logo

Crime News: దారుణం.. లోకం తెలియని పసికందును చిదిమేసిన తండ్రి

తల్లిదండ్రులే తన ప్రపంచంగా భావించే.. లోకం తెలియని 9 నెలల పసికందుని కన్నతండ్రే చిదిమేశాడు. తానే చంపినట్లు పోలీసుల ముందు తండ్రి అంగీకరించగా,....

Updated : 05 Apr 2022 08:33 IST

అదృశ్యమైన బాలిక కథ విషాదాంతం


ప్రియ

షాద్‌నగర్‌ పట్టణం, న్యూస్‌టుడే: తల్లిదండ్రులే తన ప్రపంచంగా భావించే.. లోకం తెలియని 9 నెలల పసికందుని కన్నతండ్రే చిదిమేశాడు. తానే చంపినట్లు పోలీసుల ముందు తండ్రి అంగీకరించగా, తల్లిపాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లోని బాపన్‌గుట్ట తండాకు చెందిన నరేష్‌, రజనిల కుమార్తె ప్రియ(9నెలలు) అదృశ్యమైనట్లు ఆదివారం సాయంత్రం షాద్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు అందింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. కిషన్‌నగర్‌ శివారులో చెట్లపొదల్లో చిన్నారి శవం ఉన్నట్లు సోమవారం సమాచారం అందగా పోలీసులు పరిశీలించారు. ప్రియ మృతదేహం కనిపించింది. తలపై కొట్టి చంపినట్లు గుర్తించారు.

చంపి వచ్చి ఫిర్యాదు.. కుమార్తెను హతమార్చిన నరేష్‌ భార్యతో కలిసి ఆదివారం నేరుగా షాద్‌నగర్‌ ఠాణాకు వచ్చాడు. కుమార్తె కనిపించడం లేదంటూ హంగామా చేశాడు. కూలిపని చేసుకునే ఈ దంపతులు అనారోగ్యంతో బాధపడుతున్నారు. మద్యం తాగి గొడవ పడుతుంటారు. బాలికను మద్యం మత్తులో చంపేశాడా, తమ ఆరోగ్య పరిస్థితి కారణంగా హతమార్చాడా అన్నది తేలాల్సి ఉంది. బలంగా తోయడంతో గోడకు తగిలి మరణించిందంటున్నాడు. భార్యాభర్త పొంతన లేని సమాధానం చెబుతుండడంతో ఆమె పాత్రపైనా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని సీఐ నవీన్‌కుమార్‌ పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని