logo

Hyderabad News: ఛార్జింగ్‌ పెట్టి.. ఫోన్‌ మాట్లాడుతున్న యువకుడి మృతి

ఛార్జింగ్‌ పెట్టి.. ఫోన్‌ మాట్లాడుతున్న ఓ యువకుడు షాక్‌ కొట్టి మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం అర్ధరాత్రి శంకర్‌పల్లి మండలంలో చోటుచేసుకుంది. శంకర్‌పల్లి ఎస్సై క్రిష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. అసోం రాష్ట్రానికి చెందిన

Updated : 30 Mar 2022 07:11 IST

భాస్కర్‌ జ్యోతినాథ్‌

శంకర్‌పల్లి మున్సిపాలిటీ, న్యూస్‌టుడే: ఛార్జింగ్‌ పెట్టి.. ఫోన్‌ మాట్లాడుతున్న ఓ యువకుడు షాక్‌ కొట్టి మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం అర్ధరాత్రి శంకర్‌పల్లి మండలంలో చోటుచేసుకుంది. శంకర్‌పల్లి ఎస్సై క్రిష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. అసోం రాష్ట్రానికి చెందిన భాస్కర్‌ జ్యోతినాథ్‌(20) బతుకుదెరువు నిమిత్తం రెండేళ్ల క్రితం శంకర్‌పల్లికి వచ్చాడు. ఎలక్ట్రీషియన్‌ పనులు చేసేవాడు. సోమవారం రాత్రి గదిలో ఫోన్‌ ఛార్జింగ్‌ పెట్టి మాట్లాడుతుండగా షాక్‌ తగిలింది. భాస్కర్‌ చేతులు, చెవుల భాగం కాలిపోయింది. స్నేహితులు శంకర్‌పల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని