HYD News: బాబోయ్ దొంగలు.. తూచ్ అంతా ఒట్టిదే!
ఇటీవల బహదూర్పల్లికి చెందిన కార్తీక్ అనే యువకుడు డయల్ 100కు ఫోన్చేసి రైళ్లలో బాంబులు అమర్చారంటూ సమాచారం చేరవేశాడు. ఆగమేఘాల మీద రైల్వే పోలీసులు, బాంబు స్క్వాడ్, జాగిలాలతో
కుటుంబ కలహాలతో ఇళ్లలో చోరీ డ్రామాలు
డయల్ 100కు 10శాతం పైగా నకిలీ ఫోన్కాల్స్
మహానగరంలో పోలీసులకు వింత అనుభవాలు
ఇటీవల బహదూర్పల్లికి చెందిన కార్తీక్ అనే యువకుడు డయల్ 100కు ఫోన్చేసి రైళ్లలో బాంబులు అమర్చారంటూ సమాచారం చేరవేశాడు. ఆగమేఘాల మీద రైల్వే పోలీసులు, బాంబు స్క్వాడ్, జాగిలాలతో తనిఖీ చేసి అవన్నీ వదంతులని తేల్చారు. ఆ యువకుడిపై కేసు నమోదు చేశారు.
ఈనాడు, హైదరాబాద్ రాజేంద్రనగర్, న్యూస్టుడే: సైబరాబాద్, హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో డయల్ 100కు రోజూ 800-900 ఫోన్కాల్స్ వస్తుంటాయి. ఘటన జరిగిన ప్రాంతానికి పోలీసులు 6-7 నిమిషాల వ్యవధిలో చేరుతున్నారు. కొందరు ఆకతాయిలు. మరికొందరు కుటుంబ తగాదాలతో విలువైన పోలీసుల సమయాన్ని వృథా చేస్తున్నారు.సామాజిక మాధ్యమాల్లో గుర్తింపు తెచ్చుకోవాలనే ఆలోచనతో కొందరు ప్రబుద్ధులు చేస్తున్న చేష్టలపై పోలీసులు సీరియస్ యాక్షన్ తీసుకునేందుకు సిద్ధమయ్యారు. ఏటా డయల్ 100కు వచ్చే ఫోన్కాల్స్లో 10శాతం వరకూ కుటుంబ గొడవలు, ఆటపట్టించాలనే ఉద్దేశంతో చేస్తున్నవి ఉంటున్నాయని పోలీసు అధికారులు చెబుతున్నారు. గతంలో తప్పుడు ఫోన్కాల్స్ చేసిన వారికి కౌన్సెలింగ్ ఇవ్వటం, మందలించి పంపటమో చేసేవారు. తాజా సంఘటనలో రాచకొండ పోలీసులు కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. ఈ మేరకు రాచకొండ సీపీ మహేష్ భగవత్ ఆదేశాలు జారీచేసినట్టు సమాచారం.
ఎవరి లెక్క వారిదే
స్మార్ట్ఫోన్లు చేతికొచ్చాక.. సామాజిక మాధ్యమాల్లో ఆకతాయిల హల్చల్ పెరిగింది. వాట్సాప్ గ్రూపుల్లో వచ్చే పోస్టులను యథాతథంగా ఫార్వార్డ్ చేస్తున్నారు. ఇవి కొన్ని ఇబ్బందులకు దారితీస్తున్నాయి.
* కుషాయిగూడ పరిధిలో రాజకీయపార్టీ నాయకులు గొడవ పడుతున్నారంటూ వాట్సాప్లో రాగానే ఓ యువకుడు పోలీసులకు సమాచారమిచ్చాడు. అక్కడకెళ్లి పరిశీలించిన పోలీసులు తప్పుడు ప్రచారంగా నిర్ధారించారు.
* శివారు ప్రాంతానికి చెందిన ఓ వృద్ధురాలు కుమారుడి సంరక్షణలో ఉంటోంది. నడుచుకుంటూ వెళ్తున్న తనపై దాడిచేసి మెడలో బంగారు గొలుసు లాక్కెళ్లినట్టు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసుల దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు లభించకపోవటంతో ఆమెను గట్టిగా మందలించటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గొలుసును తానే కుమార్తెకు ఇచ్చినట్టు అంగీకరించింది. విషయం కొడుక్కి తెలిస్తే కోప్పడతాడనే భయంతో అలా చేసినట్టు కన్నీరు పెట్టుకుంది.
* బండ్లగూడ సమీపంలోని ఇంట్లోకి చొరబడిన దొంగలు 40తులాల బంగారం ఎత్తుకెళ్లినట్టు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అక్కడ లభించిన వేలిముద్రలు పాత నేరస్తులతో సరిపోలకపోవడంతో ఇంటిదొంగల పని కావచ్చనే కోణంలో కుటుంబ సభ్యులను ప్రశ్నించారు. వయోధికులైన తల్లిదండ్రుల నుంచి సొమ్ము కాజేసేందుకు కుమారుడే భార్యతో కలసి డ్రామా ఆడినట్టు నిర్ధారించారు.
అక్రమ సంబంధాల్లోనే అధికం
ఉత్తుత్తి దొంగతనాలు, తప్పుడు ఫిర్యాదులు అక్రమ సంబంధాలు/సహజీవనం వల్లనే వస్తుంటాయని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మల్కాజిగిరి డివిజన్ పరిధిలో ఓ ఇంట్లో చోరీ జరిగింది. మహిళ ఒంటరిగా ఉన్న సమయంలో ప్రవేశించిన అగంతకుడు బంగారం ఎత్తుకెళ్లినట్టు బాధితురాలు ఫిర్యాదు చేశారు. దర్యాప్తులో అక్కడ చోరీ జరిగినట్టు ఆధారాలు లభించలేదు. బాధితురాలు పొంతనలేని సమాధానాలు చెబుతుండటంతో ఇదంతా ఇంటిదొంగ పని కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. గతంలో కేపీహెచ్బీ కాలనీలోని ఇంట్లో రూ.10 లక్షల విలువైన ఆభరణాలు మాయమయ్యాయి. కుటుంబ యజమాని ఫిర్యాదుతో పోలీసులు సీసీ టీవీ కెమెరాల ఫుటేజ్ను సేకరించారు. ఆ ఇంట్లోని మహిళే తన ప్రియుడికి బంగారు ఆభరణాలు, నగదు ఇచ్చి పంపినట్టు దర్యాప్తులో తేల్చారు. సున్నితమైన అంశాలు కావటంతో తప్పుడు ఫిర్యాదులుగా గుర్తించినా మందలించి వదిలేస్తున్నట్టు సైబరాబాద్కు చెందిన ఒక ఇన్స్పెక్టర్ తెలిపారు. పోలీసులను తప్పుదారి పట్టించేందుకే చేసినట్టు గుర్తిస్తే కేసులు నమోదు చేస్తున్నట్టు వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఖాళీ చేద్దాం.. పాగా వేసేద్దాం
[ 20-04-2024]
రాజధాని పరిధిలోని భారాస ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు కాంగ్రెస్లో చేరబోతున్నారా...! ప్రస్తుత పరిస్థితులు చూస్తే అవుననే సమాధానం వస్తోంది. -
2వ రోజు.. 17 నామినేషన్లు
[ 20-04-2024]
లోక్సభ ఎన్నికల్లో భాగంగా పలువురు అభ్యర్థులు శుక్రవారం నామినేషన్ పత్రాలు సమర్పించారు. రెండో రోజు మొత్తం 17 నామపత్రాలు దాఖలయ్యాయి. -
లక్ష్యం @ 60%
[ 20-04-2024]
రాష్ట్రంలోనే రాజధాని జిల్లాలో అతి తక్కువ మంది ఓటేస్తారన్న అభిప్రాయాన్ని.. రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో రూపుమాపుతామని జీహెచ్ఎంసీ స్పష్టం చేస్తోంది. -
మీమ్స్ తో ప్రచారం.. యువ ఓటర్లకు గాలం
[ 20-04-2024]
ఎన్నికల్లో గెలవాలంటే అనర్గళంగా ప్రసంగిస్తూ.. అన్నివర్గాల ఓటర్లను ప్రసన్నం చేసుకోవడం.. గెలిస్తే ఏం చేస్తామో చెప్పడం.. ప్రత్యర్థి పార్టీని విమర్శించడం ఒకప్పటి ప్రచార శైలి.. -
‘భాజపాకు తెలంగాణలో స్థానం లేకుండా చేయాలి’
[ 20-04-2024]
హైదరాబాద్లో సర్జికల్ స్ట్రైక్ చేయాలని ఆలోచన చేసే భాజపాకు తెలంగాణలో రాజకీయ స్థానం లేకుండా చేయాలని మజ్లిస్ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. -
ఒలింపిక్స్లో పతకం తెస్తే బీఎండబ్ల్యూ కారు
[ 20-04-2024]
ప్రపంచ నంబరు వన్ బ్యాడ్మింటన్ సాత్విక్ సాయిరాజ్ ఒలింపిక్స్లో పతకం గెలిస్తే బీఎండబ్ల్యూ కారు బహుమతిగా ఇస్తానని ఎఫ్ఎన్సీసీ స్పోర్ట్స్ కమిటీ ఛైర్మన్ చాముండేశ్వరినాథ్ ప్రకటించారు. -
భాజపా చేసిందేమీ లేదు: దానం
[ 20-04-2024]
భాజపా నాయకులు చెప్పుకొనేందుకు చేసింది ఏమీ లేక రాముడి పేరును దుర్వినియోగం చేస్తున్నారని కాంగ్రెస్ సికింద్రాబాద్ లోక్సభ అభ్యర్థి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విమర్శించారు. -
అతివేగానికి మూడు ప్రాణాలు బలి
[ 20-04-2024]
వాహనదారుల అతివేగం రెండు ప్రమాదాలకు కారణమై ముగ్గురి ప్రాణాలు తీసింది. బీడీఎల్ ఠాణా సీఐ రవీందర్రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. -
ఈవీ.. పరుగులేవీ?
[ 20-04-2024]
పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాల(ఈవీ) విక్రయాల్లో అంత పురోగతి కనిపించడం లేదు. ఆసక్తి చూపడం లేదు. -
జన్యులోపం బాలుడికి కాలేయ మార్పిడి విజయవంతం
[ 20-04-2024]
అరుదైన జన్యులోపంతో జన్మించి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడికి బంజారాహిల్స్లోని కేర్ ఆస్పత్రి వైద్యులు విజయవంతంగా కాలేయ మార్పిడి చేశారు. -
‘కాంగ్రెస్తోనే అన్ని వర్గాల సంక్షేమం’
[ 20-04-2024]
కాంగ్రెస్తోనే అన్నివర్గాల సంక్షేమం, అభ్యున్నతి సాధ్యమని అంతర్జాతీయ వైశ్య సమాఖ్య(ఐవీఎఫ్) రాష్ట్ర అధ్యక్షుడు ఉప్పల శ్రీనివాస్గుప్తా అన్నారు -
మున్నూరుకాపుల ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలి
[ 20-04-2024]
రాష్ట్రంలోని మున్నూరు కాపుల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్పొరేషన్ దోహదపడుతుందని తెలంగాణ మున్నూరు కాపు మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మణికొండ వెంకటేశ్వర్రావు, మున్నూరు కాపు సంఘం సికింద్రాబాద్ అధ్యక్షుడు లింగిశెట్టి హన్మంత్రావు అన్నారు. -
కాంగ్రెస్ అభ్యర్థి సునీత నామినేషన్కు సీఎం
[ 20-04-2024]
మల్కాజిగిరి లోక్సభ స్థానానికి కాంగ్రెస్ అభ్యర్థిగా పట్నం సునీతారెడ్డి ఈనెల 22న మధ్యాహ్నం 2గంటలకు నామినేషన్ వేస్తున్నారు. -
మహాకాళి అమ్మవారిని దర్శించుకున్న రాజ్నాథ్సింగ్
[ 20-04-2024]
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్సింగ్ భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్తో కలిసి సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. -
స్వచ్ఛ ఇంధనానికి చేతులు కలిపిన ఐఐసీటీ-బీహెచ్ఈఎల్
[ 20-04-2024]
స్వచ్ఛమైన, పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధిలో కలిసి పనిచేయాలని ఐఐసీటీ, బీహెచ్ఈఎల్ నిర్ణయించాయి. -
పదేళ్లలో పాలమూరును ఎడారిగా మార్చారు
[ 20-04-2024]
వంద రోజుల కాంగ్రెస్ పాలనలోనే పాలమూరులో రూ.10వేల కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
ప్రతిభకు పేదరికం అడ్డుకాదు: కలెక్టర్
[ 20-04-2024]
ప్రతిభకు పేదరికం అడ్డురాదని, సివిల్స్ ర్యాంకర్లే ఇందుకు నిదర్శనమని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రం వికారాబాద్లోని కలెక్టర్ కార్యాలయంలో వీడీడీఎఫ్ ఆధ్వర్యంలో అష్ఫక్ను సన్మానించారు. -
ఈకేవైసీ.. గడువుతో పనిలేదు
[ 20-04-2024]
నిరుపేదల కోసం ప్రభుత్వం ఉచితంగా రేషన్ బియ్యం సరఫరా చేస్తోంది. ఆహార భద్రత రేషన్ కార్డుల లబ్ధిదారులకు ఆధార్ అనుసంధానం (ఈ కేవైసీ) చేసుకునేందుకు ప్రభుత్వం గడువు నిబంధన అంటూ ఏమీ లేకుండా చేసింది. -
ఉత్తుత్తి బుకింగ్లు.. జలమండలికి టోకరా
[ 20-04-2024]
ఫేక్ బుకింగ్లతో కొందరు జలమండలికి టోకరా వేస్తున్నారు. ట్యాంకర్లకు కృత్రిమ కొరత ఏర్పడి..పెండింగ్ జాబితా అమాంతం పెరిగిపోతోంది. -
నగరానికి సాగర్ జలాల పంపింగ్
[ 20-04-2024]
హైదరాబాద్ జంట నగరాలు, నల్గొండ జిల్లా సాగునీటి అవసరాలు తీర్చేందుకు నాగార్జునసాగర్ జలాశయంలో జలమండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న అత్యవసర మోటార్ల ప్రయోగాత్మక పరిశీలన కొనసాగుతోంది. -
నగరం గరం
[ 20-04-2024]
-
కుమారుడిపై కేసు భయం.. తల్లి ఆత్మహత్య
[ 20-04-2024]
ఓ బాలుడు చేసిన తప్పు తల్లి ప్రాణాలకు ముప్పుతెచ్చింది. ఈ ఘటన ఫిల్మ్నగర్లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాల ప్రకారం.. కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లికి చెందిన వెంకటరమణ, సూర్యకుమారి దంపతులు నగరానికి కొన్నేళ్ల క్రితం వచ్చారు. -
క్యాబ్లలో వస్తువులు మరిచిపోతున్నారు..!
[ 20-04-2024]
క్యాబ్లలో ప్రయాణికులు వస్తువులు మర్చిపోయే నగరాల జాబితాలో హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది. ‘లాస్ట్ అండ్ ఫౌండ్ - 2024’ నివేదికను ఉబర్ సంస్థ శుక్రవారం విడుదల చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
తెదేపా కార్యాలయం వద్ద టాస్క్ఫోర్స్ కదలికలు
-
సుప్రీం లీడర్ పుట్టిన రోజే ఇరాన్పై దాడులు.. అమెరికాకు చివరి క్షణంలో తెలిసిందట!
-
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (19/04/24)
-
‘ప్రేమలు 2’ ఫిక్స్.. రిలీజ్ ఎప్పుడంటే?