logo

ధిక్కరించి వివాహం.. కుమార్తెను పెళ్లి దుస్తుల్లోనే లాక్కెళ్లిన తల్లిదండ్రులు

తమ నిర్ణయాన్ని ధిక్కరించి పెళ్లి చేసుకున్న కుమార్తెను పెళ్లి దుస్తుల్లోనే తల్లిదండ్రులు లాక్కెళ్లిన సంఘటన మైసూరు జిల్లా హుణసూరులో బుధవారం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మండ్య జిల్లా నాగమంగల తాలూకా కదబహళ్లికి చెందిన అభిషేక్‌- చోళేనహళ్లి నివాసి అనన్య రెండేళ్లుగా ప్రేమికులు. వీరి ప్రేమను

Updated : 31 Mar 2022 09:25 IST


అనన్య, అభిషేక్‌

మైసూరు, న్యూస్‌టుడే : తమ నిర్ణయాన్ని ధిక్కరించి పెళ్లి చేసుకున్న కుమార్తెను పెళ్లి దుస్తుల్లోనే తల్లిదండ్రులు లాక్కెళ్లిన సంఘటన మైసూరు జిల్లా హుణసూరులో బుధవారం చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మండ్య జిల్లా నాగమంగల తాలూకా కదబహళ్లికి చెందిన అభిషేక్‌- చోళేనహళ్లి నివాసి అనన్య రెండేళ్లుగా ప్రేమికులు. వీరి ప్రేమను అనన్య కుటుంబ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈనేపథ్యంలో పోలీసుల సమక్షంలో నిరాడంబరంగా వివాహం చేసుకున్నారు. వివాహానంతరం ఓ హోటల్‌కు వెళ్తుండగా అనన్య తల్లిదండ్రులు, బంధువులు ఒక్కసారిగా దాడి చేసి ఆమెను లాక్కెళ్లారు. ఈ విషయాన్ని అభిషేక్‌ పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. హుణసూరు పోలీసులు కేసు దర్యాప్తును చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని