Hyd News: నేడే వీరహనుమాన్ విజయయాత్ర.. ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడంటే?
హనుమజ్జయంతి సందర్భంగా ఏటా వైభవోపేతంగా నిర్వహించే వీరహనుమాన్ విజయయాత్రను ప్రశాంతంగా పూర్తిచేసేందుకు పోలీస్ యంత్రాంగం సిద్ధమైంది. 8000 మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వహించనున్నారు.
గౌలిగూడ రామాలయం- తాడ్బండ్ వీరాంజనేయ స్వామి దేవాలయం వరకు నిఘా
8 వేల మంది పోలీసుల మోహరింపు
శోభాయాత్ర సాగే మార్గాన్ని నగర సీపీ సీవీ ఆనంద్కు వివరిస్తున్న ఏసీపీ పి.దేవేందర్, చిత్రంలో అదనపు సీపీ చౌహాన్ తదితరులు
ఈనాడు, హైదరాబాద్; సుల్తాన్బజార్, గాంధీనగర్, కంటోన్మెంట్, న్యూస్టుడే: హనుమజ్జయంతి సందర్భంగా ఏటా వైభవోపేతంగా నిర్వహించే వీరహనుమాన్ విజయయాత్రను ప్రశాంతంగా పూర్తిచేసేందుకు పోలీస్ యంత్రాంగం సిద్ధమైంది. 8000 మంది పోలీసులు బందోబస్తు విధులు నిర్వహించనున్నారు. గౌలిగూడ రామ్మందిర్ నుంచి తాడ్బండ్లోని వీరాంజనేయస్వామి దేవాలయం వరకూ 21 కి.మీ. మేర యాత్ర కొనసాగనుంది. వీహెచ్పీ, బజరంగ్దళ్ నేతృత్వంలో శనివారం ఉదయం 11 గంటలకు ప్రారంభమై రాత్రి 8 గంటలకు ముగిసే ఈ ఊరేగింపులో వేల సంఖ్యలో కార్యకర్తలు, యువకులు పాల్గొననున్నారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్, తదితర కీలక ప్రాంతాల్లో యాత్ర కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం కొత్వాల్ సీవీ ఆనంద్ తాడ్బండ్ వీరాంజనేయ స్వామి ఆలయానికి చేరుకొని స్వామివారిని దర్శించుకొన్నారు. అక్కడ పోలీసు ఉన్నతాధికారులతో సమీక్షించారు. అదనపు పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్, జాయింట్ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ ఏవీ రంగనాథ్, స్పెషల్ బ్రాంచి జాయింట్ పోలీస్ కమిషనర్ పి.విశ్వప్రసాద్, జాయింట్ పోలీస్ కమిషనర్(అడ్మిన్) ఎం.రమేష్, జాయింట్ పోలీస్ కమిషనర్(సీసీఎస్) జి.భూపాల్, డీసీపీలు ప్రకాశ్రెడ్డి, రాజేష్చంద్ర, చందనాదీప్తి, చక్రవర్తి, అదనపు డీసీపీ రమణారెడ్డి, చిక్కడపల్లి ఏసీపీ చల్లా శ్రీధర్, వీరాంజనేయస్వామి ఆలయ ఈవో అంబుజ తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యక్ష ప్రసారం: ఊరేగింపును ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాలను ఆయా ఠాణాల ద్వారా కంట్రోల్ రూంకు అనుసంధానించి పరిశీలించనున్నారు. అదనంగా మరో నాలుగు డ్రోన్ కెమెరాలు వినియోగించనున్నారు.
ట్రాఫిక్ ఆంక్షలు..
* ఊరేగింపు సాగనున్న ప్రాంతాల్లో శనివారం ఉదయం 11 నుంచి రాత్రి 8 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలవనున్నాయి.
* ఉదయం 11- మధ్యాహ్నం 12.30 గౌలిగూడ రామ్మందిర్ నుంచి ఆంధ్రా బ్యాంక్ కోఠి వరకు.
* మ. 12.30-1.30 వరకు: కోఠీలోని డీఎంహెచ్ కార్యాలయం నుంచి కాచిగూడ క్రాస్రోడ్స్ వరకు.
* మ. 1.30-2.15 గంటలు: కాచిగూడ క్రాస్రోడ్స్ నుంచి నారాయణగూడ క్రాస్రోడ్స్ వరకు.
* మ.2.15-4.15: ఆర్టీసీ క్రాస్రోడ్స్, వీఎస్టీ, బాగ్లింగంపల్లి, ఇందిరాపార్క్, కవాడీగూడ క్రాస్రోడ్స్ వరకు.
* సాయంత్రం 4.15-5.45: పాత రాంగోపాల్పేట ఠాణా వరకు.
* సా.6-7: ప్యారడైజ్ కూడలి నుంచి బ్రూక్బాండ్ కాలనీ వరకు.
* సా.7- రాత్రి 8: బ్రూక్బాండ్ నుంచి తాడ్బండ్ వీరాంజనేయ స్వామిదేవాలయం వరకు.
నేడు మద్యం అమ్మకాలు బంద్
నేరేడ్మెట్: హనుమజ్జయంతిని పురస్కరించుకొని రాచకొండ కమిషనరేట్ పరిధిలో శనివారం ఉదయం 6 నుంచి ఆదివారం ఉదయం 6గంటల వరకు మద్యం అమ్మకాలు ఉండవని సీపీ మహేష్భగవత్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆన్లైన్లోనూ నామినేషన్ వేయొచ్చు: వికాస్ రాజ్
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆన్లైన్లోనూ నామినేషన్ దాఖలు చేయవచ్చని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. -
పదేళ్లలో తెలంగాణకు భాజపా ఏం చేసిందో చెప్పాలి?: పొన్నం ప్రభాకర్
[ 18-04-2024]
రాష్ట్రానికి ఇప్పటివరకు భాజపా ఏం చేసిందో చెప్పాలని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. -
గత పదేళ్లలో తెలంగాణకు రూ.10 లక్షల కోట్లు: కిషన్రెడ్డి
[ 18-04-2024]
గత పదేళ్లలో తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు కేటాయించిందని కేంద్ర మంత్రి, తెలంగాణ భాజపా అధ్యక్షుడు కిషన్రెడ్డి తెలిపారు. -
గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం: వాతావరణ శాఖ
[ 18-04-2024]
రాష్ట్రంలో గురు, శుక్రవారాల్లో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. -
ఆపరేషన్ మల్కాజిగిరి
[ 18-04-2024]
లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా వీలైనన్ని ఎక్కువ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కార్యాచరణ రూపొందించిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు మల్కాజిగిరి లోక్సభ స్థానంపై ప్రత్యేకంగా దృష్టిసారించారు. -
పరాజయానికి వెరవక.. లక్ష్యం వీడక
[ 18-04-2024]
వారిది పేద కుటుంబం. నాన్న పడిన కష్టాలు దగ్గరుండి చూసిన ఆ యువకుడు ఉన్నతాశయమే లక్ష్యంగా ముందుకు సాగాడు. ప్రతికూల పరిస్థితుల మధ్య చదువుతూ ఐఏఎస్ సాధించాలన్న పట్టుదలతో సాధన చేశాడు. -
సత్వరం జనన, మరణ ధ్రువ పత్రాల మంజూరు
[ 18-04-2024]
పురపాలికల్లో జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు అర్జీదారులకు సత్వరమే అందేలా పురపాలక శాఖ చర్యలు తీసుకుంటోంది. పట్టణ ప్రజలు ఇక నుంచి కార్యాలయాల చుట్టు తిరగకుండా వెంటనే జారీ చేసే విధంగా ప్రణాళిక రూపొందించింది. -
కుటుంబ కలహాలతో పోలీసు డ్రైవర్ ఆత్మహత్య
[ 18-04-2024]
కుటుంబ కలహాలతో పోలీసు డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్నారు. జీడిమెట్ల ఎస్సై నాయుడు తెలిపిన వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ వెంకటేశ్వర కాలనీలో నివాసముండే గుంటి శ్రీనివాస్(38) గతంలో ఆర్మీలో విధులు నిర్వహించి ఉద్యోగ విరమణ పొందారు -
డ్రగ్స్కు బానిసై.. విక్రయాల బాట
[ 18-04-2024]
ఇంజినీరింగ్ చదువుతున్న సమయంలోనే మాదకద్రవ్యాలకు బానిసైన ఆ యువకుడు విలాస జీవితానికి అలవాటుపడ్డాడు. డబ్బుల కోసం డ్రగ్స్ విక్రయించేందుకు యత్నిస్తూ పోలీసులకు చిక్కాడు -
వోగ్ స్టార్ మిసెస్ ఇండియా రన్నరప్గా స్నేహాపాటిల్
[ 18-04-2024]
హైదరాబాద్కు చెందిన స్నేహా పాటిల్ వోగ్ స్టార్ మిసెస్ ఇండియా - 2024 రన్నరప్గా నిలిచారు. ఏప్రిల్ 14న జైపూర్లో నిర్వహించిన పోటీల్లో దేశవ్యాప్తంగా 70 మంది పాల్గొన్నారు -
జూబ్లీహిల్స్ కేసులో నా కుమారుడిని ఇరికించే కుట్ర
[ 18-04-2024]
జూబ్లీహిల్స్ రోడ్డు ప్రమాదం కేసులో తన కుమారుడిని ఇరికించేందుకు పోలీసులు కుట్ర చేస్తున్నారని బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ ఆరోపించారు. -
ఎన్నికల తనిఖీల్లో రూ.14.31 కోట్లు స్వాధీనం
[ 18-04-2024]
ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎన్ఫోర్స్మెంట్ బృందాల తనిఖీల్లో ఇప్పటి వరకు రూ.14,31,65,540 నగదు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్రాస్ తెలిపారు -
నగరానికి శోభ.. రామమయం యాత్ర
[ 18-04-2024]
వీధులన్నీ రామనామంతో మార్మోగాయి.. కాషాయ జెండాలు రెపరెపలాడాయి.. భాగ్యనగర శ్రీరామ నవమి ఉత్సవ సమితి, శ్రీరామ్ యువసేన ఆధ్వర్యంలో శ్రీరామనవమి సందర్భంగా బుధవారం శోభాయాత్రలు నిర్వహించారు -
అదే జోరు.. సాగాలి కారు
[ 18-04-2024]
శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించినట్లే రాజధాని పరిధిలో నాలుగు లోక్సభ స్థానాల్లో కనీసం మూడింటిలోనైనా గులాబీ జెండా ఎగరేయాలని భారాస గట్టి ప్రయత్నాలు చేస్తోంది -
నేటి నుంచే నామినేషన్ల పర్వం
[ 18-04-2024]
నాలుగు లోక్సభ, కంటోన్మెంట్ శాసనసభ స్థానాల ఎన్నికలకు సంబంధించి గురువారం నుంచే నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ మొదలు కాబోతోంది. -
గ్రేటర్ పరిధిలో 5 లక్షల ఓట్ల తొలగింపు
[ 18-04-2024]
గ్రేటర్ పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2023 జనవరి నుంచి ఇప్పటివరకు ఓటర్ల జాబితాలను సవరించి ఐదు లక్షలకు పైగా ఓట్లను తొలగించినట్లు బల్దియా కమిషనర్ రోనాల్డ్రాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
సంరక్షణపై నీలినీడలు
[ 18-04-2024]
బాల నేరస్థులకు ఆశ్రయం కల్పించే రాష్ట్రంలోని ఏకైక జువైనల్ హోమ్ నిర్వహణ గాలిలో దీపంలా మారింది. మౌలిక సదుపాయాల కొరత ఒకెత్తయితే.. సరిపడా సిబ్బంది లేక చిన్నారుల్ని సంరక్షించలేకపోవడం పెద్ద వైఫల్యం. తాజాగా గాజులరామారంలోని జువైనల్ హోమ్ నుంచి 8 మంది బాలురు తప్పించుకొని పారిపోవడం కలకలం రేపింది. -
బైకును 100 మీటర్లు ఈడ్చుకెళ్లిన లారీ
[ 18-04-2024]
లారీ ద్విచక్ర వాహనదారుడిని ఢీ కొట్టి మరింత వేగంగా నడిపి కారును ఢీ కొట్టాడు. ఐఎస్ సదన్ ఠాణా పరిధిలో జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. -
రూ.70 లక్షల విలువైన బంగారు వజ్రాభరణాల చోరీ
[ 18-04-2024]
ఓ వ్యాపారి ఇంట్లో రూ.70లక్షల విలువైన బంగారు వజ్రాభరణాలు చోరీకి గురయ్యాయి. -
మహిళా ఎస్సై సస్పెన్షన్
[ 18-04-2024]
కేపీహెచ్బీ ఎస్సై మౌనికను క్రమశిక్షణారాహిత్య చర్యల కింద సైబరాబాద్ కమిషనర్ సీపీ అవినాశ్ మహంతి సస్పెండ్ చేశారు -
ఎన్నికల సమగ్రసమాచారం.. ఓటరుకు ఉపయుక్తం
[ 18-04-2024]
సార్వత్రిక ఎన్నికల్లో శతశాతం ఓటింగ్ లక్ష్యంగా ఎన్నికల అధికారులు నగరంలో విస్తృతంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు
తాజా వార్తలు (Latest News)
-
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాం.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: ‘ఉత్తమ విలన్’పై లింగుస్వామి షాకింగ్ కామెంట్స్
-
బాలీవుడ్ నటుడు రణ్వీర్సింగ్ ఏఐ వీడియో వైరల్
-
ఇన్స్టామార్ట్తో స్విగ్గీ మాల్ అనుసంధానం.. నిమిషాల్లోనే ఆ వస్తువులూ డెలివరీ
-
వదిన- మరదళ్ల సవాల్.. బారామతిలో నామినేషన్ వేసిన సుప్రియా, సునేత్ర
-
ఏపీలో నాలుగు బహిరంగ సభల్లో పాల్గొననున్న ప్రధాని మోదీ
-
ఆ టైంలో నేను దేశంలోనే లేను.. రెజ్లర్లపై వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ పిటిషన్