మంత్రి ఉషశ్రీచరణ్ ర్యాలీ.. ఆస్పత్రికి తీసుకెళ్తుండగా అడ్డుకోవడంతో చిన్నారి మృతి!
ప్రాణాపాయ స్థితిలో ఉన్న పసిపాపను ఆసుపత్రికి తీసుకెళుతున్న తల్లిదండ్రులను మంత్రి ఊరేగింపు ఉందనే కారణంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సకాలంలో చికిత్స అందక తమ కూతరు ప్రాణాలు కోల్పోయిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
తల్లిదండ్రుల ఆరోపణ
పాప మృతదేహాన్ని ఎత్తుకుని విలపిస్తున్న తండ్రి గణేష్
కళ్యాణదుర్గం గ్రామీణం, న్యూస్టుడే: ప్రాణాపాయ స్థితిలో ఉన్న పసిపాపను ఆసుపత్రికి తీసుకెళుతున్న తల్లిదండ్రులను మంత్రి ఊరేగింపు ఉందనే కారణంతో పోలీసులు అడ్డుకున్నారు. దీంతో సకాలంలో చికిత్స అందక తమ కూతురు ప్రాణాలు కోల్పోయిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన కళ్యాణదుర్గంలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. శెట్టూరు మండలం చెర్లోపల్లికి చెందిన గణేష్, ఈరక్కకు 8 నెలల కిందట కూతురు పుట్టింది. శుక్రవారం సాయంత్రం పాప తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆటోలో కళ్యాణదుర్గం తీసుకొచ్చారు. స్థానిక ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం పట్టణానికి వస్తున్న సందర్భంగా భారీ ర్యాలీ ఏర్పాటు చేశారు. బందోబస్తులో భాగంగా పోలీసులు పట్టణ శివారులోని బ్రహ్మయ్యగుడి వద్ద వాహనాన్ని నిలబెట్టారు. ఆలస్యమవుతుందని అడ్డదారిలో తెలిసినవారి ద్విచక్రవాహనంలో 15 నిమిషాల తర్వాత ఆర్డీటీ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు చెప్పారని తల్లిదండ్రులు వాపోయారు. పోలీసులు అడ్డుకోకుండా ఉంటే తమ పాప బతికేదని తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటూ విలపించారు. సకాలంలో అంబులెన్సు కూడా రాలేదని పాప మేనమామ ప్రశాంత్ ఆరోపించారు. పాప మృతదేహంతో రోడ్డుమీద బైఠాయించేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆ దంపతులకు మూడేళ్ల మరో కుమార్తె ఉంది. కళ్యాణదుర్గం పట్టణ సీఐ తేజోమూర్తి వివరణ కోరగా ర్యాలీ బందోబస్తులో భాగంగా తాము ఎవరినీ అడ్డుకోలేదని.. పాపకు అస్వస్థత అని తెలియగానే వారిని పంపించామని వివరించారు
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏడో రోజు జోరుగా నామినేషన్లు
[ 25-04-2024]
ప్రధాన పార్టీలైన తెదేపా, కాంగ్రెస్, వైకాపా, బీఎస్పీ తదితర పార్టీల అభ్యర్థులు, స్వతంత్రులు బుధవారం జోరుగా నామినేషన్ వేశారు. -
విధేయతకు తెదేపా పట్టం
[ 25-04-2024]
అనంతపురం జిల్లా తెదేపా అధ్యక్షుడిగా జి.వెంకట శివుడు యాదవ్ నియమించారు. ఈ మేరకు బుధవారం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. -
నిర్మించలేదు.. నిర్వహణ చేతకాదు
[ 25-04-2024]
కల్లబొల్లి మాటలు చెప్పడం తప్ప జగన్ ప్రభుత్వం ఈ ఐదేళ్లలో రైతులకు ఉపయోగపడే పని ఒక్కటీ చేయలేదు. తాను నిర్మించలేదు.. -
అనంత నగరం.. పసుపుమయం
[ 25-04-2024]
అనంతపురం అర్బన్ తెదేపా అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ నామినేషన్ సందర్భంగా బుధవారం అనంతపురం అర్బన్ క్యాంపు కార్యాలయానికి ఉదయం 8 గంటలకే -
