తరలిరానున్న తలంబ్రాలు..!
కరోనా అన్ని రంగాలను అతలాకుతలం చేసింది. ఆధ్యాత్మిక క్షేత్రాలకూ కొవిడ్ తాకిడి తప్పలేదు. ఏటా పెద్దసంఖ్యలో జనాలతో అలరారే భద్రాచలం సీతారాముల కల్యాణోత్సవం గత రెండేళ్లుగా ఆంక్షల....
‘ఆర్టీసీ’ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాలో విశేష ఆదరణ
రసీదు అందజేస్తున్న డీఎం సాయన్న
నిర్మల్ పట్టణం, న్యూస్టుడే: కరోనా అన్ని రంగాలను అతలాకుతలం చేసింది. ఆధ్యాత్మిక క్షేత్రాలకూ కొవిడ్ తాకిడి తప్పలేదు. ఏటా పెద్దసంఖ్యలో జనాలతో అలరారే భద్రాచలం సీతారాముల కల్యాణోత్సవం గత రెండేళ్లుగా ఆంక్షల నడుమ సాదాసీదాగా చేపట్టాల్సి వచ్చింది. పరిస్థితులు సద్దుమణగడంతో ఈసారి ఘనంగా ఉత్సవాలు జరిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. చాలామంది భక్తులకు వెళ్లాలని ఉన్నా, చిన్న చిన్న అనుమానాలతో వెనుకడుగు వేస్తున్నారు. దీనికితోడు పెరిగిన పెట్రో, డీజీలు ధరలు, ప్రయాణ రుసుముల భారాన్ని ఎలా అధిగమించాలా అనే సందిగ్ధంలో పడిపోయారు. ఇలాంటి వారికి ఊరటనిచ్చేలా ఆర్టీసీ నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. కోరుకున్న భక్తుల ఇంటికే కల్యాణోత్సవ తలంబ్రాలను తీసుకొచ్చి ఇచ్చేలా ఏర్పాట్లు చేసింది.
కల్యాణం ముగియగానే..
ఏప్రిల్ 10న శ్రీరామనవమి నాడు సీతారాముల కల్యాణోత్సవం వైభవంగా జరుగుతుంది. ఇది పూర్తయిన అనంతరం భక్తులకు తలంబ్రాలను పంపిణీ చేసేందుకు ఆలయాధికారులతో ఆర్టీసీ ఒప్పందం చేసుకుంది. సంస్థలో ప్రత్యేకంగా కొనసాగిస్తున్న కార్గో, పార్సిల్ సేవా విభాగం దీన్ని పర్యవేక్షిస్తుంది. తలంబ్రాలు కావాలనుకునే వారు సమీపంలో ఉన్న ఆర్టీసీ పార్సిల్ కేంద్రాల్లో రూ.80 చెల్లించి బుకింగ్ చేసుకోవాలి. చిరునామా, ఇతర వివరాలను అందించాలి. తదనుగుణంగా పంపిణీ పూర్తి చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు.
ప్రచార ఫ్లెక్సీ
రీజియన్ ప్రథమం..
బుకింగ్స్ ఇటీవలే ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని రీజియన్లలో ఆదిలాబాద్ అత్యధిక బుకింగ్స్తో ప్రథమస్థానంలో నిలవడం విశేషం. తెలంగాణలో 27,111 బుకింగ్స్ జరిగితే ఇందులో ఆదిలాబాద్ రీజియన్ పరిధిలోనే సోమవారం నాటికి 4,052 బుకింగ్స్ నమోదయ్యాయి. రుసుము కింద రూ.3,24,160 చెల్లించారు. హైదరాబాద్ రీజిజియన్ 1,258 బుకింగ్స్తో చివరిస్థానంలో ఉంది. ఆదిలాబాద్ రీజియన్ పరిధిలో ఉన్న ఆరు డిపోల్లో ఆదిలాబాద్ 1,021 బుకింగ్స్తో ముందంజలో నిలిచింది. ఉట్నూరు 222 బుకింగ్స్ను మాత్రమే నమోదుచేసి ఆరోస్థానంలో ఉంది.
ఆదరణ పెరుగుతోంది : సాయన్న, నిర్మల్ బస్ డిపో మేనేజరు
ఇంటి ముంగిటకే కల్యాణోత్సవ తలంబ్రాలు తీసుకొచ్చేందుకు సంస్థ చేపట్టిన ‘లోక కల్యాణం- పచ్చతోరణం’ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. నిర్మల్ పరిధిలోనూ బుకింగ్స్ పెరుగుతున్నాయి. రీజియన్లో ప్రథమస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తాం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మూడు నెలలుగా నిరీక్షణ
[ 19-04-2024]
గిరిజనులు రోగాల బారిన పడి పరిస్థితి విషమంగా ఉంటే వారిని తరలించటానికి సమగ్ర గిరిజనాభివృద్ధి సంస్థ రెండు అంబులెన్స్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. -
కొంప ముంచుతున్న సిబిల్ స్కోరు
[ 19-04-2024]
పొట్టకూటి కోసం రోడ్లపైన, వీధుల్లో చిన్నపాటి వ్యాపారాలు చేసుకుంటున్న దీన పరిస్థితి వారిది. ఎండా వానను లెక్క చేయకుండా పండ్లు, కూరగాయలు, ఇతర వస్తువులు అమ్ముకుంటేనే జీవనం సాగేది. -
సమాచారమంతా తెరపైనే
[ 19-04-2024]
ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం పక్కాగా ఏర్పాట్లు చేస్తోంది. ఒకప్పటితో పోలిస్తే ప్రస్తుతం డిజిటల్ అక్షరాస్యత విపరీతంగా పెరిగింది. -
ఎన్నికల బరి.. 19వ సారి
[ 19-04-2024]
ఆదిలాబాద్ ఓటర్ల అంతరంగం అంచనాకు చిక్కదు. ఎప్పుడు ఏ పార్టీని గెలిపిస్తారనేది తెలియకుండా ఉంటుంది. గత లోక్సభ ఫలితాలను పరిశీలిస్తే. -
తొలిరోజు రెండు నామపత్రాలు
[ 19-04-2024]
లోక్సభ ఎన్నికల్లో తొలిఘట్టమైన నామపత్రాల స్వీకరణ ప్రక్రియ గురువారం మొదలైంది. తొలిరోజు రెండు నామపత్రాలు దాఖలయ్యాయి. -
పంచ్లతో పతకాలు
[ 19-04-2024]
ఉమ్మడి జిల్లాలో కరాటేను పరిచయం చేసిన వారిలో చెప్పుకోదగ్గ మాస్టర్ చుక్క ధర్మరాజ్. సుమారు 35 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ ప్రస్థానం నేటికీ ఆయన శిష్యులు కొనసాగిస్తున్నారు. -
వలసల జోరు... ఖాళీ అవుతున్న కారు
[ 19-04-2024]
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పార్టీల్లో వలసల జోరు కొనసాగుతోంది. భారాస నుంచి ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీ పదవులు చేపట్టిన పేరున్న నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. తమ రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారుతుండటంతో జిల్లాలో -
గుట్టుగా.. బెట్టింగ్
[ 19-04-2024]
ఐపీఎల్ ప్రపంచకప్ క్రికెట్ పోటీలు జోరుగా సాగుతున్నాయి. అదే సమయంలో బెట్టింగ్ సైతం ఊపందుకుంది. ఒకప్పుడు పెద్ద పట్టణాల్లో అక్కడక్కడా గుట్టుగా సాగిన ఈ వ్యవహారం ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానం -
నీటిబొట్టు.. ఒడిసిపట్టి
[ 19-04-2024]
జన్నారం మండలంలోని కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రంలోని మూగజీవాలకు తాగునీటి ఇబ్బంది లేకుండా అటవీ శాఖ అధికారులు చర్యలు చేపడుతున్నారు. -
మందులిచ్చేవారేరి?
[ 19-04-2024]
ఔషధ దుకాణాలు, ఫార్మసిస్టు లేనిదే నిర్వహణకు అనుమతి లేదు. విక్రయాలు ఏ మాత్రం చేయకూడదని సంబంధిత నియంత్రణ శాఖ చెబుతోంది. కానీ ఈ నియమాలన్నీ ప్రైవేటు వ్యవస్థకే తప్పితే ప్రభుత్వ సంస్థలకు అవసరం లేదనే పరిస్థితి నెలకొంది. -
వడ్డీ వ్యాపారుల ఇళ్లల్లో పోలీసుల తనిఖీలు
[ 19-04-2024]
కాగజ్నగర్ పట్టణంలో ఎలాంటి అనుమతి, రిజిస్ట్రేషన్ లేకుండా ఫైనాన్స్ పేరిట అధిక వడ్డీ వ్యాపారం చేస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు జిల్లా ఎస్పీ ఆదేశాలతో గురువారం పట్టణంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. -
అక్రమ వెంచర్లు సిద్ధం.. సక్రమానికి యత్నం
[ 19-04-2024]
అధికారులు ఎన్నికల విధుల్లో ఉండగా.. మరోవైపు భూ బకాసురులు అక్రమ వెంచర్లలో ప్లాట్ల విక్రయాలను జోరుగా సాగిస్తున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్
-
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
-
కొనసాగుతోన్న తొలివిడత పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు
-
వినూత్న ‘సైకిల్’ ప్రచారం.. ఓటర్లను ఆకట్టుకునే యత్నం!
-
ఇరాన్-ఇజ్రాయెల్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. భారీ నష్టాల్లో మార్కెట్ సూచీలు
-
అంపైర్గా పని చేసి.. ఐపీఎల్లో అదరగొట్టి... నయా సంచలనం అశుతోష్ కథ ఇది!