logo

Irani chai: ‘ఇరానీ చాయ్‌’ ఇక ధర చురుక్కు!

హైదరాబాద్‌ షాన్‌ ‘ఇరానీ చాయ్‌’ ధర పెంపునకు హోటళ్ల బృందం నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి రూ.5 పెంచనున్నట్లు తెలిపారు. పెరుగుతున్న నిత్యావసర ధరలతో హోటళ్ల మనుగడ సాగని క్రమంలో

Updated : 25 Mar 2022 07:18 IST

ఈనాడు డిజిటల్‌, హైదరాబాద్‌: హైదరాబాద్‌ షాన్‌ ‘ఇరానీ చాయ్‌’ ధర పెంపునకు హోటళ్ల బృందం నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి రూ.5 పెంచనున్నట్లు తెలిపారు. పెరుగుతున్న నిత్యావసర ధరలతో హోటళ్ల మనుగడ సాగని క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కప్పు టీ ధర రూ.15 నుంచి రూ.20కి పెంచారు. కరోనా ప్రభావం ఈ హోటళ్లపైనా పడింది. ఇరానీ చాయ్‌పత్తా ధర కిలో రూ.300నుంచి రూ.500కు చేరుకొంది. నాణ్యమైన పాలతో మాత్రమే సంప్రదాయ ఇరానీ చాయ్‌ చేయడం సాధ్యం. ప్రస్తుతం నాణ్యమైన పాలు లీటరు రూ.100కు చేరగా వాణిజ్య సిలిండర్‌ ధర కూడా భారీగా పెరిగింది. కరోనా తర్వాత నిర్వహణ ఖర్చులు పెరిగిపోవడంతో.. పాత ధరకు విక్రయించడం సాధ్యం కాదని హోటళ్ల నిర్వాహకులు చెబుతున్నారు. ఇరానీ చాయ్‌ తయారు చేయడమూ ఓ ప్రత్యేక కళే. పాలు, టీ పొడి, నాణ్యత విషయంలో ఏ మాత్రం రాజీ పడినా ప్రత్యేక రుచి రాదు. దీంతో ధరలు పెంచక తప్పడం లేదంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని