logo

Telangana News: పెళ్లి భోజనం పెట్టలేదని కుటుంబం సామాజిక బహిష్కరణ

ఏడాది క్రితం జరిగిన వివాహానికి సంబంధించి భోజనాలు పెట్టలేదని ఓ కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేసిన ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంటలో......

Updated : 11 Apr 2022 09:17 IST


మద్దికుంటలో ఇంటికి తాళం వేసి నిరసన వ్యక్తం చేస్తున్న బాధితులు

మద్దికుంట(రామారెడ్డి), న్యూస్‌టుడే: ఏడాది క్రితం జరిగిన వివాహానికి సంబంధించి భోజనాలు పెట్టలేదని ఓ కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేసిన ఘటన కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంటలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబసభ్యులు యెల్ది పోశయ్య, కొడుకు మహిపాల్‌, కోడలు రేణుక ఆదివారం తమ ఇంటికి తాళం వేసుకొని నిరసన తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. పోశయ్య కుమార్తె ఏడాది క్రితం వివాహం చేసుకుని వెళ్లిపోయారు. అప్పటి నుంచి తమకు భోజనాలు పెట్టాలని కులపెద్దలు అడుగుతున్నారు. దుబాయ్‌ వెళ్లిన కొడుకు మహిపాల్‌ నెల రోజుల క్రితం ఇంటికి రావడంతో ఇప్పుడైనా పెట్టాల్సిందేనని పట్టుబట్టారు. వారు అంగీకరించకపోవడంతో ఏడాదిపాటు శుభ, అశుభ కార్యాలకు పిలవకుండా ఇటీవల బహిష్కరించారు. వెళితే రూ.10 వేలు జరిమానా విధిస్తామని హుకుం జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఈ అవమానాలు భరించే కన్నా ఆత్మహత్యే మేలని కన్నీరుమున్నీరవుతున్నారు. సర్పంచి రాంరెడ్డిని ‘న్యూస్‌టుడే’ వివరణ కోరగా కుల పెద్దలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. బాధితుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్సై భువనేశ్వర్‌రావు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని