logo

Andhra News: భర్తను బెదిరిద్దామని భార్య పురుగు మందు తాగి..

భర్తను బెదిరిద్దామని కలుపు మందు తాగిన వివాహిత ఉదంతం విషాదాంతమైంది. పోలీసుల కథనం ప్రకారం.. చురుగుల చిరంజీవి, జయంతి (32)లు భార్యా భర్తలు.

Updated : 07 Apr 2022 09:52 IST

పెనమలూరు, న్యూస్‌టుడే: భర్తను బెదిరిద్దామని కలుపు మందు తాగిన వివాహిత ఉదంతం విషాదాంతమైంది. పోలీసుల కథనం ప్రకారం.. చురుగుల చిరంజీవి, జయంతి (32)లు భార్యా భర్తలు. భర్త స్వస్థలం నరసరావుపేట కాగా.. భార్య స్వగ్రామం అమరావతి మండలం పెదమద్దూరు. కొంతకాలంగా వీరు గంగూరులో నివసిస్తుండగా భర్త కార్పెంటర్‌గా పనిచేస్తుంటాడు. అతడు మద్యానికి బాగా అలవాటుపడటంతో భార్య తరచూ మథనపడుతుండేది. అయినా భర్తతో ఎలాంటి మార్పు రాలేదు. గత నెల 30వ తేదీన భర్తను బెదిరించడానికి జయంతి ఇంట్లో ఉన్న కలుపు మందు తాగింది. దీంతో భర్త ఈమెను వెంటనే నరసరావుపేటలోని ఆసుపత్రికి తరలించాడు. అక్కడ ఈమె ఆరోగ్యస్థితి కుదుటపడకపోవడంతో రెండ్రోజుల క్రితం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చగా.. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి ఆమె మృతి చెందింది. అనుమానాస్పద మృతిగా పోలీసులు బుధవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని