టడానికి జంటనగరాల (భువనేశ్వర్, కటక్) కమిషనరేట్ యంత్రాంగం ‘హై ఎఫిషియన్సీ రెస్పాన్స్ (హెరా) టీం ఏర్పాటు చేసింది. -
సత్వర విద్యుత్తు సేవలకు ‘సంచార సబ్ స్టేషన్’లు
[ 19-04-2024]
వేసవిలో ప్రజలకు మరింత మెరుగైన విద్యుత్తు సేవలు అందించేందుకు, సరఫరాలో అంతరాయం ఏర్పడితే సత్వర సేవలకు ‘సంచార సబ్ స్టేషన్’లు సిద్ధం చేశామని విద్యుత్తు సరఫరా సంస్థ ‘టాటా పవర్ సదరన్ ఒడిశా డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్’ (టీపీఎస్ఓడీఎల్) బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది -
జగన్నాథునికి రూ.2.51 కోట్ల విరాళం
[ 19-04-2024]
రిలయన్స్ గ్రూపు సంస్థల అధినేత ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ బుధవారం పూరీ శ్రీక్షేత్రానికి వచ్చారు. జగన్నాథుని సన్నిధిలో పూజలు చేశారు. -
సచిదాస్ కన్నుమూత
[ 19-04-2024]
జత్రా పార్టీ (నాటకాలు) దర్శకునిగా, నటునిగా ఖ్యాతి గాంచిన సచిదాస్ (91) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అస్వస్థతతో కటక్లోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. -
ఎవరి ప్రయోజనాల కోసం రెండుచోట్ల పోటీ?
[ 19-04-2024]
ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మళ్లీ రెండుచోట్ల పోటీకి సిద్ధమయ్యారు. దీనివల్ల ప్రజలకు ఒరిగేదేమిటని? ఈ పోటీ ఎవరి ప్రయోజనాల కోసమని? సార్వత్రిక ఎన్నికల తర్వాత మరో ఉప ఎన్నిక, వ్యయప్రయాసలు మినహా సాధించేదేమిటని విమర్శలు వినిపిస్తున్నాయి. -
నేటి నుంచి మజ్జిగౌరీ చైత్రోత్సవాలు
[ 19-04-2024]
రాయగడ ఉత్కళాంధ్రుల ఇలవేల్పు, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి మజ్జిగౌరీ అమ్మవారి చైత్రోత్సవ సంబరాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. -
‘శ్రేష్ఠ భారత్’ ఏర్పాటుకు అంతా సహకరించాలి
[ 19-04-2024]
‘శ్రేష్ఠ భారత్’ లక్ష్యంగా దేశంలోని అన్ని ప్రాంతాలు, వర్గాలు, అన్ని రంగాల సమగ్ర అభివృద్ధికి ప్రధాని మోదీ 2024 సంకల్ప పత్రం జారీ చేశారని, ప్రజలంతా సహకరించి, మరోసారి మోదీని ప్రధాని చేసేందుకు ముందుకు రావాలని బ్రహ్మపుర లోక్సభ భాజపా అభ్యర్థి ప్రదీప్ కుమార్ పాణిగ్రహి కోరారు -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం
[ 19-04-2024]
గంజాం జిల్లా గొళంత్రా ఠాణా పరిధిలోని కొణిసి-తుళు మార్గంలో బుధవారం మధ్యాహ్నం రెండు ద్విచక్ర వాహనాలు బలంగా ఢీకొన్న దుర్ఘటనలో ఇద్దరు యువకులు ఎమ్కేసీజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు
తాజా వార్తలు (Latest News)
-
ప్రైవేటు ఆస్పత్రిలో తెగిపడిన లిఫ్ట్.. 9 మందికి తీవ్ర గాయాలు
-
సీపీఎం కార్యాలయానికి భట్టి విక్రమార్క.. లోక్సభ ఎన్నికల్లో మద్దతుపై చర్చ
-
2026 నాటికి ఎయిర్ట్యాక్సీలు.. 7 నిమిషాల్లో 27 కిలోమీటర్లు!
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
20లక్షల ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది: చంద్రబాబు