వంతెన నిర్మాణాన్ని విస్మరించిన జగన్ సర్కార్
[ 25-04-2024]
వైకాపా పాలనలో భూతద్దం పెట్టి వెతికినా అభివృద్ధి కనిపించదు. తెదేపా హయాంలో తలపెట్టిన పనుల్ని ఐదేళ్లుగా జగన్ ప్రభుత్వం పక్కనపెట్టేసింది. ఉరవకొండ మండలం కైకుంట్ల నుంచి వై.రాంపురం మార్గంలో హంద్రీనీవా -
వైకాపా అసమర్థ అభ్యర్థిని ఓడిస్తేనే అభివృద్ధి: కేశవ్
[ 25-04-2024]
ఉరవకొండ, విడపనకల్లు, వజ్రకరూరు, బెళుగుప్ప, న్యూస్టుడే: వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి విశ్వేశ్వరరెడ్డి అసమర్థుడని, ఆయన్ను ఈ ఎన్నికల్లో ఓడిస్తేనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యం అవుతుందని తెదేపా అభ్యర్థి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఉద్ఘాటించారు. -
ఐదేళ్ల పాలన చూశాం.. మళ్లీ తప్పు చేయొద్దు
[ 25-04-2024]
పేరూరు డ్యాంకు నీరు తెచ్చాం, బంగారు గనులను తెరిపించి ఉద్యోగాలు కల్పించాం.. అంటూ ప్రకాశ్రెడ్డి అన్ని అబద్ధాలే చెబుతారని మాజీ మంత్రి పరిటాల సునీత ధ్వజమెత్తారు. -
రాయదుర్గం సర్వతోముఖాభివృద్ధికి కృషి : కాలవ
[ 25-04-2024]
రాయదుర్గం సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు అన్నారు. బుధవారం మధ్యాహ్నం ఆయన నామినేషన్ దాఖలు చేశారు. -
పెద్దారెడ్డి నామినేషన్.. అంతా పరేషాన్
[ 25-04-2024]
తాడిపత్రి వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి బుధవారం నామినేషన్ వేసేందుకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ప్రధాన రహదారి సీబీ రోడ్డును రెండువైపులా బ్లాక్ చేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. -
ఏడో రోజు 54 నామినేషన్ల దాఖలు
[ 25-04-2024]
జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఏడో రోజు హిందూపురం పార్లమెంటు స్థానానికి ఏడు, ఏడు అసెంబ్లీ స్థానాలకు 47 మొత్తం 54 నామినేషన్లు దాఖలు చేశారు. -
కొండలు కరిగించి.. నిధులు కొల్లగొట్టి
[ 25-04-2024]
అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైకాపా నాయకులు మట్టి వ్యాపారుల అవతారమెత్తి కొండలను కరిగించేశారు. కదిరి ప్రాంతంలోని -
నీరు కుప్పం వెళ్లింది.. చెరువు ఎండింది
[ 25-04-2024]
వైకాపా ప్రభుత్వం హంద్రీనీవా జలాలను కుప్పం తీసుకెళ్లడం ఫలితంగా ముదిగుబ్బ మండలంలోని దొరిగల్లు చెరువు ఎండింది. ఈ చెరువు కింద ఖరీఫ్లో సుమారు 500, రబీలో 200 ఎకరాల వరకు ఆయకట్టు సాగవుతోంది. -
పేరుకే పెద్దాసుపత్రి... ఓపీ సేవలు నామమాత్రం
[ 25-04-2024]
ఉరవకొండ 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ సేవలు నామమాత్రంగా అందుతున్నాయి. దాంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తాజా వార్తలు (Latest News)
-
30 వైడ్ బాడీ విమనాలకు ఇండిగో ఆర్డర్.. ఎయిరిండియాకు గట్టి పోటీ!
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
అత్యాచారం కేసు.. హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్స్టీన్కు ఊరట
-
VI 2.0కు నాంది.. మళ్లీ పుంజుకొంటాం: కుమార మంగళం బిర్లా
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM