logo

Suicide: భార్య మందలించిందని భర్త ఆత్మహత్య

సరకులకు ఇచ్చిన డబ్బుతో మద్యం తాగిన భర్తను భార్య మందలించడంతో వాటర్‌ ట్యాంక్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన పహాడీషరీఫ్‌ ఠాణా పరిధిలో శనివారం

Updated : 03 Apr 2022 08:07 IST

పహాడీషరీఫ్‌, న్యూస్‌టుడే: సరకులకు ఇచ్చిన డబ్బుతో మద్యం తాగిన భర్తను భార్య మందలించడంతో వాటర్‌ ట్యాంక్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్‌లోని పహాడీషరీఫ్‌ ఠాణా పరిధిలో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై రమేష్‌ కథనం ప్రకారం.. హర్షగూడలో ఉండే సురేష్‌(43) సరిత దంపతులకు ఇద్దరు పిల్లలు. కూలి పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు. పనులు దొరక్క ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. శనివారం నిత్యావసరాలు తేవాలని కొంత నగదును సరిత.. భర్తకు ఇచ్చింది. ఆ నగదుతో మద్యం తాగేసి ఖాళీ చేతులతో భర్త ఇంటికి వచ్చాడు. దీంతో ఆమె మందలించింది. మనస్తాపం చెందిన అతను మద్యం మత్తులోనే గ్రామంలోని వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసి భార్య శోకంలో మునిగిపోయింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని